AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20 World Cup 2022: టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనే 16 జట్లు ఇవే.. అర్హత సాధించిన ఆ రెండు టీంలు.. భారత్, పాక్ పోరుపైనే ఆసక్తి..

గ్రూప్-2లో భారత్‌తోపాటు పాకిస్తాన్, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్, సూపర్ 12లో రెండు క్వాలిఫైయర్‌లతో పాటుగా ఉంటాయి. మొత్తం టోర్నీలో భారత్ మొత్తం 5 మ్యాచ్‌లు ఆడనుంది.

T20 World Cup 2022: టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనే 16 జట్లు ఇవే.. అర్హత సాధించిన ఆ రెండు టీంలు.. భారత్, పాక్ పోరుపైనే ఆసక్తి..
Ind Vs Pak
Venkata Chari
|

Updated on: Jul 16, 2022 | 9:50 PM

Share

ఈ ఏడాది అక్టోబర్‌లో ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్‌ జరగనున్న సంగతి తెలిసిందే. ఈటోర్నీకి నెదర్లాండ్స్, జింబాబ్వేలు అర్హత సాధించాయి. దీంతో టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనే 16 జట్లను ఐసీసీ ఖరారు చేసింది. భారత్‌తో సహా 8 జట్లు నేరుగా సూపర్-12లో ఆడనుండగా, 8 జట్లలో 4 జట్లు మొదటి రౌండ్ తర్వాత సూపర్-12కి చేరుకుంటాయి. జింబాబ్వే వేదికగా జరుగుతున్న క్వాలిఫయర్ బి టోర్నీ తొలి సెమీఫైనల్‌లో జింబాబ్వే జట్టు పాపువా న్యూ గినియాపై గెలుపొందగా, రెండో సెమీఫైనల్‌లో నెదర్లాండ్స్ అమెరికాను ఓడించింది. ప్రస్తుతం ఈ రెండు జట్లు క్వాలిఫయర్-బి ఫైనల్‌లో తలపడనున్నాయి. దీంతో ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్‌నకు జింబాబ్వే, నెదర్లాండ్స్ అర్హత సాధించాయి. ఈ విషయాన్ని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) కూడా ధృవీకరించింది. గతంలో ఫిబ్రవరి 18 నుంచి 24 వరకు క్వాలిఫయర్-ఎ మ్యాచ్‌లు జరిగాయి. ఐర్లాండ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ క్వాలిఫయర్-ఎ నుంచి టీ20 ప్రపంచ కప్‌నకు అర్హత సాధించాయి. క్వాలిఫయర్-ఎ మ్యాచ్‌లు ఒమన్‌లో జరిగాయి.

క్వాలిఫయర్ బీ లో ఫైనల్ మ్యాచ్ జింబాబ్వే వర్సెస్ నెదర్లాండ్స్ మధ్య జరుగుతుంది. తొలి సెమీఫైనల్‌లో జింబాబ్వే 27 పరుగుల తేడాతో పపువా న్యూగినియాపై విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. అనంతరం పాపువా న్యూ గినియా జట్టు 8 వికెట్లకు 172 పరుగులు మాత్రమే చేయగలిగింది. రెండో సెమీఫైనల్‌లో నెదర్లాండ్స్ ఏడు వికెట్ల తేడాతో అమెరికాను ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన అమెరికా జట్టు 138 పరుగులకు ఆలౌటైంది. దీంతో నెదర్లాండ్స్ మరో ఓవర్ మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది.

ఇవి కూడా చదవండి

అక్టోబర్ 16 నుంచి ప్రపంచ కప్ ప్రారంభం..

శుక్రవారం టీ20 ప్రపంచ కప్ 2022 షెడ్యూల్‌ను ఐసీసీ ప్రకటించింది. ఈ షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 23న మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో పాకిస్థాన్‌తో భారత్ తొలి మ్యాచ్ ఆడనుంది. అక్టోబర్ 16 నుంచి టీ20 ప్రపంచకప్ ప్రారంభం కాగా, ఫైనల్ నవంబర్ 13న మెల్‌బోర్న్‌లో జరగనుంది. టోర్నీలో అడిలైడ్, బ్రిస్బేన్, గీలాంగ్, హోబర్ట్, మెల్‌బోర్న్, పెర్త్, సిడ్నీలోని 7 వేర్వేరు నగరాల్లో మొత్తం 45 మ్యాచ్‌లు జరుగుతాయి. 2014 ఛాంపియన్ శ్రీలంక అక్టోబర్ 16న నమీబియాతో టోర్నీ ప్రారంభ మ్యాచ్ ఆడనుంది.

ఫైనల్ మ్యాచ్ ఫ్లడ్‌లైట్‌ల వెలుగులో..

ప్రపంచ కప్‌లో మొదటి సెమీఫైనల్ నవంబర్ 9న సిడ్నీలో జరనుండగా, రెండవది నవంబర్ 10న అడిలైడ్ ఓవల్‌లో జరుగుతుంది. అడిలైడ్‌, ఓవల్‌లో ప్రపంచకప్‌ సెమీఫైనల్‌ జరగడం ఇదే తొలిసారి. నవంబర్ 13న మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో ఫైనల్ జరుగుతుంది. ఫ్లడ్‌లైట్ల వెలుగులో ఈ మ్యాచ్ జరగనుంది.

భారత్, పాకిస్థాన్‌లతో పాటు న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్తాన్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా జట్లు సూపర్-12లో భారత్, పాకిస్థాన్‌లతో పాటు చోటు దక్కించుకున్నాయి. మెయిన్ డ్రాకు ముందు నమీబియా, స్కాట్లాండ్, శ్రీలంక, వెస్టిండీస్ క్వాలిఫయర్స్ ఆడనున్నాయి. మిగిలిన 4 జట్లు కూడా క్వాలిఫయర్స్‌లోకి ప్రవేశిస్తాయి.

ఒకే గ్రూప్‌లో భారత్, పాకిస్తాన్..

గ్రూప్-2లో భారత్‌తోపాటు పాకిస్తాన్, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్, సూపర్ 12లో రెండు క్వాలిఫైయర్‌లతో పాటుగా ఉంటాయి. మొత్తం టోర్నీలో భారత్ మొత్తం 5 మ్యాచ్‌లు ఆడనుంది.