45 ఫోర్లు, 17 సిక్స్‌లతో 506 పరుగులు.. వన్డే హిస్టరీలోనే కొత్త చరిత్ర.. బద్దలైన ప్రపంచ రికార్డ్..

ODI Cricket: మారుతున్న బ్యాటింగ్ టెక్నిక్‌లు, దూకుడుతో వన్డేల్లో 500 కంటే ఎక్కువ స్కోర్లు త్వరలో సర్వసాధారణం కావొచ్చు. క్రికెట్ టెస్ట్ ఫార్మాట్ నుంచి వన్డే ఫార్మాట్ కు, టీ20 ఫార్మాట్ కు మారుతున్నందున, ఇలాంటి భారీ స్కోర్లు మున్ముందు చూడొచ్చు.

45 ఫోర్లు, 17 సిక్స్‌లతో 506 పరుగులు.. వన్డే హిస్టరీలోనే కొత్త చరిత్ర.. బద్దలైన ప్రపంచ రికార్డ్..
Odi Records

Updated on: Dec 09, 2025 | 6:18 PM

ODI Records: క్రికెట్ చరిత్రలో ఎవరూ ఊహించని విధంగా 50 ఓవర్ల ఫార్మాట్‌లో (List-A) 500 పరుగుల మార్కును దాటి కొత్త రికార్డు నమోదైంది. తమిళనాడు జట్టు బ్యాటర్ల విధ్వంసంతో ఇంగ్లాండ్ పేరిట ఉన్న 498 పరుగుల ప్రపంచ రికార్డు బద్దలైంది. ఈ మ్యాచ్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఓసారి చూద్దాం..

చరిత్ర సృష్టించిన తమిళనాడు..

విజయ్ హజారే ట్రోఫీ (2022)లో భాగంగా అరుణాచల్ ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో తమిళనాడు జట్టు ఆకాశమే హద్దుగా చెలరేగింది. నిర్ణీత 50 ఓవర్లలో కేవలం 2 వికెట్లు కోల్పోయి ఏకంగా 506 పరుగులు చేసింది. ఇది లిస్ట్-ఏ క్రికెట్ చరిత్రలోనే అత్యధిక స్కోరుగా నిలిచింది.

ఇంగ్లాండ్ రికార్డు కనుమరుగు..

గతంలో వన్డే ఫార్మాట్‌లో అత్యధిక స్కోరు రికార్డు ఇంగ్లాండ్ పేరు మీద ఉండేది. 2022 జూన్‌లో నెదర్లాండ్స్‌పై ఇంగ్లాండ్ 498/4 పరుగులు చేసింది. అయితే, తమిళనాడు జట్టు ఆ రికార్డును అధిగమించి, వన్డే క్రికెట్‌లో 500 పరుగుల మైలురాయిని దాటిన తొలి జట్టుగా చరిత్ర సృష్టించింది.

ఇవి కూడా చదవండి

రికార్డుల రారాజు – నారాయణ్ జగదీషన్ ఈ భారీ స్కోరు సాధించడంలో ప్రధాన పాత్ర పోషించింది ఓపెనర్ నారాయణ్ జగదీషన్.

జగదీషన్ విధ్వంసం..

కేవలం 141 బంతుల్లో 277 పరుగులు చేశాడు. ఇందులో 25 ఫోర్లు, 15 సిక్సర్లు ఉన్నాయి. ఇది లిస్ట్-ఏ క్రికెట్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు. మరో ఓపెనర్ సాయి సుదర్శన్ కూడా 154 పరుగులు చేసి అద్భుతమైన సహకారం అందించాడు.

రికార్డు భాగస్వామ్యం..

జగదీషన్, సాయి సుదర్శన్ కలిసి మొదటి వికెట్‌కు 416 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇది కూడా ఒక ప్రపంచ రికార్డే.

మొత్తానికి, ఈ మ్యాచ్‌తో క్రికెట్‌లో పరుగుల వరద పారించవచ్చని, 500 పరుగులు కూడా సాధ్యమేనని తమిళనాడు జట్టు నిరూపించింది.

Loading...
Unable to load recommendations.
Follow Us