virat kohli: భిన్నాభిప్రాయాలున్నా కలిసికట్టుగా ఉందాం.. రైతులు దేశంలో అంతర్భాగమే… విరాట్ కోహ్లీ…

భిన్నాభిప్రాయలు ఉన్నప్పటికీ అందరం కలిసికట్టుగా ఉందామని, రైతులు దేశంలో అంతర్భాగమేనని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ట్వీట్ చేశారు. రైతు ఉద్యమంపై ఇతర...

virat kohli: భిన్నాభిప్రాయాలున్నా కలిసికట్టుగా ఉందాం.. రైతులు దేశంలో అంతర్భాగమే... విరాట్ కోహ్లీ...

Edited By:

Updated on: Feb 04, 2021 | 12:38 PM

భిన్నాభిప్రాయలు ఉన్నప్పటికీ అందరం కలిసికట్టుగా ఉందామని, రైతులు దేశంలో అంతర్భాగమేనని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ట్వీట్ చేశారు. రైతు ఉద్యమంపై ఇతర దేశాలకు చెందిన ప్రముఖులు చేస్తున్న ట్వీట్లపై టీమ్ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ స్పందించాడు. ఈ మేరకు ఆయన బుధవారం రాత్రి ట్వీట్‌ చేశారు. ఢిల్లీ సరిహద్దుల్లో జరుగుతున్న రైతుల ఆందోళన పట్ల అమెరికా పాప్‌ గాయని రిహానా, యువ పర్యావరణవేత్త గ్రెటా థన్‌బర్గ్‌ సహా పలువురు అంతర్జాతీయ ప్రముఖులు సామాజిక మాధ్యమాల్లో స్పందించారు. రైతులకు మద్దతు ప్రకటించారు. కాగా, వీరిపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మా అంతర్గత వ్యవహారాల్లో మీ జోక్యం ఏమిటని మండిపడింది. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వ వాదనలను కొందరు భారత సెలబ్రిటీలు సమర్థించారు. క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌తో పాటు, బాలీవుడ్‌ స్టార్లు సైతం వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇంగ్లాండ్‌తో ప్రారంభమయ్యే తొలి టెస్టు కోసం టీమిండియా తీవ్రంగా సాధన చేస్తోంది. అంతకుముందు ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్‌-గావస్కర్‌ సిరీస్‌ను భారత్ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. కాగా ప్రస్తుతం భారత్ ఇంగ్లాండ్‌తో పోరుకు సిద్ధమవుతోంది. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌‌కు చేరాలంటే భారత్ కచ్చితంగా ఈ సిరీస్‌ గెలవాలి.

విరాట్ ట్వీట్ ఇదే…

Also Read:

Petrol And Diesel Rates: భగ్గుమన్న పెట్రోల్… ఏడాదిలో రూ.14 పెరుగుదల నమోదు… డీజిల్ అదే బాటలో…

Gurukul Admissions: మీ పిల్లలు గురుకుల పరీక్ష రాశారా… మీకో శుభవార్త… రెండో విడత జాబితా విడుదల నేడే

యాభై వేలు ధర నిర్ణయిస్తే లక్షా డెబ్బై ఐదు వేలు పలికింది… ట్రిపుల్ నైన్ నెంబర్‌కు అంత గిరాకీ ఎందుకు

Corona virus Update: తెలంగాణలో 177 కొత్త కరోనా కేసులు … 24 గంటల వ్యవధిలో కోలుకున్న 198 మంది…

Indias Markets: వ్యవసాయ రంగ సంస్కరణలకు అమెరికా మద్దతు… శాంతియుత ఆందోళనలు ప్రజాస్వామ్య లక్షణమే అని వ్యాఖ్య…