AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gautam Gambhir: ఆయన కెప్టెన్‌గా ఉంటే.. నేను కోచ్‌గా ఉండలేను: గౌతమ్ గంభీర్?

Hardik Pandya - Suryakumar Yadav: హార్దిక్ పాండ్యా టీమ్ ఇండియాకు 15 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా ఉన్నాడు. అలాగే, సూర్యకుమార్ యాదవ్ 7 మ్యాచ్‌ల్లో భారత జట్టుకు నాయకత్వం వహించాడు. ఇక్కడ అనుభవం పరంగా హార్దిక్ పాండ్యా ముందున్నప్పటికీ.. గౌతమ్ గంభీర్ స్థాయిని బట్టి సూర్యకుమార్ యాదవ్‌కు కెప్టెన్సీ దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

Gautam Gambhir: ఆయన కెప్టెన్‌గా ఉంటే.. నేను కోచ్‌గా ఉండలేను: గౌతమ్ గంభీర్?
Bcci Gautam Gambhir
Venkata Chari
|

Updated on: Jul 18, 2024 | 4:45 PM

Share

టీ20 ప్రపంచకప్ ముగిసిన వెంటనే టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టీ20 అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఆ తర్వాత భారత టీ20 జట్టులో తర్వాతి స్థానం ఎవరు అనే ప్రశ్నకు సమాధానం హార్దిక్ పాండ్యా. టీ20 ప్రపంచకప్‌లో వైస్ కెప్టెన్‌గా ఉన్న హార్దిక్‌కు కెప్టెన్సీ దక్కడం దాదాపు ఖాయమైంది. అయితే కోచ్ గౌతమ్ గంభీర్ ఎంట్రీతో అంతా మారిపోయింది.

నాయకుడి స్థానానికి గతంలో వినిపించని సూర్యకుమార్ పేరు తెరపైకి వచ్చింది. దీనికి ప్రధాన కారణం టీమిండియా కోచ్ గౌతమ్ గంభీర్ తెరవెనుక చేసిన సిఫార్సులేనని తెలుస్తోంది. ఎందుకంటే హార్దిక్ పాండ్యాను కెప్టెన్‌గా చేయాలనే ఆలోచనలో సెలక్షన్ కమిటీ సభ్యులు ఉన్నారు.

అయితే కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ సెలక్షన్ కమిటీ ముందు తన అభిప్రాయంలో కొన్ని ముఖ్యమైన అంశాలను సమర్పించాడు. ఈ ముఖ్యమైన అంశాలలో, పాండ్యా ఫిట్‌నెస్ సమస్యను కూడా ప్రస్తావించాడంట. అందుకే టీమిండియాకు శాశ్వతంగా కనిపించే ఆటగాడికి కెప్టెన్సీ ఇవ్వాలని గంభీర్ చెప్పినట్లు సమాచారం.

ఈ చర్చల మధ్య గౌతమ్ గంభీర్ ఎక్కడా సూర్యకుమార్ యాదవ్‌కు నాయకత్వం వహించాలని డిమాండ్ చేయలేదు. హార్దిక్ పాండ్యా కెప్టెన్‌గా ఉంటే అతనితో కలిసి పనిచేయలేనని గంభీర్ స్పష్టం చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

దీంతో టీమిండియా టీ20 జట్టు కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్‌ను ఎంపిక చేయాలని బీసీసీఐ సెలక్షన్ కమిటీ నిర్ణయించినట్లు సమాచారం.

గౌతమ్ గంభీర్, సెలక్షన్ కమిటీ చీఫ్ అజిత్ అగార్కర్ హార్దిక్ పాండ్యాతో చివరి నిమిషంలో భారత కెప్టెన్ నియామకంలో మార్పు గురించి చర్చించినట్లు పీటీఐ నివేదించింది. ఇదిలా ఉండగా, నాయకత్వంలో మార్పు ఎందుకు వచ్చిందనే విషయంపై గంభీర్ టీమిండియా ప్లేయర్ పాండ్యాను ఒప్పించే ప్రయత్నం చేసినట్లు తెలిసింది.

ఈ పరిణామాలన్నింటినీ పరిశీలిస్తే.. భారత టీ20 జట్టుకు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్‌గా ఎంపిక కావడం దాదాపు ఖాయమైనట్లు తెలుస్తోంది. అలాగే వన్డే, టెస్టు జట్ల కెప్టెన్‌గా రోహిత్ శర్మ కొనసాగనున్నాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..