AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Virat Kohli: విరాట్‌కి ఏమైంది అస్సలు.. గాలికిపోయే దాన్ని గెలుక్కొని మరీ..

అసలు విరాట్‌కు ఏమైంది? వివాదాలపై ఉన్న దృష్టి పరుగులు చేయడంలో లేదని సోషల్ మీడియాలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తన వయస్సులో సగం ఉన్న పేయర్‌తో విరాట్ కయ్యానికి కాలు దువ్వడం టీమిండియా ఫ్యాన్స్‌కు కూడా నచ్చలేదు. అంతర్జాతీయ క్రికెట్‌లో 16 ఏండ్లకు పైగా అనుభవం ఉన్న విరాట్ ఇలా చేస్తాడని ఎవరు ఊహించలేదు.

Virat Kohli: విరాట్‌కి ఏమైంది అస్సలు.. గాలికిపోయే దాన్ని గెలుక్కొని మరీ..
Virat Kohli Clashes
Velpula Bharath Rao
|

Updated on: Dec 27, 2024 | 6:42 PM

Share

మెల్‌బోర్న్ టెస్టు తొలి రోజున విరాట్ కోహ్లి తన వయసులో సగం ఉన్న శామ్ కాన్‌స్టంట్స్‌ను ఉద్దేశపూర్వకంగా భూజాని తట్టాడు. ఇది పెద్ద వివాదంగా మారింది. ఈ ఘటనపై ఐసీసీ కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. విరాట్ కోహ్లీకి మ్యాచ్ ఫిజులో 20% కోత విధించింది. అలాగే ఒక్క డీమెరీట్ పాయింట్ ఇచ్చింది. గతంలో కోహ్లి ఓ ఆస్ట్రేలియా జర్నలిస్టుతో ఎయిర్‌పోర్ట్‌లో గొడవపడ్డాడు. విరాట్ కోహ్లీ తన కుటుంబాన్ని వీడియో తీయడానికి నిరాకరిస్తే, జర్నలిస్ట్ అలా చేయడం ద్వారా తప్పు చేశాడని అతని అభిమానులు విరాట్‌ను వెనకేసుకొచ్చారు.

అయితే మెల్‌బోర్న్‌లో షాట్ ఆడి అనవసరంగా ఔట్ అయ్యి తిరిగి వస్తుండగా ప్రేక్షకులతో విరాట్ గొడవపడ్డాడు. అయితే విరాట్‌‌‌ చర్యలు తన సొంత అభిమానులకే నచ్చడం లేదని తెలుస్తుంది. తమ అభిమాన క్రికెటర్ ఎలా డిఫెన్డ్ చేసుకోవాలని తలలు పట్టుకుంటున్నారు. యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ మధ్య సెంచరీ భాగస్వామ్యం ఉంది. రోహిత్ శర్మ కేవలం 3 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. తర్వాత అకస్మాత్తుగా యశస్వి రనౌట్ అయ్యాడు. 41వ ఓవర్ చివరి బంతికి సింగిల్ తీయడానికి యశస్వి పరిగెత్తగా విరాట్ ముందుకు వచ్చి ఆ తర్వాత వెనుదిరుగుతాడు. అయితే విరాట్ జైస్వాల్‌ను చూడకుండా విరాట్ బంతి వెనుక చూడటం వల్ల ఇలా జరిగిందని కొందరు నెటిజన్లు పేర్కొంటున్నారు. 82 పరుగుల వద్ద యశస్వి రనౌట్ అవ్వడం టీమిండయా అభిమానులను నిరాశకు గురిచేసింది.

యశస్వి ఔటైన తర్వాత క్రీజులో ఉండి సుదీర్ఘ ఇన్నింగ్స్ ఆడతాడని విరాట్ కోహ్లీ నుంచి అభిమానులు ఆశించారు. అప్పటికి అతను 30కి పైగా పరుగులు చేసి దాదాపు 75 బంతులు ఆడాడు. కానీ కేవలం ఒక ఓవర్ తర్వాత, 43వ ఓవర్ మొదటి బంతికి, అతను ఆఫ్ స్టంప్ వెలుపల బంతిని బాగా కొట్టాడు. వికెట్ కీపర్ అలెక్స్ కారీకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు తిరిగి వచ్చాడు. పెవిలియన్‌కు తిరిగి వస్తున్న సమయంలో విరాట్ కోహ్లీ కూడా అభిమానులతో గొడవకు దిగాడు. విరాట్ ఔటైన వెంటనే భారత జట్టు కష్టాల్లో పడినట్లైంది.

ఈ టెస్ట్ మ్యాచ్‌కు ముందు, నెట్స్ సమయంలో, విరాట్ కోహ్లీ ఆఫ్ స్టంప్ వెలుపల వెళ్తున్న బంతులపై చాలా సాధన చేశాడు. న్యూజిలాండ్‌తో జరిగిన వాంఖడే టెస్ట్ మ్యాచ్‌లో అతను రోజు ఆట చివరి ఓవర్‌లో రనౌట్ అయ్యాడు. విరాట్ రనౌట్ అయిన బంతి తర్వాత 3 బంతులు మాత్రమే ఆడాయి. మెల్‌బోర్న్‌లో కూడా, విరాట్ కోహ్లీ సింగిల్ తీసుకొని స్ట్రైక్‌ను మార్చాలనుకున్నాడు కాబట్టి ఆఫ్ స్టంప్ వెలుపల వెళ్తున్న బంతిని తాకాడు. 43వ ఓవర్లో విరాట్ ఔట్ కావడంతో 46 ఓవర్ల తర్వాత రోజు ఆట ముగిసింది. అయితే ఈ మధ్య విరాట్ కోహ్లీలో ఓపిక నశించినట్లు కనిపిస్తుంది. కోహ్లీ బ్యాటింగ్‌పై కన్నా వివాదాలపై ఎక్కువ శ్రద్ధ ఉన్నట్లు కనిపిస్తుంది. అంతర్జాతీయ క్రికెట్‌లో 16 ఏళ్లకు పైగా కొనసాగుతూ, 81 సెంచరీలు సాధించిన విరాట్ కోహ్లీ స్లెడ్జింగ్‌పై కాకుండా బ్యాటింగ్‌పై దృష్టి పెట్టాలని కొందరు విమర్శిస్తున్నారు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి