T20 World Cup 2021 Final: ఆసక్తికరంగా పొరుగు దేశాల మధ్య పోరు.. తొలి విజేతగా నిలిచేది ఎవరో?

|

Nov 13, 2021 | 11:17 AM

Australia Vs New Zealand: చివరి మ్యాచ్‌లో న్యూజిలాండ్, ఆస్ట్రేలియా జట్లు తలపడుతున్నాయి. పొరుగు దేశాల మధ్య పోటీ ఆసక్తికరంగా మారనుంది. ఇక టోర్నీలో గెలుపు ఓటములను రుచిచూసి ఫైనల్స్‌కు చేరుకున్నారు.

T20 World Cup 2021 Final: ఆసక్తికరంగా పొరుగు దేశాల మధ్య పోరు.. తొలి విజేతగా నిలిచేది ఎవరో?
Aus Vs Nz
Follow us on

T20 World Cup 2021 Final, Australia vs New Zealand: టీ20 ప్రపంచ కప్ 2021 ఇప్పుడు చివరి మ్యాచ్‌కు చేరుకుంది. ఈ ఐసీసీ ఈవెంట్ నవంబర్ 14న జరిగే ఫైనల్ మ్యాచ్‌తో ముగుస్తుంది. చివరి మ్యాచ్‌లో న్యూజిలాండ్, ఆస్ట్రేలియా జట్లు తలపడుతున్నాయి. ఈ రెండు పొరుగు దేశాల మధ్య పోరు ఆసక్తికరంగా మారనుంది. ఇక టోర్నీలో గెలుపు ఓటములను రుచిచూసి ఫైనల్స్‌కు చేరుకున్నారు. టైటిల్ క్లాష్‌కు ముందు, ఈ రెండు జట్ల ఫైనల్‌కు ప్రయాణం ఎలా ఉంటుందో చూద్దాం.

గ్రూప్ దశలో ఆస్ట్రేలియా ఆడిన 5 మ్యాచ్‌ల్లో 4 గెలిచి, 1 ఓడిపోయింది. ఇంగ్లండ్‌తో ఆడిన మూడో మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో ఓడిపోయింది. దీంతో పాటు తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. రెండో మ్యాచ్‌లో శ్రీలంక 7 వికెట్ల తేడాతో, నాల్గో మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై 8 వికెట్ల తేడాతో ఓడిపోగా, ఐదో మ్యాచ్‌లో వెస్టిండీస్ కూడా 8 వికెట్ల తేడాతో ఓడింది.

గ్రూప్ దశలో న్యూజిలాండ్ 5 మ్యాచ్‌లలో 4 గెలిచింది. 1 మ్యాచులో ఓడిపోయింది. గ్రూప్ 2లో తమ తొలి మ్యాచ్‌లో ఈ జట్టు పాకిస్థాన్ చేతిలో 5 వికెట్ల తేడాతో ఓడిపోయింది. అయితే ఆ తర్వాత రెండో మ్యాచ్‌లో భారత్‌ను 8 వికెట్ల తేడాతో ఓడించింది. మూడో మ్యాచ్‌లో స్కాట్లాండ్‌తో 16 పరుగుల తేడాతో ఓడిపోయింది. 52 పరుగుల తేడాతో నమీబియాను ఓడించింది. కాగా ఆఫ్ఘనిస్థాన్‌ను 8 వికెట్ల తేడాతో చిత్తు చేసింది.

ఆస్ట్రేలియా వర్సెస్ న్యూజిలాండ్ రెండూ తమ తమ సెమీ-ఫైనల్ మ్యాచ్‌లను 5 వికెట్ల తేడాతో గెలిచాయి. టోర్నీ తొలి సెమీఫైనల్‌లో న్యూజిలాండ్ 1 ఓవర్ మిగిలి ఉండగానే 5 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ను ఓడించింది. ఇదే తరహాలో 1 ఓవర్ మిగిలి ఉండగానే 5 వికెట్ల తేడాతో పాకిస్థాన్‌తో జరిగిన రెండో సెమీ ఫైనల్‌లో ఆస్ట్రేలియా గెలిచి రికార్డు సృష్టించింది.

టీ20 ప్రపంచకప్ టైటిల్‌ను ఆస్ట్రేలియాతోపాటు న్యూజిలాండ్ టీంలు ఇప్పటి వరకు అందుకోలేక పోయాయి. అటువంటి పరిస్థితిలో ఈ ఫైనల్ పోటీలో ఏ జట్టు గెలుస్తుందో, అది మొదటిసారి టైటిల్ గెలుచుకున్న జట్టుగా మారనుంది. అయితే న్యూజిలాండ్ ఇలా చేస్తే మరో అడుగు ముందుకేసి ఒకే ఏడాదిలో 2 ఐసీసీ టైటిల్స్ గెలిచిన తొలి జట్టుగా అవతరిస్తుంది.

Also Read: India Vs New Zealand: 24 ఏళ్ల రికార్డును బ్రేక్ చేసిన భారత ఆటగాడు.. ప్రస్తుతం కివీస్ సిరీస్‌‌లో సత్తా చాటేందుకు రెడీ..!

India vs New Zealand: హర్దిక్ పాండ్యా కంటే బెస్ట్ ఆల్‌రౌండర్‌.. ఎలా మరిచారంటూ బీసీసీఐ సెలక్టర్లపై ఫైరవుతోన్న నెటిజన్లు