Tokyo Olympics: క్విజ్​, డిబేట్లు, చర్చలు… టోక్యో ఒలిపింక్స్‌పై దేశవ్యాప్త కార్యక్రమాలు…

Tokyo Olympics: సాయ్​, ఐఓఏ.. మెగా ఈవెంట్స్​కు సంబంధించి పలు కార్యక్రమాల మీద అవగాహన కల్పిస్తాయి. ఒలింపిక్స్​ విజేతలకు సంబంధించి క్విజ్​, డిబేట్లు, చర్చలు, ఆర్టికల్స్, స్లోగన్లు, ఇలా రకరకాల కార్యక్రమాలు నిర్వహిస్తారు.

Tokyo Olympics: క్విజ్​, డిబేట్లు, చర్చలు... టోక్యో ఒలిపింక్స్‌పై దేశవ్యాప్త కార్యక్రమాలు...
Tokyo Olympics

Updated on: Jun 09, 2021 | 12:26 AM

టోక్యో ఒలింపిక్స్‌పై దేశవ్యాప్తంగా ఒలింపిక్స్​ గురించి అవగాహన కల్పించేందుకు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాతో పాటు ఇండియన్​ ఒలింపిక్స్​ అసోసియేషన్లు  ముందుకొచ్చాయి. టోక్యో ఒలింపిక్స్లో  భారత అథ్లెట్స్​ పాల్గొననున్న నేపథ్యంలో ఈ మేరకు సంయుక్త నిర్ణయం తీసుకున్నాయి.
సాయ్​, ఐఓఏ.. మెగా ఈవెంట్స్​కు సంబంధించి పలు కార్యక్రమాల మీద అవగాహన కల్పిస్తాయి. ఒలింపిక్స్​ విజేతలకు సంబంధించి క్విజ్​, డిబేట్లు, చర్చలు, ఆర్టికల్స్, స్లోగన్లు, ఇలా రకరకాల కార్యక్రమాలు నిర్వహిస్తారు.

ఇందులో సామాజిక మాధ్యమాలు కూడా పెద్ద పాత్ర పోషించనున్నాయి.జులై 25 నుంచి సెప్టెంబర్​ 5 వరకు టోక్యో ఒలింపిక్స్​ను నిర్వహించాలని సంకల్పించారు నిర్వాహకులు. 11 ఆటల కేటగిరీలో భారత్​ నుంచి ఈ మెగా ఈవెంట్​లో 100 మంది వరకు అథ్లెట్లు పాల్గొననున్నారు.

మరో 25 మంది ఇంకా అర్హత సాధించే అవకాశం ఉంది. జూన్​ చివరి నాటికి ఆ వివరాలు వెలువడుతాయి. రియో వేదికగా 2016లో జరిగిన పారాలింపిక్స్​లో 19 మంది అథ్లెట్లు పాల్గొనగా.. ఈ సారి ఆ సంఖ్య 26కి పెరిగింది. మరో 16 మంది అర్హత సాధించే అవకాశాలు ఉన్నాయి.

Hyderabad: హైదరాబాద్ యువనిపుణుల ఆన్లైన్ చర్చ.. కోవిడ్ బాధితుల కోసం 2.17 కోట్ల రూపాయల నిధులు తెచ్చింది!

Telangana Crime News: ప్రాణం పోసిన అమ్మే అత్యంత దారుణంగా కొట్టి ఊపిరి తీసింది.. ప‌రాయి వ్య‌క్తి మోజులో ప‌డి