
ఆసియా కప్ను బాయ్కాట్ చేసిన టీమిండియా.. ఇది చదవగానే చాలా మంది షాక్ అయి ఉంటారు. అలాగే మరి కొంతమంది హ్యాపీగా కూడా ఫీలై ఉంటారు. ఎందుకంటే.. ప్రస్తుతం ఆసియా కప్ 2025లో ఇండియా వర్సెప్ పాకిస్థాన్ మ్యాచ్కు ముందు పాక్తో మ్యాచ్ను రద్దు చేసుకోవాలనే డిమాండ్ వినిపిస్తోంది. ఈ క్రమంలోనే ఓ ఆసక్తికర విషయం గురించి తెలుసుకుందాం..! అదే టీమిండియా గతంలో ఆసియా కప్ను బాయ్కాట్ చేసిన విషయం గురించి. 39 సంవత్సరాల క్రితం టీమిండియా ఆసియా కప్ను పూర్తిగా బహిష్కరించింది. కానీ అందుకు కారణం పాకిస్తాన్ కాదు.
1986లో శ్రీలంకలో జరగాల్సిన ఆసియా కప్ను టీమిండియా బాయ్కాట్ చేసింది. శ్రీలంకలో సివిల్ వార్ కారణంగా బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. లంకలో అశాంతి కారణంగా భారత జట్టును ద్వీప దేశానికి పంపవద్దని భారత ప్రభుత్వం BCCIని ఆదేశించింది. ఫైనల్లో పాకిస్థాన్ను ఓడించి శ్రీలంక ఆసియా కప్ను గెలుచుకుంది. అయితే 1988లో బంగ్లాదేశ్ ఆతిథ్యమిచ్చిన ఆసియా కప్లో భారత్ తిరిగి పాల్గొని, ఫైనల్లో శ్రీలంకను ఓడించి ట్రోఫీని గెలిచింది. అలాగే 1990లో జరిగిన ఆసియా కప్ను పాకిస్తాన్ బహిష్కరించింది. భారత్తో నెలకొన్న దౌత్య విభేదాల కారణంగా ఆ నిర్ణయం తీసుకుంది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి