
Indian Cricket Team Selection: భారత క్రికెట్ జట్టులో అత్యంత ప్రతిభ ఉండి కూడా నిరంతరం వివక్షకు గురవుతున్న ఆటగాడు ఎవరైనా ఉన్నారంటే అది సంజూ శాంసన్ మాత్రమే అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఐపీఎల్ లో భారీ శతకాలతో చెన్నై సూపర్ కింగ్స్ తరపున పరుగుల వరద పారించినా, సెలెక్టర్ల హృదయం మాత్రం కరగలేదు. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని ఎంపిక కమిటీ అఫ్గానిస్తాన్తో వన్డే సిరీస్ కోసం ప్రకటించిన 14 మంది సభ్యుల జట్టులో సంజూ పేరు లేకపోవడం అభిమానులకు పెద్ద షాక్ ఇచ్చింది. వికెట్ కీపర్ కోటాలో కేఎల్ రాహుల్కు తోడుగా ఇషాన్ కిషన్ను జట్టులోకి తీసుకున్నారు. నిలకడగా రాణిస్తున్న సంజూను ఏ ప్రాతిపదికన పక్కన పెట్టారంటూ సోషల్ మీడియాలో సెలెక్టర్లపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఎంపికలో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం దేవదత్ పడిక్కల్ను పక్కన పెట్టడం. కర్ణాటకకు చెందిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్ ప్రస్తుత సీజన్లో అన్ని ఫార్మాట్లలోనూ పరుగుల విధ్వంసం సృష్టించాడు. ఐపీఎల్లో బెంగళూరు తరఫున 12 ఇన్నింగ్స్ల్లో 173 స్ట్రైక్ రేట్తో 412 పరుగులు సాధించాడు. కేవలం ఐపీఎల్ మాత్రమే కాదు, రంజీ ట్రోఫీలో 543 పరుగులు, విజయ్ హజారే ట్రోఫీలో 9 ఇన్నింగ్స్ల్లో ఏకంగా 90 సగటుతో 725 పరుగులు చేసి టోర్నీలోనే రెండో అత్యధిక స్కోరర్గా నిలిచాడు. ఇంతటి నిలకడైన ప్రదర్శన చేసినా అతడికి పిలుపు రాకపోవడం అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది.
మహారాష్ట్ర ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ గతంలో దక్షిణాఫ్రికాపై వన్డేల్లో సెంచరీతో అదరగొట్టి తన ప్రతిభను నిరూపించుకున్నాడు. విజయ్ హజారే ట్రోఫీలోనూ 413 పరుగులు చేశాడు. అయినప్పటికీ సెలక్టర్లు కొత్త ముఖాలకు ప్రాధాన్యత ఇవ్వడంతో అతడికి చోటు దక్కలేదు. మరోవైపు ఉత్తరప్రదేశ్కు చెందిన యువ వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్ సైతం విజయ్ హజారే ట్రోఫీలో 122 స్ట్రైక్ రేట్తో 558 పరుగులు చేసి ఫినిషర్గా సత్తా చాటాడు. అయితే జట్టులో ఇప్పటికే కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్ రూపంలో ఇద్దరు అనుభవజ్ఞులైన కీపర్లు ఉండటంతో జురెల్కు నిరాశే మిగిలింది.
🚨 News 🚨
Presenting #TeamIndia‘s squads for the @IDFCFIRSTBank Test match and the 3️⃣-match ODI series against Afghanistan in June 🙌#INDvAFG pic.twitter.com/hFiABALLld
— BCCI (@BCCI) May 19, 2026
మరో వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శాంసన్ సైతం దురదృష్టవంతుడిగా మిగిలిపోయాడు. ఐపీఎల్లో చెన్నై తరఫున 477 పరుగులు చేయడంతో పాటు, దేశవాళీ మ్యాచ్ల్లో జార్ఖండ్పై అద్భుత శతకం బాదాడు. టీ20 ప్రపంచకప్లోనూ రాణించినా, వికెట్ కీపింగ్ విభాగంలో విపరీతమైన పోటీ కారణంగా సంజుకు చోటు దక్కలేదు. ఇక సీనియర్ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ ఉదంతం మరింత చర్చకు దారితీసింది. ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత జట్టుకు దూరమైన షమీ, రంజీ ట్రోఫీలో 37 వికెట్లు, విజయ్ హజారే ట్రోఫీలో 15 వికెట్లు తీసి సెలక్టర్ల తలుపు తట్టాడు. ఐపీఎల్లోనూ లక్నో తరఫున రాణిస్తున్నప్పటికీ, ఫిట్నెస్, పనిభారం మేనేజ్మెంట్లో భాగంగానే అతడిని పక్కన పెట్టినట్లు తెలుస్తోంది.
యువ ఆటగాళ్ల జోష్తో అఫ్గానిస్తాన్ను ఢీకొట్టేందుకు భారత్ సిద్ధమవుతున్నప్పటికీ, ఫామ్లో ఉన్న పడిక్కల్, శాంసన్, షమీ వంటి స్టార్ ఆటగాళ్లకు అవకాశం దక్కకపోవడం సెలక్టర్ల కఠిన నిర్ణయాలకు అద్దం పడుతోంది. ఎంపికైన యువ ఆటగాళ్లు ఈ అవకాశాన్ని ఎలా వినియోగించుకుంటారో వేచి చూడాలి.
అఫ్గానిస్తాన్ వన్డే సిరీస్కు భారత జట్టు (స్క్వాడ్): శుభ్మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, అర్ష్దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, ప్రిన్స్ యాదవ్, గుర్నూర్ బ్రార్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..