
WTC 2023-25 Points Table Update: ఆదివారం రాజ్కోట్లో ఇంగ్లండ్తో జరిగిన మూడో టెస్టులో భారత్ 434 పరుగుల తేడాతో విజయం సాధించడంతో ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ( WTC) 2023-25 పాయింట్ల పట్టికలో భారత్ రెండో స్థానానికి చేరుకుంది. కాగా, ఎనిమిది మ్యాచ్ల్లో కేవలం మూడు విజయాలతో ఇంగ్లండ్ ఎనిమిదో స్థానంలో కొనసాగుతోంది. అదనంగా, కొనసాగుతున్న సైకిల్లో స్లో ఓవర్ రేట్ కారణంగా ఇది 19 పాయింట్లు తన ఖాతాలో చేర్చుకుంది.
భారతదేశం తన 2023-25 WTC సైకిల్ను గత ఏడాది జులైలో వెస్టిండీస్లో 1-0 సిరీస్ విజయంతో ప్రారంభించింది. రెండో గేమ్లో సిరీస్ను సమం చేయడానికి ముందు మొదటి టెస్ట్లో ఓడిపోయింది. అలాగే, దక్షిణాఫ్రికాలోనూ ఎదురుదెబ్బ తగిలింది. దీంతో డబ్యూటీసీలో భారీగా దిగజారిపోయింది.
హైదరాబాద్లో ఇంగ్లండ్తో జరిగిన తొలి టెస్టులో ఓడిపోయిన రోహిత్ శర్మ నేతృత్వంలోని జట్టు విశాఖపట్నం, రాజ్కోట్లలో వరుస విజయాలు నమోదు చేసింది. దీంతో ఐదు మ్యాచ్ల సిరీస్లో 2-1 ఆధిక్యంలో ఉంది.
| జట్టు | ఆడింది | గెలుపు | ఓటమి | డ్రా | పాయింట్లు | పాయింట్ల శాతం |
| న్యూజిలాండ్ | 4 | 3 | 1 | 0 | 36 | 75.00 |
| భారతదేశం | 7 | 4 | 2 | 1 | 50 | 59.52 |
| ఆస్ట్రేలియా | 10 | 6 | 3 | 1 | 66 | 55.00 |
| బంగ్లాదేశ్ | 2 | 1 | 1 | 0 | 12 | 50.00 |
| పాకిస్తాన్ | 5 | 2 | 3 | 0 | 22 | 36.66 |
| వెస్ట్ ఇండీస్ | 4 | 1 | 2 | 1 | 16 | 33.33 |
| దక్షిణ ఆఫ్రికా | 4 | 1 | 3 | 0 | 12 | 25.00 |
| ఇంగ్లండ్ | 8 | 3 | 4 | 1 | 21 | 21.87 |
| శ్రీలంక | 2 | 0 | 2 | 0 | 0 | 0.00 |
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్, రజత్ పాటిదార్, సర్ఫరాజ్ ఖాన్, రవీంద్ర జడేజా, ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా మరియు మహ్మద్ సిరాజ్.
ఇంగ్లండ్: బెన్ స్టోక్స్ (కెప్టెన్), జాక్ క్రాలే, బెన్ డకెట్, ఒలీ పోప్, జో రూట్, జానీ బెయిర్స్టో, బెన్ ఫోక్స్ (వికెట్ కీపర్), రెహాన్ అహ్మద్, టామ్ హార్ట్లీ, మార్క్ వుడ్ మరియు జేమ్స్ ఆండర్సన్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..