
Vaibhav Sooryavanshi Fastest Fifty Record: ఐపీఎల్ అంటేనే రికార్డులకు నిలయం. అయితే ఈరోజు జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో ఐపీఎల్ బుడ్డోడు సృష్టించిన సునామీ చూస్తే క్రికెట్ ప్రపంచం నోరెళ్లబెట్టాల్సిందే. రాజస్థాన్ రాయల్స్ యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ, సన్రైజర్స్ హైదరాబాద్ బౌలర్లను ఉతికి ఆరేశాడు. కేవలం 15 బంతుల్లోనే అర్థ సెంచరీ పూర్తి చేసి, గతంలో తన పేరు మీద ఉన్న వేగవంతమైన హాఫ్ సెంచరీ రికార్డును తనే సమం చేయడం విశేషం.
మ్యాచ్ ఆరంభం నుంచే వైభవ్ బ్యాట్ నుంచి పరుగుల వరద పారింది. ముఖ్యంగా అనుభవజ్ఞులైన హైదరాబాద్ బౌలర్లను లక్ష్యంగా చేసుకుని ఈ 15 ఏళ్ల సంచలనం విరుచుకుపడ్డాడు. బంతి ఎక్కడ పడినా అది స్టేడియం వెలుపల పడాల్సిందే అన్నట్టుగా అతని షాట్లు ఉన్నాయి. కేవలం పవర్ప్లేలోనే రాజస్థాన్ స్కోరును ఆకాశానికి తీసుకెళ్లాడు. అతని బ్యాటింగ్ చూస్తుంటే ఒక పరిణతి చెందిన సీనియర్ ఆటగాడు ఆడుతున్నట్లుగా అనిపించింది తప్ప, ఒక టీనేజర్ ఆడుతున్నట్లు అనిపించలేదు.
Clearing old debts and opening new accounts 👊
🎥 Vaibhav Sooryavanshi is dealing in fireworks 🔥
Updates ▶️ https://t.co/PVdpjhxVEy#TATAIPL | #KhelBindaas | #RRvSRH | @rajasthanroyals pic.twitter.com/zTRbvv0viN
— IndianPremierLeague (@IPL) April 25, 2026
ఈ ఇన్నింగ్స్లో మరో అద్భుతం ఏమిటంటే, వైభవ్ ఒక భారీ సిక్సర్తో తన అర్థ సెంచరీని పూర్తి చేయడమే కాకుండా, టీ20 కెరీర్లో 1000 పరుగుల మైలురాయిని కూడా చేరుకున్నాడు. ఇంత చిన్న వయసులో ఈ ఘనత సాధించిన ఏకైక ఆటగాడిగా అతను చరిత్ర సృష్టించాడు. అతనిలోని ఆత్మవిశ్వాసం, బంతిని బాదే తీరు చూస్తుంటే భారత క్రికెట్కు మరో సచిన్ లేదా సెహ్వాగ్ దొరికాడని విశ్లేషకులు భావిస్తున్నారు. యశస్వి జైస్వాల్తో కలిసి అతను చేసిన భాగస్వామ్యం హైదరాబాద్ టీమ్ బౌలింగ్ ఆర్డర్ను పూర్తిగా దెబ్బతీసింది.
వైభవ్ సూర్యవంశీ ఇన్నింగ్స్ కేవలం రాజస్థాన్ రాయల్స్ జట్టుకే కాకుండా, యావత్ ఐపీఎల్ అభిమానులకు ఒక గొప్ప విందు భోజనంలా మారింది. సన్రైజర్స్ కెప్టెన్ ఎన్ని ప్రయోగాలు చేసినా వైభవ్ను ఆపడం సాధ్యం కాలేదు. ఈ సీజన్లో ఇతని ఆట తీరు చూస్తుంటే భవిష్యత్తులో మరెన్నో రికార్డులు కనుమరుగవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. యువ ఆటగాళ్లకు ఇదొక గొప్ప స్ఫూర్తిదాయక ప్రదర్శన.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..