AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20 World Cup 2024: టీమిండియాపై ఓడినా.. సూపర్-8కి పాకిస్తాన్ చేరే ఛాన్స్.? ఎలాగంటే

టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా న్యూయార్క్‌లోని నాసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జూన్ 9న భారత్, పాకిస్థాన్ మధ్య కీలక మ్యాచ్ జరిగింది. ఈ హై- వోల్టేజ్ మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై 6 పరుగుల తేడాతో విజయం సాధించింది టీమిండియా. దీంతో ఈ టోర్నీలో వరుసగా రెండో మ్యాచ్‌లో..

T20 World Cup 2024: టీమిండియాపై ఓడినా.. సూపర్-8కి పాకిస్తాన్ చేరే ఛాన్స్.? ఎలాగంటే
Pakistan Cricket Team
Ravi Kiran
|

Updated on: Jun 10, 2024 | 1:03 PM

Share

టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా న్యూయార్క్‌లోని నాసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జూన్ 9న భారత్, పాకిస్థాన్ మధ్య కీలక మ్యాచ్ జరిగింది. ఈ హై- వోల్టేజ్ మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై 6 పరుగుల తేడాతో విజయం సాధించింది టీమిండియా. దీంతో ఈ టోర్నీలో వరుసగా రెండో మ్యాచ్‌లో ఓటమిపాలైంది పాకిస్తాన్. మొదట మ్యాచ్‌లో యూఎస్‌ఏ చేతిలో.. ఇక ఇప్పుడు భారత్ చేతిలో ఓడిపోయిన పాకిస్తాన్.. తన సూపర్-8 అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది.

ఇది చదవండి: అడవిలో కదల్లేకుండా కనిపించిన భారీ కొండచిలువ.. పొట్ట కోసి చూడగా.. వామ్మో..

పాకిస్థాన్ ఓడిపోతే ఏమవుతుంది?

ఈ ప్రపంచకప్‌లో మొత్తం 20 జట్లు పాల్గొంటాయి. వాటిని 5 గ్రూపులుగా విభజించారు. గ్రూప్‌-ఎలో భారత్‌, పాకిస్థాన్‌లు ఉన్నాయి. ఈ రెండు జట్లతో పాటు అమెరికా, కెనడా, ఐర్లాండ్‌లు గ్రూప్‌-ఎలో ఉన్నాయి. ప్రస్తుతం ఈ మూడు జట్లు 2 మ్యాచ్‌లు ఆడగా, ఆదివారం మ్యాచ్‌తో టీమిండియా, పాకిస్థాన్‌లు కూడా రెండేసి మ్యాచ్‌లు ఆడేశాయి. ఈ గ్రూప్‌లో అమెరికా 2 మ్యాచ్‌లు ఆడి.. 2 గెలిచి 4 పాయింట్లతో.. టీమిండియా కూడా 4 పాయింట్లతో ఉన్నాయి. ఇక కెనడా 2 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. పాకిస్థాన్, ఐర్లాండ్ రెండేసి మ్యాచ్‌లు ఓడిపోయి నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచాయి. ఇక ఈ గ్రూప్‌లో అన్ని జట్లు మరో 2 మ్యాచ్‌లు ఆడాలి. అంటే మిగిలిన రెండు మ్యాచ్‌లు గెలిచినా పాకిస్థాన్ గరిష్ఠంగా 4 పాయింట్లు మాత్రమే స్కోర్ చేయగలదు. అయితే ఇప్పటికే టీమిండియా, అమెరికా జట్లకు 4 పాయింట్లు ఉన్నాయి. ఇది కాకుండా వారి నెట్ రన్ రేట్ కూడా పాకిస్థాన్ కంటే మెరుగ్గా ఉంది. ఈ స్థితిలో పాకిస్థాన్‌కు సూపర్‌-8కి వెళ్లడం కష్టమే.

పాకిస్థాన్ ఎలా అర్హత సాధించింది?

భారత్‌పై ఓడిన తర్వాత పాకిస్థాన్ టోర్నీ నుంచి నిష్క్రమించే ప్రమాదం ఉంది. కానీ పాకిస్థాన్ తమ తదుపరి రెండు మ్యాచ్‌లను ఐర్లాండ్, కెనడాతో ఎలాగైనా గెలవాలి. అంతే కాకుండా నెట్ రన్ రేట్ మెరుగుపడాలంటే భారీ తేడాతో గెలవాలి. మిగిలిన 2 మ్యాచ్‌ల్లో ఒకదానిలో అమెరికా గెలిస్తే 6 పాయింట్లు అందుతాయి. దీంతో పాక్ జట్టు లీగ్‌కు దూరమవుతుంది. కాబట్టి అమెరికా జట్టు భారత్, ఐర్లాండ్‌లపై భారీ తేడాతో ఓడిపోవాల్సి వస్తుంది. ఇదే జరిగితే USA, పాకిస్తాన్‌లకు 4 పాయింట్లు వస్తాయి. అలాగే అప్పుడు మెరుగైన నెట్ రన్ రేట్ ఉన్న జట్లు సూపర్ 8 దశకు చేరుకుంటాయి. అంటే పాకిస్థాన్ జట్టు మిగిలిన 2 మ్యాచ్‌ల్లో గెలవడమే కాకుండా భారత్, అమెరికాల కంటే నెట్ రన్ రేట్‌ను మెరుగ్గా మార్చుకోవాల్సి ఉంటుంది. అప్పుడే పాకిస్థాన్ జట్టు సూపర్-8కి అర్హత సాధిస్తుంది.

ఇది చదవండి: ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయి బ్రో.! కారు నెంబర్ ప్లేట్‌లో ఏముందో తెలిస్తే..

మరిన్ని క్రికెట్ వార్తలు ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us