జాబిల్లిపై చంద్రయాన్-3 కాలుమోపే చారిత్రక ఘట్టానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 23న సాయంత్రం 6.04 గంటలకు విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై అడుగుపెట్టనుంది.దీంతో చంద్రుడి దక్షిణ ధ్రువంపై సాఫ్ట్ ల్యాండింగ్కు అనువైన ప్రదేశం కోసం విక్రమ్ ల్యాండర్ అన్వేషిస్తోంది. ఈ క్రమంలో భూమికి కనిపించని జాబిల్లి దక్షిణ ధ్రువం ఉండే ప్రాంతానికి సంబంధించిన కొన్ని ఫోటోలను ల్యాండర్ తన కెమెరాలో బంధించింది. చంద్రునిపై ల్యాండర్ సేఫ్గా ల్యాండ్ అయ్యేందుకు.. గుంతలు, బండరాళ్లు లేని ప్రదేశాన్ని గుర్తించేందుకు సైంటిస్టులకు ఈ కెమెరా ఉపయోగపడుతుంది. ఆగస్టు 19న ల్యాండర్ ఈ ఫోటోలను తీసినట్లు ఇస్రో తెలిపింది. తాజా ఫోటోల్లో చందమామ ఉపరితలంపై అనేక బిలాలు క్లియర్గా కన్పిస్తున్నాయి. వాటి పేర్లను ఇస్రో ఫోటోల్లో పేర్కొంది.
Chandrayaan-3 Mission:
Here are the images of
Lunar far side area
captured by the
Lander Hazard Detection and Avoidance Camera (LHDAC).This camera that assists in locating a safe landing area — without boulders or deep trenches — during the descent is developed by ISRO… pic.twitter.com/rwWhrNFhHB
— ISRO (@isro) August 21, 2023
ప్రయోగంలో కీలకమైన రెండో డీబూస్టింగ్ ప్రక్రియ సైతం విజయవంతమైంది. ఆదివారం ల్యాండర్ వేగాన్ని తగ్గించే విన్యాసాన్ని ఇస్రో చేపట్టింది. ఈ ప్రక్రియ అనంతరం ల్యాండర్ జాబిల్లికి మరింత చేరువైంది. ప్రస్తుతం ల్యాండర్ మాడ్యూల్ 25 x 134 కిలోమీటర్ల కక్ష్యలో పరిభ్రమిస్తున్నది. ఇదే కక్ష్య నుంచి ఈ నెల 23 సాఫ్ట్ ల్యాండింగ్ చేపట్టనుంది. ఈ ప్రయోగం సక్సెస్ అయితే.. జాబిల్లిపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన సోవియట్ యూనియన్, అమెరికా, చైనా లిస్ట్లో ఇండియా కూడా చేరిపోతుంది. చంద్రునిపైకి ఎవరూ వెళ్లని రూట్లో దక్షిణ ధ్రువంపై ఎంట్రీ ఇచ్చేందుకు చంద్రయాన్-3ని జులై 14న ఎల్వీఎం3-ఎం4 రాకెట్ ద్వారా శ్రీహరికోట నుంచి ఇస్రో ప్రయోగించిన విషయం తెలిసిందే. ఆగస్టు 5న చంద్రుడి కక్ష్యలోకి దీన్ని విజయవంతంగా చేర్చారు. కక్ష్యలను తగ్గిస్తూ చంద్రునికి చేరువగా తీసుకెళ్లారు.
మరోవైపు చంద్రయాన్-3కి పోటీగా రష్యా ప్రయోగించిన లూనా-25 ప్రయోగం విఫలమవడంతో ఇప్పుడు అందరి కళ్లూ చంద్రయాన్-3పైనే ఉన్నాయి. చారిత్రక ఘట్టం కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. కాగా ఇస్రో వెబ్సైట్, య్యూట్యూబ్ చానల్, ఫేస్బుక్ పేజీ, డీడీ నేషనల్ చానల్లో 23వ తేదీ సాయంత్రం 5.27 గంటల నుంచి జాబిల్లిపై ల్యాండర్ కాలు మోపే లైవ్ ఈ దృశ్యాలను వీక్షించవచ్చు. విద్యా సంస్థల్లో లైవ్స్ట్రీమింగ్ నిర్వహించాలని ఇస్రో పిలుపునిచ్చింది.
August 23rd. 1745 IST. I’ll be watching. Praying. And cheering you on… pic.twitter.com/GWs9rNWzK8
— anand mahindra (@anandmahindra) August 20, 2023
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..