Aditya L1: మరో చరిత్ర సృష్టించిన ఇస్రో.. ఆదిత్య ఎల్‌-1 సంపూర్ణ విజయం.. ఘనతపై మోడీ ట్వీట్‌

భూమి, సూర్యుని మధ్య గురుత్వాకర్షణ శక్తి నిష్క్రియంగా మారే ప్రాంతాన్ని లాగ్రాంజ్ పాయింట్ అంటారు. వ్యోమనౌక దాని చుట్టూ ఉన్న హాలో ఆర్బిట్‌లో ఉండి, అక్కడి నుంచి సూర్యుడికి సంబంధించిన ముఖ్యమైన సమాచారాన్ని ఇస్రోకు అందిస్తుంది. L1 పాయింట్ భూమి, సూర్యుని మధ్య దూరంలో దాదాపు ఒక శాతం. హాలో ఆర్బిట్‌లోని ఉపగ్రహాల నుండి సూర్యుడిని నిరంతరం చూడవచ్చు. అందుకే..

Aditya L1: మరో చరిత్ర సృష్టించిన ఇస్రో.. ఆదిత్య ఎల్‌-1 సంపూర్ణ విజయం.. ఘనతపై మోడీ ట్వీట్‌
Aditya L 1

Updated on: Jan 06, 2024 | 5:24 PM

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరోసారి చరిత్ర సృష్టించింది. శనివారం ఇస్రో తన ‘ఆదిత్య-ఎల్1’ అంతరిక్ష నౌకను భూమికి దాదాపు 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న లాగ్రాంజ్ పాయింట్ 1 వద్ద హాలో ఆర్బిట్‌లో విజయవంతంగా చేర్చింది. సూర్యుడిపై అధ్యయనం చేసేందుకు ఆదిత్య ఎల్1 గతేడాది సెప్టెంబర్ 2న శ్రీహరికోట నుంచి ప్రయోగించారు. ఇస్రో సాధించిన ఈ ఘనతపై ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ ద్వారా అభినందనలు తెలిపారు.

 

ఇవి కూడా చదవండి


భూమి, సూర్యుని మధ్య గురుత్వాకర్షణ శక్తి నిష్క్రియంగా మారే ప్రాంతాన్ని లాగ్రాంజ్ పాయింట్ అంటారు. వ్యోమనౌక దాని చుట్టూ ఉన్న హాలో ఆర్బిట్‌లో ఉండి, అక్కడి నుంచి సూర్యుడికి సంబంధించిన ముఖ్యమైన సమాచారాన్ని ఇస్రోకు అందిస్తుంది. L1 పాయింట్ భూమి, సూర్యుని మధ్య దూరంలో దాదాపు ఒక శాతం. హాలో ఆర్బిట్‌లోని ఉపగ్రహాల నుండి సూర్యుడిని నిరంతరం చూడవచ్చు. అందుకే ఈ కక్ష్యలో ఉండడం వల్ల సూర్యుని కార్యకలాపాలు, అంతరిక్ష వాతావరణంపై దాని ప్రభావానికి సంబంధించిన సమాచారాన్ని నిజ సమయంలో సేకరించేందుకు ఆదిత్య L1కి సహాయపడుతుంది. ఆదిత్య ఎల్‌1 ఇప్పటి వరకు 127 రోజులపాటు 15 లక్షల కి. మీ ప్రయాణం చేసింది. సూర్యుడిపై ఏర్పడే సన్ స్పాట్స్, కరోనల్ మాస్ ఎజెక్షన్స్, సౌరజ్వాలల వంటి విషయాలపై అధ్యయనం చేయనుంది. ఐదేళ్ల పాటు సేవలందించనున్న ఉపగ్రహం ద్వారా ఇస్రో ఎన్నో విషయాలను తెలుసుకోనుంది. ఈ రోజు 4.02 గంటలకు కక్ష్యలోకి ఎంట్రీ ఇచ్చిన ఆదిత్యను విజయంతంగా ప్రవేశపెట్టారు శాస్త్రవేత్తలు.


మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి