UEFA Euro 2020: 25 ఏళ్ల తరువాత సెమీస్ చేరిన ఇంగ్లండ్.. డెన్మార్క్ తో అమీతుమీకి సిద్ధం..!

|

Jul 05, 2021 | 2:39 PM

ఇంగ్లండ్ ఫుట్ బాల్ జట్టు 25 ఏళ్ల విరామం తరువాత యూరో కప్ సెమీస్ చేరింది. నిన్న ఉక్రెయిన్ తో జరిగిన చివరి క్వార్టర్ ఫైనల్లో ఇంగ్లండ్ టీం దూకుడు ప్రదర్శించి 4-0 గోల్స్ తేడాతో విజయం సాధించింది.

UEFA Euro 2020: 25 ఏళ్ల తరువాత సెమీస్ చేరిన ఇంగ్లండ్.. డెన్మార్క్ తో అమీతుమీకి సిద్ధం..!
Euro Cup England Team
Follow us on

Euro 2020: ఇంగ్లండ్ ఫుట్ బాల్ జట్టు 25 ఏళ్ల విరామం తరువాత యూరో కప్ సెమీస్ చేరింది. నిన్న ఉక్రెయిన్ తో జరిగిన చివరి క్వార్టర్ ఫైనల్లో ఇంగ్లండ్ టీం దూకుడు ప్రదర్శించి 4-0 గోల్స్ తేడాతో విజయం సాధించింది. ఇంగ్లండ్ జట్టు ఇంతవరకు ఒక్కసారి కూడా యూరో కప్‌ టైటిల్‌ సాధించలేకపోయింది. యూరో కప్ లో చివరిసారి 1996లో సెమీ ఫైనల్‌ చేరినా.. ఫైనల్ చేరలేకపోయింది. అంతకు ముందు 1966 ప్రపంచకప్‌ ఫైనల్లో పశ్చిమ జర్మనీపై 4-2తో గెలిచింది. అయితే, 1966 మ్యాచ్ తరువాత 4 గోల్స్ చేయడం మాత్రం ఇదే తొలిసారి. సెమీ ఫైనల్ లో ఇంగ్లండ్ టీం డెన్మార్క్‌తో పోరాడుతుంది. సెమీ ఫైనల్స్ బుధవారం నుంచి జరగనున్నాయి. మొదటి సెమీ ఫైనల్ మ్యాచ్ ఇటలీ, స్పెయిన్ ల మధ్య బుధవారం జరగనుంది. అలాగే రెండో సెమీ ఫైనల్ మ్యాచ్ గురువారం జరగనుంది. ఈరెండు సెమీ ఫైనల్స్ లో గెలిచిన జట్లు సోమవారం జరిగే ఫైనల్స్ లో తలపడతాయి.

మ్యాచ్ విషయానికి వస్తే.. ఇంగ్లండ్‌ ఆటగాడు కెప్టెన్‌ హ్యారీ కేన్‌ ఆట 4 వ నిముషం, 50 వ నిముషంలో 2 గోల్స్‌ చేశాడు. అలాగే మరో ఆటగాడు. మగురె 46వ నిముషంలో, హెండర్సన్‌ 63వ నిముషంలో చేరో గోల్స్ చేశారు. దీంతో ఇంగ్లండ్ టీం 4-0 తేడాతో ఉక్రెయిన్ జట్టును ఓడించింది. ఇంగ్లండ్‌ ఆటగాళ్లు మొదటి నుంచి ఆధిక్యం ప్రదర్శించగా.. ఉక్రెయిన్‌ జట్టు ఏ దశలోనూ ఇంగ్లండ్ ప్లేయర్లను అడ్డుకోలేకపోయింది. ఉక్రెయిన్ పై గెలుపుతో ఇంగ్లండ్ టీం 62 వసారి యూరో కప్ బరిలో నిలిచి, మూడవ సారి సెమీఫైనల్ కు చేరుకుంది.

Also Read:

టీ 20 క్రికెట్‌లో డబుల్ సెంచరీ..! 79 బంతుల్లో 205 పరుగులు..17 ఫోర్లు,17 సిక్సర్లు.. ఎవరో కాదు మన ఢిల్లీ క్రికెటరే..

Mohammad Azharuddin : మళ్లీ హెచ్‌సీఏ పగ్గాలు అజారుద్దీన్‌కే..! అపెక్స్‌ కౌన్సిల్‌ను రద్దు చేసిన అంబుడ్స్‌మన్‌