భారతదేశంలో ప్రస్తుతం వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ బాగా పెరిగింది. ముఖ్యంగా కరోనా లాక్డౌన్ సమయంలో మొదలైన విధానం ఇంకా కొనసాగుతూ ఉంది. అలాగే కరోనా లాక్డౌన్ సమయంలో పిల్లలకు కూడా ఆన్లైన్ క్లాసులు పెరిగాయి. దీంతో ప్రతి ఇంట్లో స్మార్ట్ఫోన్తో పాటు ల్యాప్టాప్ అవసరం పెరిగింది. దీంతో పెరుగుతున్న మార్కెట్ను దృష్టిలో పెట్టుకుని కంపెనీలు కొత్త మోడల్స్లో ల్యాప్టాప్లను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. బడ్జెట్ ఫ్రెండ్లీ ల్యాప్టాప్స్ రిలీజ్ చేస్తూ వినియోగదారులను ఆకట్టుకున్న ఏసర్ ప్రస్తుతం స్విఫ్ట్ పేరుతో మరో కొత్త ల్యాప్టాప్ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఏసర్ భారతదేశంలో ఓఎల్ఈడీ డిస్ప్లేతో ఏసర్ స్విఫ్ట్ గో ల్యాప్టాప్ను పరిచయం చేసింది. కేవలం 1.25 కేజీల లైట్ వెయిట్తో వచ్చే ఈ ల్యాప్టాప్ కంపెనీ ఇప్పటికే రిలీజ్ చేస్తే స్విఫ్ట్ ల్యాప్టాప్కు జోడింపుగా మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 14 అంగుళాల డిస్ప్లేతో వచ్చే ఈ ల్యాప్టాప్ ధర రూ.80,000 కంటే తక్కువే ఉండే అవకాశం ఉందని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. అంటే ఈ ల్యాప్టాప్ ధరను కంపెనీ రూ.79,990గా నిర్ణయించింది. అలాగే అన్ని ఆన్లైన్, ఆఫ్లైన్ స్టోర్స్లో ఈ ల్యాప్టాప్ అందుబాటులో ఉంటుంది. ఈ ల్యాప్టాప్ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఏంటో ఓ సారి తెలుసుకుందాం.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..