UPI Lite On Phone Pay: ఫోన్‌పే యూజర్లకు గుడ్ న్యూస్.. యూపీఐ లైట్ సేవలు.. యాక్టివేట్ చేయండిలా..!

|

May 05, 2023 | 8:30 PM

యూపీఐ సేవలను ప్రారంభించి ఎన్‌పీసీఐ ఇటీవల యూపీఐ లైట్ సేవలను ప్రారంభించింది. ఈ యూపీఐ లైట్ సేవలు సాధారణ ప్రజలు బాగా ఇష్టపడడంతో ప్రస్తుతం ఈ సేవలు ఫోన్‌పేలో కూడా అందుబాటులోకి వచ్చాయి. ఫోన్‌పే తన యాప్‌లో యూపీఐ లైట్ ఫీచర్‌‌ను ఎనేబుల్ చేసినట్లు ప్రకటించింది.

UPI Lite On Phone Pay: ఫోన్‌పే యూజర్లకు గుడ్ న్యూస్.. యూపీఐ లైట్ సేవలు.. యాక్టివేట్ చేయండిలా..!
Phonepe Now Supports International Payments
Follow us on

భారతదేశంలో 2016లో నోట్ల రద్దు తర్వాత డిజిటల్ పేమెంట్లు భారీగా పెరిగాయి. గూగుల్ పే, పేటీఎం, ఫోన్ పే వంటి సంస్థల ద్వారా ముఖ్యంగా యూపీఐ సేవలు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. అయితే యూపీఐ సేవలను ప్రారంభించి ఎన్‌పీసీఐ ఇటీవల యూపీఐ లైట్ సేవలను ప్రారంభించింది. ఈ యూపీఐ లైట్ సేవలు సాధారణ ప్రజలు బాగా ఇష్టపడడంతో ప్రస్తుతం ఈ సేవలు ఫోన్‌పేలో కూడా అందుబాటులోకి వచ్చాయి. ఫోన్‌పే తన యాప్‌లో యూపీఐ లైట్ ఫీచర్‌‌ను ఎనేబుల్ చేసినట్లు ప్రకటించింది. ఈ సేవలకు అన్ని ప్రధాన బ్యాంకులు మద్దతు ఇస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని యూపీఐ వ్యాపారులు క్యూఆర్ కోడ్‌లను ద్వారా చెల్లింపులను చేయవచ్చు. ఈ ఫీచర్ ఆన్-డివైస్ బ్యాలెన్స్ ద్వారా పని చేస్తుంది. ఇది అత్యంత రద్దీగా ఉండే సమయ స్లాట్‌లలో కూడా కిరాణా, రవాణా వంటి తక్కువ విలువ లావాదేవీల కోసం చాలా వేగవంతమైన నిజ సమయ చెల్లింపు పరిష్కారాలను సులభతరం చేస్తుంది. ఈ సేవల వల్ల కలిగే లాభాలు ఏంటో ఓసారి తెలుసుకుందాం.

యూపీఐ లైట్ వల్ల ప్రయోజనాలు ఇవే

యూపీఐ లైట్ ద్వారా రూ.200 లోపు  చెల్లింపులను ప్రారంభించేందుకు వినియోగదారులను అనుమతిస్తుంది. పిన్‌ను నమోదు చేయకుండా వారి యూపీఐ లైట్ ఖాతా నుంచి వినియోగదారుల బ్యాంకుల (రిమిటర్ బ్యాంక్) కోర్ బ్యాంకింగ్ సిస్టమ్‌లను రియల్ టైమ్‌లో ప్రమేయం చేయకుండా ఆన్-డివైస్ యూపీఐ లైట్ బ్యాలెన్స్‌ను డెబిట్ చేయడం ద్వారా లావాదేవీ నేరుగా ప్రాసెస్ అవుతుంది. ఇది లావాదేవీలను వేగంగా చేస్తుంది. 

యూపీఐ లైట్‌ను యాక్టివేట్ చేయండిలా

ఫోన్‌పే వినియోగదారులు తమ ఫోన్ పే యాప్‌లో సాధారణ ప్రక్రియ ద్వారా తక్షణమే ఫీచర్‌ని యాక్టివేట్ చేయవచ్చు. అలాగే యూపీఐ లైట్ ఖాతాను సృష్టించవచ్చు. ఈ యూపీఐ లైట్‌లో వినియోగదారులు రూ.2000 వరకు లోడ్ చేయవచ్చు. ఒకేసారి రూ.200 లేదా అంతకంటే తక్కువను లావాదేవీలను చేయవచ్చు. వినియోగదారులు రోజూ యూపీఐ లావాదేవీల చరిత్రను కలిగి ఉన్న ఎస్ఎంఎస్‌ను అందుకుంటారు. ఈ నేపథ్యంలో ఫోన్‌పే సహ వ్యవస్థాపకుడు చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ రాహుల్ చారి మాట్లాడుతూ యూపీఐ అనేది యూపీఐ స్టాక్ సమర్పణలో ప్రధాన భాగంగా ఉంటుందని పేర్కొన్నారు. తరచుగా తక్కువ ఖర్చుల కోసం వినియోగదారుల డిజిటల్ చెల్లింపుల అనుభవాన్ని మెరుగుపరచాలనే లక్ష్యంతో దీన్ని రూపొందించానని పేర్కొన్నారు. ముఖ్యంగా యూపీఐ లైట్ ఇప్పటికే ఉన్న యూపీఐ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌పై ఒత్తిడి లేకుండా లావాదేవీలను వాటిని వేగంగా, సౌకర్యవంతంగా చేస్తుందని వివరించారు. 

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..