Video: అదిరా హిట్‌మ్యాన్ అంటే.. ట్రోఫీ అందుకున్న మహిళల జట్టు.. కన్నీళ్లు పెట్టుకున్న రోహిత్

Team India: 2023లో పురుషుల వన్డే ప్రపంచకప్‌ ఫైనల్‌లో ఓటమి బాధను చవిచూసిన కెప్టెన్‌గా, ఈ ట్రోఫీ ఎంత విలువైందో, దశాబ్దాల నిరీక్షణ ఎంత కష్టమైనదో రోహిత్‌కు తెలుసు. అందుకే, మహిళల జట్టు తొలిసారి ఈ కప్పును గెలుచుకున్న చారిత్రక విజయం ఆయన మనసును కదిలించింది.

Video: అదిరా హిట్‌మ్యాన్ అంటే.. ట్రోఫీ అందుకున్న మహిళల జట్టు.. కన్నీళ్లు పెట్టుకున్న రోహిత్
Rohit Sharma Cry Video

Updated on: Nov 03, 2025 | 2:18 PM

Rohit Sharma: భారత మహిళల క్రికెట్ జట్టు తమ మొట్టమొదటి ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్ 2025 (ICC Women’s ODI World Cup 2025) టైటిల్‌ను గెలుచుకున్న చారిత్రక క్షణాన, యావత్ దేశం ఆనందంతో ఉప్పొంగింది. నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో జరిగిన ఫైనల్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని టీమ్ ఇండియా, దక్షిణాఫ్రికాను 52 పరుగుల తేడాతో ఓడించి దశాబ్దాల కలను నెరవేర్చుకుంది.

అయితే, ఈ విజయం తర్వాత మైదానంలో ఆనందోత్సాహాలు వెల్లివిరిస్తే, స్టాండ్స్‌లో కూర్చున్న భారత పురుషుల జట్టు కెప్టెన్, ప్రపంచంలో నంబర్ 1 వన్డే బ్యాటర్ రోహిత్ శర్మ (Rohit Sharma) మాత్రం భావోద్వేగానికి లోనై కన్నీరు పెట్టుకున్నారు.

ఆఖరి క్షణం, అద్భుత దృశ్యం..!

చారిత్రక ఫైనల్ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించడానికి వచ్చిన అతిథులలో రోహిత్ శర్మ కూడా ఉన్నారు. భారత్ విజయం ఖరారైన ఆఖరి క్షణం వరకు ఆయన కళ్లు మైదానంపైనే ఉన్నాయి. భారత్ విధించిన 299 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో, దక్షిణాఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్డ్ (101 పరుగులు) అద్భుత సెంచరీతో పోరాడడంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది.

కానీ, భారత బౌలర్ దీప్తి శర్మ (Deepti Sharma) కీలకమైన వోల్వార్డ్ వికెట్‌ను తీయడంతో మ్యాచ్ భారత్ వైపు తిరిగింది. ఆ తర్వాత, దీప్తి శర్మ వేసిన చివరి వికెట్ పడగానే, స్టేడియం ఒక్కసారిగా గంభీరమైన నినాదాలతో దద్దరిల్లింది.

అదే సమయంలో, కెమెరాలు వీఐపీ ఎన్‌క్లోజర్‌ వైపు తిరగగా.. రోహిత్ శర్మ లేచి నిలబడి చప్పట్లు కొడుతూ కనిపించారు. విజయం ఆనందంలో ఆయన కళ్లు చెమర్చాయి, స్పష్టంగా ఆనంద భాష్పాలు ఆయన కళ్ళలో కనిపించాయి.

ఈ విజయం విలువ రోహిత్‌కు తెలుసు..

2023లో పురుషుల వన్డే ప్రపంచకప్‌ ఫైనల్‌లో ఓటమి బాధను చవిచూసిన కెప్టెన్‌గా, ఈ ట్రోఫీ ఎంత విలువైందో, దశాబ్దాల నిరీక్షణ ఎంత కష్టమైనదో రోహిత్‌కు తెలుసు. అందుకే, మహిళల జట్టు తొలిసారి ఈ కప్పును గెలుచుకున్న చారిత్రక విజయం ఆయన మనసును కదిలించింది. రోహిత్ శర్మ ఈ హృదయపూర్వక స్పందన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. అభిమానుల ప్రశంసలు దక్కించుకుంది. ఈ విజయం హర్మన్‌ప్రీత్ కౌర్ బృందానికి మాత్రమే కాదు, దేశ క్రికెట్‌కు గర్వకారణమని రోహిత్ భావోద్వేగం చాటిచెప్పింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us