
Rohit Sharma ODI Retirement: భారత క్రికెట్ జట్టు సీనియర్ ప్లేయర్, కెప్టెన్ రోహిత్ శర్మ మే 7న టెస్ట్ ఫార్మాట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇంగ్లాండ్తో జరిగే టెస్ట్ సిరీస్కు ముందు హిట్మ్యాన్ రిటైర్మెంట్ చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. రోహిత్ శర్మ ఇకపై వన్డే ఫార్మాట్లో మాత్రమే టీమ్ ఇండియా తరపున ఆడుతున్నాడు. కానీ, ఇప్పుడు అతను వన్డేల నుంచి రిటైర్మెంట్ తీసుకుంటున్నట్లు వార్తలు కూడా వచ్చాయి. రోహిత్ శర్మ 50 ఓవర్ల క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తేదీని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

టీ20 ప్రపంచ కప్, ఛాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టును విజయపథంలో నడిపించిన కెప్టెన్ రోహిత్ శర్మ మే 7న టెస్ట్ ఫార్మాట్ నుంచి రిటైర్ అయ్యాడు. టీం ఇండియా టీ20 ప్రపంచ కప్ గెలిచిన తర్వాత, రోహిత్ శర్మ టీ20 ఫార్మాట్ నుంచి రిటైర్ అయ్యాడు. ఇప్పుడు ఇంగ్లాండ్ సిరీస్కు ముందు, అతను టెస్ట్ ఫార్మాట్కు వీడ్కోలు పలికాడు. రోహిత్ ఇకపై టీం ఇండియా తరపున వన్డేల్లో మాత్రమే ఆడనున్నాడు.

కానీ, ఇప్పుడు అతను 50 ఓవర్ల ఫార్మాట్ నుంచి రిటైర్మెంట్ తేదీ కూడా వెల్లడైంది. పిటిఐ నివేదిక ప్రకారం, రోహిత్ శర్మ చిన్ననాటి కోచ్ దినేష్ లాడ్ మాట్లాడుతూ, రోహిత్ 2027 వన్డే ప్రపంచ కప్ గెలవడమే తన లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాడని చెప్పుకొచ్చాడు. 2027 ప్రపంచ కప్ గెలిచి, ఆ తర్వాత రిటైర్ కావడమే రోహిత్ శర్మ లక్ష్యం అంటూ తెలిపాడు.

భారత జట్టు ఇప్పుడు జూన్లో ఇంగ్లాండ్తో 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆడాల్సి ఉంది. ఈ సిరీస్కు రోహిత్ శర్మను కెప్టెన్గా నియమిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ, హిట్ మాన్ ఐపీఎల్ 2025 మధ్యలో రిటైర్ అయ్యాడు. అతను ఈ సమాచారాన్ని ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేయడం ద్వారా ఇచ్చాడు.

ఐపీఎల్ 2025 తర్వాత జూన్లో భారత జట్టు ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్ ఆడాల్సి ఉంది. ఈ 5 మ్యాచ్ల సిరీస్ తర్వాత, టీం ఇండియా బంగ్లాదేశ్తో వన్డే సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ కోసం టీం ఇండియా బంగ్లాదేశ్లో పర్యటించాల్సి వచ్చింది. ఈ సిరీస్లో చాలా మంది యువ ఆటగాళ్లకు కూడా అవకాశం ఇవ్వనున్నారు. తదుపరి వన్డే ప్రపంచ కప్ 2027 లో జరగనుంది. 2023 లో రోహిత్ శర్మ కెప్టెన్సీలో టీమిండియా వన్డే ప్రపంచ కప్ ఫైనల్కు చేరుకుంది.