IND vs SA: ప్చ్‌.. భారత్ వర్సెస్‌ సౌతాఫ్రికా మొదటి టీ20 వర్షార్ఫరణం.. రెండో మ్యాచ్‌ ఎప్పుడంటే?

దక్షిణాఫ్రికా వర్సెస్‌ భారత్ జట్ల మధ్య జరగాల్సిన తొలి టీ20 మ్యాచ్‌ వర్షార్పణమైంది. ఎడతెరిపిలేకుండా వర్షం పడడంతో టాస్‌ కూడా పడలేదు. అయితే కుదింపు ఓవర్లతో మ్యాచ్ నిర్వహిస్తారని క్రికెట్‌ ఫ్యాన్స్‌ భావించారు. అయితే వర్షం అసలు తగ్గకపోడం, మైదానం పూర్తిగాతడిసిపోవడంతో మ్యాచ్‌ను రద్దు చేయాలని అంపైర్లు నిర్ణయించారు.

IND vs SA: ప్చ్‌.. భారత్ వర్సెస్‌ సౌతాఫ్రికా మొదటి టీ20 వర్షార్ఫరణం.. రెండో మ్యాచ్‌ ఎప్పుడంటే?
India Vs South Africa

Updated on: Dec 10, 2023 | 10:12 PM

దక్షిణాఫ్రికా వర్సెస్‌ భారత్ జట్ల మధ్య జరగాల్సిన తొలి టీ20 మ్యాచ్‌ వర్షార్పణమైంది. ఎడతెరిపిలేకుండా వర్షం పడడంతో టాస్‌ కూడా పడలేదు. అయితే కుదింపు ఓవర్లతో మ్యాచ్ నిర్వహిస్తారని క్రికెట్‌ ఫ్యాన్స్‌ భావించారు. అయితే వర్షం అసలు తగ్గకపోడం, మైదానం పూర్తిగాతడిసిపోవడంతో మ్యాచ్‌ను రద్దు చేయాలని అంపైర్లు నిర్ణయించారు. ఈ మ్యాచ్‌లో టాస్ కూడా జరగకపోవడంతో ప్రేక్షకులు నిరాశతో వెనుదిరగాల్సి వచ్చింది. ఇప్పుడు సిరీస్‌లో రెండు మ్యాచ్‌లు మాత్రమే మిగిలి ఉన్నాయి. రెండో మ్యాచ్ డిసెంబర్ 12న పోర్ట్ ఎలిజబెత్‌లో జరగనుండగా, మూడో మరియు చివరి మ్యాచ్ డిసెంబర్ 14న జోహన్నెస్‌బర్గ్‌లోని చారిత్రాత్మక వాండరర్స్ స్టేడియంలో జరగనుంది. ఆ తర్వాత మూడు వన్డేల సిరీస్‌ ప్రారంభం కానుంది. కాగా రెండో మ్యాచ్ డిసెంబర్ 12న పోర్ట్ ఎలిజబెత్‌లో జరగనుంది. అయితే ఇప్పటి వరకు వాతావరణ శాఖ అంచనాల ప్రకారం మంగళవారం పోర్ట్ ఎలిజబెత్‌లో వర్షం కురుస్తుందని, అలాంటి పరిస్థితుల్లో ఆ మ్యాచ్‌పై కూడా ప్రభావం పడినా ఆశ్చర్యపోనక్కర్లేదని తెలుస్తోంది.

ఈ మ్యాచ్‌ రద్దు కావడంతో టీ20 ప్రపంచకప్‌కు సిద్ధమయ్యే అవకాశం టీమిండియాకు లేకుండా పోయింది. ఈ సిరీస్ ద్వారా, అర్ష్‌దీప్ సింగ్, శ్రేయాస్ అయ్యర్, తిలక్ వర్మ, రితురాజ్ గైక్వాడ్ వంటి ఆటగాళ్లు తమ ప్రతిభను చాటుకుని ప్రపంచ కప్‌లో చోటు దక్కించుకుందామన్నారు. అయితే ఇప్పుడు వారి ఆశలపై వర్షం నీళ్లు చల్లింది. ఇదొక్కటే కాదు, ఈ సిరీస్‌లో జట్టుకు సారథ్యం వహిస్తున్న సూర్యకుమార్ యాదవ్.. టీ20 ఇంటర్నేషనల్‌లో అత్యంత వేగంగా 2000 పరుగులు పూర్తి చేసిన రికార్డును నెలకొల్పేందుకు మరికొంత కాలం ఆగాల్సిందే. ఇక్కడికి చేరుకోవడానికి కేవలం 15 పరుగులు మాత్రమే కావాలి, తదుపరి మ్యాచ్‌లోనైనా ఈ రికార్డును అందుకుంటాడో లేదో చూడాలి మరి. టీ20 క్రికెట్‌లో భారత్, దక్షిణాఫ్రికా జట్లు ఇప్పటి వరకు 24 సార్లు తలపడ్డాయి. ఈసారి 13 మ్యాచ్‌ల్లో టీమిండియా గెలుపొందగా, దక్షిణాఫ్రికా 10 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. కొన్ని కారణాల వల్ల మరో మ్యాచ్‌లో ఫలితం తేలలేదు.

ఇవి కూడా చదవండి

దక్షిణాఫ్రికా టీ20 జట్టు: రీజా హెండ్రిక్స్, మాథ్యూ బ్రెయిట్జ్క్, ట్రిస్టన్ స్టబ్స్, ఐడెన్ మార్క్రామ్ (కెప్టెన్), హెన్రిక్ క్లాసెన్ (వికెట్ కీపర్), డేవిడ్ మిల్లర్, ఆండిల్ ఫెహ్లుక్వాయో, కేశవ్ మహరాజ్, గెరాల్డ్ కోయెట్జీ, నాండ్రే జార్టెన్సీ, డాన్‌కోర్ జార్టెన్‌సి, డాన్‌కోర్ జార్టెన్సీ, టాబ్రిజ్ జార్టెన్‌సి ఫెరీరా, లిజార్డ్ విలియమ్స్.

భారత టీ20 జట్టు: యస్సవి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), రింకూ సింగ్, జితేశ్ శర్మ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, దీపక్ చాహర్, రవి బిష్ణోయ్, మహ్మద్ సిరాజ్, అర్షదీప్ సింగ్, ఇషాన్ కిషన్, ముఖేష్ కుమార్ వాషింగ్టన్ సుందర్, రుతురాజ్ గైక్వాడ్, తిలక్ వర్మ, కుల్దీప్ యాదవ్.