AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రూ. 12,000 పెట్టి టిక్కెట్లు కొంటే.. మెస్సీని చూడనేలేదు.. రగిలిపోతున్న సాకర్ అభిమానులు!

ప్రపంచ ప్రఖ్యాత అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ మూడు రోజుల పర్యటన కోసం భారతదేశానికి వచ్చారు. తన పర్యటనలో మొదటి రోజున, ఆయన కోల్‌కతాలో 70 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని వర్చువల్‌గా ప్రారంభించారు. ఆ తర్వాత ఆయన కోల్‌కతాలోని ప్రసిద్ధ సాల్ట్ లేక్ స్టేడియంకు చేరుకున్నారు. అయితే, ఆయన చాలా ముందుగానే స్టేడియానికి వచ్చారు.

రూ. 12,000 పెట్టి టిక్కెట్లు కొంటే.. మెస్సీని చూడనేలేదు.. రగిలిపోతున్న సాకర్ అభిమానులు!
Lionel Messi In Salt Lake Stadium Kolkata
Balaraju Goud
|

Updated on: Dec 13, 2025 | 2:59 PM

Share

ప్రపంచ ప్రఖ్యాత అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ మూడు రోజుల పర్యటన కోసం భారతదేశానికి వచ్చారు. తన పర్యటనలో మొదటి రోజున, ఆయన కోల్‌కతాలో 70 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని వర్చువల్‌గా ప్రారంభించారు. ఆ తర్వాత ఆయన కోల్‌కతాలోని ప్రసిద్ధ సాల్ట్ లేక్ స్టేడియంకు చేరుకున్నారు. అయితే, ఆయన చాలా ముందుగానే స్టేడియానికి వచ్చారు. మెస్సీ ముందుగానే బయలుదేరడం, స్టేడియంలో సమయం లేకపోవడం అభిమానులను ఆగ్రహానికి గురిచేసింది. గందరగోళంపై అభిమానులు కోపంతో చెలరేగిపోయారు. దీంతో స్టేడియం లోపల నీటి సీసాలు, కుర్చీలు విసిరేశారు.

మెస్సీ స్టేడియం నుంచి వెళ్లిపోవడం గురించి అభిమానులు వేలల్లో టిక్కెట్లు కొనుగోలు చేసినప్పటికీ, తమ స్టార్‌ను కనీసం ఒక్కసారి కూడా చూడలేదని అంటున్నారు. దీంతో తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమం మొత్తం వృధాగా గడిచిందని చాలామంది అన్నారు. మెస్సీని చూడటానికి అభిమానులు తెల్లవారుజాము నుంచే వేచి చూస్తున్నారు. ఈ ఘటనలో ఒక అభిమాని గాయపడి చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ విషయంపై దర్యాప్తు చేయడానికి ఒక కమిటీని ఏర్పాటు చేసి క్షమాపణలు కూడా చెప్పారు. మెస్సీ డిసెంబర్ 15 వరకు మూడు రోజుల్లో కోల్‌కతా హైదరాబాద్, ముంబై, న్యూఢిల్లీతో సహా నాలుగు నగరాల్లో పర్యటిస్తారు.

ఈ సంఘటనపై మెస్సీ అభిమాని ఒకరు ఆగ్రహం వ్యక్తం చేశారు. “మెస్సీని చూసేందుకు 12,000 రూపాయలు చెల్లించి టికెట్ కొనుగోలు చేశాము. మేము మెస్సీ కోసమే డార్జిలింగ్ నుండి వచ్చాము. అయినప్పటికీ, మేము అతనిని కనీసం కూడా చూడలేదు. ఇలాంటి కార్యక్రమం నిరాశపరిచింది” అని అన్నారు. ప్రజలు తాము చాలా ఆశలతో వచ్చామని చెప్పారు. వ్యయ ప్రయాసలకు ఒడ్చి వచ్చిన వారికి నిరాశే ఎదురైంది. ఈ కార్యక్రమం పూర్తిగా హాస్యాస్పదంగా ఉందని అన్నారు. “ఇక్కడ అందరూ ఫుట్‌బాల్‌ను ఇష్టపడతారు. మేమందరం మెస్సీని చూడాలనుకున్నాము, కానీ ఇది పూర్తి మోసం. మా డబ్బు తిరిగి ఇవ్వాలని కోరుకుంటున్నాము. నిర్వహకులు దారుణంగా వ్యవహరించారు. ఇది కోల్‌కతాకు చీకటి రోజు. ఈ అనుభవం పూర్తిగా మోసం. మంత్రి తన పిల్లలతో అక్కడ ఉన్నారు. మిగిలిన ప్రజలు ఏమీ చూడలేకపోయారు. మేము చాలా విచారంగా ఉన్నాము” అని అభిమానులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు.

ఈ సంఘటనపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ Xలో ఒక పోస్ట్‌లో తన విచారాన్ని వ్యక్తం చేశారు. ఈ దురదృష్టకర సంఘటనకు ఆమె లియోనెల్ మెస్సీ తోపాటు క్రీడా అభిమానులకు క్షమాపణలు చెప్పారు. కోల్‌కతాలో జరిగిన మెస్సీ కార్యక్రమంలో జరిగిన నిర్వహణ లోపం తనను దిగ్భ్రాంతికి గురి చేసిందని, ఈ సంఘటనపై దర్యాప్తు చేయడానికి ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేశామని మమతా బెనర్జీ పేర్కొన్నారు. ఈ సంఘటనకు ఆమె విచారం వ్యక్తం చేస్తూ క్షమాపణలు తెలిపారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..