టీమిండియా లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ముంబైలో సందడి చేశారు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా బాలీవుడ్ ప్రముఖులతో కలిసి గల్లీ క్రికెట్ ఆడారు. ప్రధాని నరేంద్రమోదీ పిలుపుతో ఫిట్ ఇండియా మూవ్మెంట్ కార్యక్రమానికి మద్దతు పలికారు. మెహబూబా స్టేడియంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన బాలీవుడ్ హీరోలు వరుణ్ ధావన్, అభిషేక్ బచ్చన్లను..మీరు కూడా జాయిన్ అవుతారా అని సచిన్ అడగడంతో సరదాగా క్రికెట్ ఆడారు.
ముందు వరుణ్, జూనియర్ బచ్చన్ బౌలింగ్ చేయగా..మాస్టర్ బ్లాస్టర్ బ్యాటింగ్ చేశారు. ఆ తర్వాత జియా అనే మహిళా యువ క్రికెటర్ను ఎంకరేజ్ చేశారు సచిన్. ఆ అమ్మాయి బౌలింగ్ చేస్తుండగా వరుణ్, అభిషేక్ బ్యాటింగ్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరలవుతోంది. ఈ సందర్భంగా గల్లీలో క్రికెట్ ఆడటం ఆనందంగా ఉందన్న సచిన్ ట్వీట్కు వరుణ్ కూడా రిప్లై ఇచ్చారు. స్పోర్ట్స్ ప్లేయింగ్ నేషన్ చాలా గొప్ప కార్యక్రమం అని కొనియాడారు.