
క్రికెట్ అనగానే చాలా మంది మ్యాచ్లు, రికార్డులు, బ్యాటర్లు, బౌలర్ల గురించే చెప్పుకుంటారు. కానీ, అసలు ఆ మ్యాచ్లు జరిగే గ్రౌండ్ల గురించి చాలా తక్కువ మాట్లాడుకుంటారు. నిజానికి క్రికెట్ ఇప్పుడు ఈ స్థాయిలో అభివృద్ధి చెందడంలో మొట్టమొదటి క్రికెట్ స్టేడియం పాత్ర ఎంతో ఉంది. ఇంతకీ ఆ స్టేడియం ఏది? దాని ఎప్పుడు, ఎవరు, ఎక్కడ కట్టారో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
క్రికెట్కు జన్మనిచ్చిన దేశం ఇంగ్లాండ్. అందుకే ప్రపంచ క్రికెట్ చరిత్రలో ఎన్నో మైలురాళ్లు అక్కడే ప్రారంభమయ్యాయి. ప్రపంచంలోనే తొలి ప్రత్యేక క్రికెట్ మైదానంగా గుర్తింపు పొందిన లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ ఇప్పటికీ క్రికెట్ మక్కాగా ప్రసిద్ధి చెందింది. ఈ గ్రౌండ్ కేవలం స్టేడియం మాత్రమే కాదు, ప్రపంచ క్రికెట్ చరిత్రను మలిచిన ఎన్నో అద్భుత ఘట్టాలకు సాక్షిగా నిలిచింది.
లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ను వ్యాపారవేత్త థామస్ లార్డ్ 1814లో ఇంగ్లాండ్లోని లండన్లోని సెయింట్ జాన్స్ వుడ్ ప్రాంతంలో నిర్మించారు. దీనికి ముందు 1787, 1791లో ఆయన ఏర్పాటు చేసిన రెండు మైదానాలు వేరే ప్రాంతాల్లో ఉండేవి. ప్రస్తుతం ఉన్న లార్డ్స్ మైదానం 1814లో ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇదే అంతర్జాతీయ క్రికెట్లో అత్యంత ప్రతిష్ఠాత్మక వేదికగా కొనసాగుతోంది.
1814లో ఈ మైదానం నిర్మాణానికి సుమారు 18,000 ఆ కాలపు బ్రిటిష్ పౌండ్లు వరకు వ్యయం అయినట్లు చారిత్రక రికార్డులు సూచిస్తున్నాయి. ప్రస్తుత విలువ ప్రకారం అది కోట్ల రూపాయలకు సమానమవుతుంది. అనంతర కాలంలో పావిలియన్, మీడియా సెంటర్, గ్రాండ్స్టాండ్లు, ఆధునిక సదుపాయాలు నిర్మించడంతో ఈ స్టేడియం మరింత అభివృద్ధి చెందింది.
1814లో ప్రారంభమైన అదే లార్డ్స్ మైదానం ఇప్పటికీ కొనసాగుతోంది. కాలానుగుణంగా అనేక మార్పులు, ఆధునికీకరణలు జరిగినప్పటికీ దాని చారిత్రక గుర్తింపు ఏమాత్రం తగ్గలేదు. ప్రస్తుతం ఇది మేరీలెబోన్ క్రికెట్ క్లబ్ (MCC) ఆధ్వర్యంలో నిర్వహించబడుతోంది. ప్రపంచంలోని ప్రతి క్రికెటర్ జీవితంలో ఒక్కసారైనా లార్డ్స్లో ఆడాలని కలలు కంటాడు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి