
Rinku Singh Father Liver Cancer: భారత క్రికెటర్ రింకూ సింగ్ తండ్రి ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్ కప్ క్యాంప్ను విడిచి స్వగ్రామానికి తిరిగిపోయాడు. బీసీసీఐ సమాచారం ప్రకారం, రింకూ సింగ్ తండ్రి స్టేజ్-4 లివర్ క్యాన్సర్తో బాధపడుతూ ప్రస్తుతం వెంటిలేటర్ సపోర్ట్పై ఉన్నారు. ఈ అత్యవసర కుటుంబ పరిస్థితిలో తన కుటుంబంతో ఉండేందుకు రింకూ జట్టు నుంచి బయటకు వెళ్లినట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.
రింకూ సింగ్ ఈ టోర్నమెంట్ కోసం భారత జట్టు స్క్వాడ్లో భాగమే అయినప్పటికీ, తిరిగి జట్టులో చేరతాడా లేదా అనే విషయంపై ఇప్పటివరకు స్పష్టత లేదు. పరిస్థితిని టీమ్ మేనేజ్మెంట్ దగ్గరగా పర్యవేక్షిస్తోంది. అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది.
ఇటీవలి సంవత్సరాల్లో పరిమిత ఓవర్ల క్రికెట్లో రింకూ సింగ్ భారత జట్టుకు కీలక ఆటగాడిగా ఎదిగాడు. ఒత్తిడి పరిస్థితుల్లో మ్యాచ్ను ముగించే ఫినిషర్గా అతడికి మంచి గుర్తింపు ఉంది. ఈ సమయంలో అతడి దీర్ఘకాలిక గైర్హాజరు జట్టు కాంబినేషన్పై ప్రభావం చూపే అవకాశం ఉంది.
ప్రస్తుతం ప్రధానంగా రింకూ కుటుంబ పరిస్థితికే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ క్లిష్ట సమయంలో క్రికెట్ ప్రపంచం మొత్తం అతడికి మద్దతుగా నిలవనుంది. జట్టు మేనేజ్మెంట్ నుంచి అధికారిక అప్డేట్ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు.
ఇది కూడా చదవండి: IND vs ZIM: జింబాబ్వేతో కీలక మ్యాచ్.. ఏకంగా నలుగురికి హ్యాండిచ్చిన సూర్య.. ఎవరంటే?
ఇప్పటివరకు ఈ వరల్డ్ కప్లో రింకూ బ్యాట్తో మిశ్రమ ప్రదర్శననే చేశాడు. ఎక్కువగా చివరి ఓవర్లలో తక్కువ బంతులు మిగిలిన సమయంలో క్రీజ్లోకి రావాల్సి వచ్చింది. ఐదు ఇన్నింగ్స్ల్లో మొత్తం 24 పరుగులు మాత్రమే చేశాడు. రెండుసార్లు అజేయంగా నిలిచాడు. అతని అత్యధిక స్కోర్ 11*. ఈ ఏడాది ఆడిన 10 టీ20 అంతర్జాతీయ మ్యాచ్ల్లో ఎనిమిది ఇన్నింగ్స్ల్లో 115 పరుగులు చేశాడు. సగటు 28.75, స్ట్రైక్రేట్ 132.18గా ఉన్నాయి. బెస్ట్ స్కోర్ 44*గా ఉంది.
చెన్నైలో గురువారం జరిగే జింబాబ్వేతో ‘చావో రేవో మ్యాచ్లో టీమిండియా తలపడనుంది. సూపర్-8 తొలి మ్యాచ్లో దక్షిణాఫ్రికా చేతిలో 76 పరుగుల ఘోర ఓటమి పాలైన భారత్, మిగిలిన అన్ని మ్యాచ్ల్లో తప్పనిసరిగా గెలవాల్సిన పరిస్థితిలో ఉంది. అంతేకాదు, దక్షిణాఫ్రికా సూపర్-8 దశను అజేయంగా ముగించాలని కూడా భారత్ ఆశించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..