
ప్రీమియం ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్ను కొనుగోలు చేయాలని ప్లాన్ చేసే వారిని వారి బడ్జెట్ కొంత ఆలోచనల్లో పడేస్తుంది. ఇలాంటి వారు సామ్సంగ్ సూపర్ ప్రీమియం స్మార్ట్ఫోన్ గెలాక్సీ ఎస్-23 256 జీబీ వేరియంట్పై ఫ్లిప్కార్ట్ భారీ తగ్గింపును ప్రకటించింది. ఏకంగా ఈ ఫోన్పై రూ. 50,000 వరకు తగ్గింపు ఆఫర్ చేస్తున్నారు. సామ్సంగ్ గెలాక్సీ ఎస్-23 256 జీబీ వేరియంట్ ఫోన్ అసలు ధర రూ.95,999గా ఉంది. ఈ ఫోన్ ఇప్పుడు ఫ్లిప్కార్ట్లో 56 శాతం భారీ తగ్గింపు తర్వాత కేవలం రూ.41,999కే లభిస్తుంది. అంటే దాదాపు సగం ధరకే ఈ ఫోన్ను సొంతం చేసుకోవచ్చు.
అలాగే సామ్సంగ్ గెలాక్సీ ఎస్-23 256 జీబీ వేరియంట్ ఫోన్ను ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా కొనుగోలు చేస్తే 5 శాతం క్యాష్బ్యాక్ అందిస్తున్నారు. ఐడీఎఫ్సీ బ్యాంక్ కార్డులపై రూ. 750 వరకు అదనపు తగ్గింపు అందుబాటులో ఉంటుంది. అలాగే మీరు మీ పాత స్మార్ట్ఫోన్ను మార్చుకున్నప్పుడు దాదాపు రూ.39,150 వరకు తగ్గింపు వస్తుంది. మీ పాత ఫోన్పై ఎక్స్చేంజ్ ఆఫర్ రూ.15,000 ఎక్స్ఛేంజ్ వాల్యూ కడితే ఈ ఫోన్ను కేవలం రూ.26,999కే పొందవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి