
భారతీయ టెలికాం రంగంలో సంచలనాలు సృష్టించిన రిలయన్స్ జియో.. ఇప్పుడు అంతర్జాతీయ సాంకేతిక వేదికపై ఏకైక భారతీయ కంపెనీగా సరికొత్త చరిత్ర సృష్టించింది. వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ తాజాగా విడుదల చేసిన గ్లోబల్ పేటెంట్స్ ర్యాంకింగ్స్లో జియో ప్లాట్ఫార్మ్స్ ప్రపంచంలోనే టాప్ 20 స్థానాల్లో నిలిచింది. ఈ ఘనత సాధించిన ఏకైక భారతీయ టెక్నాలజీ కంపెనీగా జియో రికార్డులకెక్కింది. ముంబై వేదికగా జరిగిన అధికారిక ప్రకటనలో.. గ్లోబల్ టెక్ దిగ్గజాలైన యాపిల్, గూగుల్, మైక్రోసాఫ్ట్, శామ్సంగ్, క్వాల్కామ్, నోకియా, హువాయ్ వంటి ఎలైట్ క్లబ్ సరసన జియో చేరినట్లు సంస్థ వెల్లడించింది.
గతేడాదితో పోలిస్తే జియో ప్లాట్ఫార్మ్స్ ఏకంగా 320 స్థానాలను దాటుకుంటూ గ్లోబల్ టాప్-20 లోకి దూసుకురావడం విశేషం. ప్రపంచవ్యాప్తంగా పేటెంట్ ఫైలింగ్స్ వృద్ధి రేటు కేవలం 1శాతం కంటే తక్కువగా నమోదైన ఈ తరుణంలో జియో ఈ రేంజ్లో దూసుకెళ్లడం అంతర్జాతీయ టెక్ నిపుణులను సైతం ఆశ్చర్యపరుస్తోంది. జియో కేవలం టెక్నాలజీని వాడుకునే కంపెనీ మాత్రమే కాదని, ప్రపంచానికి సరికొత్త టెక్నాలజీని సృష్టించి ఇచ్చే స్థాయికి ఎదిగిందని ఈ ర్యాంకింగ్ స్పష్టం చేస్తోంది.
జియో తన రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో ఎక్కువగా భవిష్యత్తును శాసించే సరికొత్త టెక్నాలజీలపైనే దృష్టి పెట్టింది. వాటిలో ముఖ్యమైనవి
ఈ చారిత్రాత్మక విజయంపై జియో ప్లాట్ఫార్మ్స్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆకాష్ అంబానీ సంతోషం వ్యక్తం చేశారు. ‘‘WIPO గ్లోబల్ టాప్ 20 ర్యాంకింగ్స్లోకి జియో చేరడం అనేది.. మేం డీప్ టెక్ కంపెనీగా మారడానికి ఇన్నేళ్లుగా పడిన కష్టానికి దక్కిన గుర్తింపు. జియోలో టెక్నాలజీ ఆవిష్కరణలు ఎంత వేగంగా జరుగుతున్నాయో ఇది నిరూపిస్తోంది. ఈ అద్భుతమైన మైలురాయిని ప్రధాని నరేంద్ర మోదీ ఆత్మనిర్భర్ భారత్ విజన్కు అంకితం ఇస్తున్నాం. భారత్ కేవలం సాంకేతికతను దిగుమతి చేసుకోవడమే కాదు.. ప్రపంచానికి టెక్నాలజీని సృష్టించే, ఎగుమతి చేసే గ్లోబల్ లీడర్గా ఎదగాలన్న ప్రధాని కల సాకారంలో జియో భాగస్వామి కావడం మాకు గర్వకారణం’’ అని అన్నారు.
జియో విడుదల చేసిన నివేదిక ప్రకారం మార్చి 31, 2026 నాటికి ఉన్న గణాంకాలు ఇలా ఉన్నాయి.
కేవలం 1.4 బిలియన్ల భారతీయులకు చౌకగా డేటా అందించడమే కాకుండా.. 4G LTE, 5G నెట్వర్క్లను పూర్తి స్వదేశీ సాంకేతికతతో నిర్మించిన జియో, ఇప్పుడు 6G దిశగా అడుగులు వేస్తోంది. జియో సాధించిన ఈ అంతర్జాతీయ గుర్తింపు.. ప్రపంచ టెక్నాలజీ మ్యాప్లో భారతదేశపు బ్రాండ్ వాల్యూను మరింత శిఖరాగ్రానికి తీసుకెళ్లిందని చెప్పొచ్చు.