AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

WTC Final 2025: డబ్ల్యూటీసీ ఫైనల్స్‌కు టీమిండియా.. ఇలా జరిగితే తప్ప.. అడ్డుకోవడం కష్టమే?

World Test Championship Final: 2023 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయిన తర్వాత, రోహిత్ శర్మ సారథ్యంలోని టీమ్ ఇండియా ఇప్పుడు మళ్లీ ఈ ఛాంపియన్ షిప్‌లొ చోటు సంపాదించాలనుకుంటోంది. 2023-25 ​​సైకిల్‌లో భారత్ ఇప్పటివరకు మూడు సిరీస్‌లను గెలుచుకుంది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2025 ఫైనల్‌కు ముందు భారత్ ఇప్పుడు మరో మూడు టెస్ట్ సిరీస్‌లు ఆడాల్సి ఉంది.

WTC Final 2025: డబ్ల్యూటీసీ ఫైనల్స్‌కు టీమిండియా..  ఇలా జరిగితే తప్ప.. అడ్డుకోవడం కష్టమే?
Team India
Venkata Chari
|

Updated on: Aug 16, 2024 | 5:43 PM

Share

World Test Championship Final: 2023 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయిన తర్వాత, రోహిత్ శర్మ సారథ్యంలోని టీమ్ ఇండియా ఇప్పుడు మళ్లీ ఈ ఛాంపియన్ షిప్‌లొ చోటు సంపాదించాలనుకుంటోంది. 2023-25 ​​సైకిల్‌లో భారత్ ఇప్పటివరకు మూడు సిరీస్‌లను గెలుచుకుంది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2025 ఫైనల్‌కు ముందు భారత్ ఇప్పుడు మరో మూడు టెస్ట్ సిరీస్‌లు ఆడాల్సి ఉంది. ఇందులో టీం ఇండియా స్వదేశంలో రెండు సిరీస్‌లు ఆడనుండగా, ఈ ఏడాది చివర్లో టీమిండియా ఐదు టెస్టుల సిరీస్‌ కోసం ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. దీనికి ముందు WTC 2025 ఫైనల్‌కు వెళ్లే భారతదేశానికి సంబంధించిన అన్ని సమీకరణాలు తెరపైకి వచ్చాయి.

టీమ్ ఇండియా నంబర్ వన్..

టీమ్ ఇండియా ప్రస్తుతం WTC పాయింట్ల పట్టికలో 68.51 శాతంతో మొదటి స్థానంలో ఉంది. గత సైకిల్‌ను పరిశీలిస్తే, ఆస్ట్రేలియా 66.67 శాతం, భారత్‌ 58.80 శాతంతో ఫైనల్స్‌కు చేరుకున్నాయి. ఈ విషయంలో టీమ్ ఇండియా ప్రస్తుతం చాలా పటిష్ట స్థితిలో ఉంది. భారత్ ఇంకా బంగ్లాదేశ్, న్యూజిలాండ్‌లను స్వదేశంలో ఎదుర్కోవాల్సి ఉంది. బలమైన పోటీదారుగా కనిపిస్తోంది.

బంగ్లాదేశ్, న్యూజిలాండ్ నుంచి మొదటి సవాల్..

స్వదేశంలో టీమిండియా టెస్టు రికార్డు చాలా అద్భుతంగా ఉంది. గత 12 ఏళ్లుగా స్వదేశంలో భారత్ ఏ టెస్టు సిరీస్‌ను కోల్పోలేదు. అయితే, ఈ కాలంలో కేవలం నాలుగు టెస్టు మ్యాచ్‌ల్లో మాత్రమే ఓడిపోయింది. ఈ రికార్డును దృష్టిలో ఉంచుకుని బంగ్లాదేశ్‌తో జరిగే రెండు టెస్టుల సిరీస్‌లోని ఐదు మ్యాచ్‌ల్లోనూ, ఆపై న్యూజిలాండ్‌తో జరిగే మూడు టెస్టుల సిరీస్‌లోనూ రోహిత్ శర్మ సారథ్యంలోని టీమ్ ఇండియా విజయం సాధించగలదని చెప్పవచ్చు. న్యూజిలాండ్ జట్టు కూడా భారత్‌లో ఇప్పటి వరకు టెస్టు సిరీస్‌ను గెలవలేదు. ఈ విధంగా భారత్ మొత్తం ఐదు మ్యాచ్ లు గెలిస్తే గెలుపు శాతం 79.76గా ఉంటుంది. దీని వల్ల ఫైనల్‌కు వెళ్లే మార్గం భారత్‌కు మరింత సులభతరం కానుంది.

ఆస్ట్రేలియా పర్యటన సమీకరణాలు..

టీమ్ ఇండియా స్వదేశంలో మొత్తం ఐదు టెస్టులను గెలిస్తే, భారత ఆటగాళ్లు ఆస్ట్రేలియాపై స్వేచ్ఛగా ఆడగలరు. WTC 2025 ఫైనల్స్‌కు చేరుకోవడానికి వారు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌లో టీమిండియా 2-3 తేడాతో ఓడిపోయినా, 69.29 విజయ శాతంతో పాటు ఫైనల్‌ ఆడేందుకు ఎక్కువ అవకాశం ఉంటుంది.

ఒకవేళ భారత్ 1-4 తేడాతో ఆస్ట్రేలియాతో సిరీస్‌ను కోల్పోతే, సంక్షోభం ఏర్పడవచ్చు. రోహిత్ జట్టు 64.04 విజయ శాతంతో మిగిలిపోతుంది. ఆ తర్వాత, భారత్ మళ్లీ ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి రావచ్చు.

సిరీస్ విజయంతో టికెట్ కన్ఫర్మ్..

అదే సమయంలో, టీమ్ ఇండియా ఆస్ట్రేలియాపై గెలిచినా లేదా సిరీస్‌ను టైగా ముగించినా, WTC 2025 ఫైనల్ టిక్కెట్‌ను పొందడానికి కనీస విజయ శాతం 71.05 సరిపోతుంది. దీని కారణంగా భారత్ వరుసగా మూడోసారి డబ్ల్యుటీసీ ఫైనల్‌కు సులభంగా చేరుకుంటుంది. అయితే దీని కోసం స్వదేశంలో జరిగే ఐదు టెస్టు మ్యాచ్‌ల్లో మాత్రమే టీమిండియా గెలవాల్సి ఉంటుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..