టీమిండియాలో చోటు లేదంటూ ఛీ కొట్టారు.. కట్‌చేస్తే.. 17 ఫోర్లు, 4 సిక్స్‌లతో సెలెక్టర్లకు ఇచ్చిపడేశాడుగా..!

Shahbaz Ahmed: టీమిండియాకు దూరమైనప్పటికీ షాబాజ్‌ తన ప్రయత్నాలను ఆపలేదు. దులీప్‌ ట్రోఫీలో ఎర్రబంతి క్రికెట్‌తో మరోసారి సత్తా చాటాడు. నార్త్‌ ఈస్ట్‌ జోన్‌పై 167 పరుగుల ఇన్నింగ్స్‌ అతడి బ్యాటింగ్‌ సామర్థ్యాన్ని మరోసారి చాటింది. ముఖ్యంగా జట్టుకు భారీ స్కోరు అవసరమైన సమయంలో ఈస్ట్‌ జోన్‌ తరఫున కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు.

టీమిండియాలో చోటు లేదంటూ ఛీ కొట్టారు.. కట్‌చేస్తే.. 17 ఫోర్లు, 4 సిక్స్‌లతో సెలెక్టర్లకు ఇచ్చిపడేశాడుగా..!
Shahbaz Ahmed

Updated on: Aug 25, 2026 | 7:00 AM

Shahbaz Ahmed: టీమిండియాలో చోటు కోసం పోటీపడుతున్న ఆల్‌రౌండర్ షాబాజ్ అహ్మద్ దులీప్ ట్రోఫీ 2026లో అదరగొట్టాడు. ఈస్ట్ జోన్ తరపున నార్త్ ఈస్ట్ జోన్‌పై క్వార్టర్‌ఫైనల్లో 167 పరుగులతో ఫస్ట్‌క్లాస్ స్కోరు నమోదు చేశాడు. 244 బంతులు ఎదుర్కొన్న అహ్మద్ 17 ఫోర్లు, 4 సిక్సర్లతో సెంచరీ బాదేశాడు. ఈ ఇన్నింగ్స్‌తో సెలెక్టర్లకు గట్టి సమాధానం ఇచ్చాడు. రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ వంటి ఆల్‌రౌండర్ల కారణంగా అవకాశాలు దూరమైన షాబాజ్‌కు మానవ్ సుతార్ రాకతో పోటీ మరింత పెరిగింది. అయినా వెనక్కి తగ్గని ఈ ఎడమచేతి వాటం ఆటగాడు భారీ ఇన్నింగ్స్ ఆడాడు. టీమిండియాకు చివరిసారి 2023 ఆసియా క్రీడల్లో ఆడిన షాబాజ్ మళ్లీ ఎంపికపై ఆశలు రేపుతున్నాడు. దేశవాళీ క్రికెట్‌లో సత్తా చాటిన అతడు ఎర్రబంతి క్రికెట్‌లోనూ తన సామర్థ్యాన్ని చూపించాడు. ప్రదర్శన తర్వాత జట్టులోకి పిలుపు వస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది.

బెంగళూరులో షాబాజ్‌ అద్భుత ఇన్నింగ్స్‌..

దులీప్‌ ట్రోఫీ 2026 తొలి క్వార్టర్‌ఫైనల్లో ఈస్ట్‌ జోన్‌, నార్త్‌ ఈస్ట్‌ జోన్‌ తలపడుతున్నాయి. బెంగళూరులోని బీసీసీఐ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌లో ఈ మ్యాచ్‌ జరుగుతోంది. ఈస్ట్‌ జోన్‌ తొలి ఇన్నింగ్స్‌లో షాబాజ్‌ అహ్మద్‌ తన బ్యాటింగ్‌ సత్తా చాటాడు. మ్యాచ్‌ తొలి రోజే శతకం పూర్తి చేసిన అతడు.. రెండో రోజు 150 పరుగుల మార్క్‌ను కూడా దాటాడు. చివరకు 167 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔటయ్యాడు.

ఎక్కువమంది చదివినది: Rishabh Pant: జస్ట్ 63.. ధోని రికార్డ్‌‌నే బద్దలు కొట్టిన రిషబ్ పంత్.. అదేంటో తెలుసా..?

244 బంతులు ఎదుర్కొన్న షాబాజ్‌ 17 ఫోర్లు, నాలుగు సిక్సర్లు బాదాడు. ఇది అతడి ఫస్ట్‌క్లాస్‌ కెరీర్‌లోనే అత్యధిక వ్యక్తిగత స్కోరు. ఇంతకుముందు 116 పరుగులు అతడి అత్యుత్తమ స్కోరుగా ఉంది. షాబాజ్‌తో పాటు సుదీప్‌ కుమార్‌ ఘరామీ కూడా 146 పరుగులతో మెరిశాడు. వీరిద్దరి భారీ ఇన్నింగ్స్‌లతో ఈస్ట్‌ జోన్‌ తొలి ఇన్నింగ్స్‌లో 467 పరుగులు చేసింది.

టీమిండియాలోకి దారులు మూసుకుపోయాయా..?

షాబాజ్‌ అహ్మద్‌ 2022లో భారత జట్టులోకి అరంగేట్రం చేశాడు. ఇప్పటివరకు మూడు వన్డేలు, రెండు టీ20లు కలిపి ఐదు అంతర్జాతీయ మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. టీమిండియా తరపున అతడి చివరి మ్యాచ్‌ 2023 ఆసియా క్రీడల్లో జరిగింది. ఆ తర్వాత రెండేళ్లకు పైగా జాతీయ జట్టుకు దూరంగా ఉన్నాడు.

గత ఏడాది దక్షిణాఫ్రికాతో జరిగిన ఐదు టీ20ల సిరీస్‌లో అక్షర్‌ పటేల్‌ గాయపడటంతో చివరి రెండు మ్యాచ్‌లకు షాబాజ్‌ను ఎంపిక చేశారు. కానీ తుది జట్టులో చోటు మాత్రం దక్కలేదు. బెంచ్‌కే పరిమితమయ్యాడు. ఈ ఏడాది ఆరంభంలో న్యూజిలాండ్‌తో జరిగిన ఐదు టీ20ల సిరీస్‌కు కూడా అతడిని ఎంపిక చేయలేదు.

జడేజా, అక్షర్‌ మధ్య పోటీ..

దేశవాళీ క్రికెట్‌లో షాబాజ్‌ అహ్మద్‌కు మంచి గుర్తింపు ఉంది. ఎడమచేతి వాటం స్పిన్‌ ఆల్‌రౌండర్‌గా అతడు జట్టుకు ఉపయోగపడగలడు. కానీ టీమిండియాలో రవీంద్ర జడేజా, అక్షర్‌ పటేల్‌ వంటి నాణ్యమైన ఆల్‌రౌండర్లు ఉండటంతో షాబాజ్‌కు అవకాశాలు పరిమితమయ్యాయి. తాజాగా మానవ్‌ సుతార్‌ కూడా పోటీలోకి రావడంతో అతడి మార్గం మరింత కఠినంగా మారింది.

ఎక్కువమంది చదివినది: Video: దులీప్ ట్రోఫీలో వైభవ్ సూర్యవంశీ జెర్సీపై టేప్.. అసలు సీక్రెట్ ఏంటంటే..?

అలాంటి పరిస్థితుల్లో దులీప్‌ ట్రోఫీ వేదికగా షాబాజ్‌ భారీ ఇన్నింగ్స్‌ ఆడటం ప్రాధాన్యం సంతరించుకుంది. 167 పరుగులు చేయడం ద్వారా తన ఫస్ట్‌క్లాస్‌ కెరీర్‌లోనే అత్యధిక స్కోరు నమోదు చేశాడు.

సెలెక్టర్లకు గట్టి సమాధానమా..?

టీమిండియాకు దూరమైనప్పటికీ షాబాజ్‌ తన ప్రయత్నాలను ఆపలేదు. దులీప్‌ ట్రోఫీలో ఎర్రబంతి క్రికెట్‌తో మరోసారి సత్తా చాటాడు. నార్త్‌ ఈస్ట్‌ జోన్‌పై 167 పరుగుల ఇన్నింగ్స్‌ అతడి బ్యాటింగ్‌ సామర్థ్యాన్ని మరోసారి చాటింది. ముఖ్యంగా జట్టుకు భారీ స్కోరు అవసరమైన సమయంలో ఈస్ట్‌ జోన్‌ తరఫున కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు.

ఇప్పుడు ఈ ప్రదర్శన తర్వాత షాబాజ్‌ అహ్మద్‌కు జాతీయ జట్టులో మరో అవకాశం దక్కుతుందా అనేది ఆసక్తికరంగా మారింది. దులీప్‌ ట్రోఫీలో అతడి ప్రదర్శనను సెలెక్టర్లు ఎలా పరిగణిస్తారో చూడాలి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us