India vs Australia: భారీ సిక్సర్ల రహస్యం ఇదే: అసలు విషయం చెప్పేసిన రింకూ సింగ్..

|

Dec 03, 2023 | 8:04 PM

Rinku Singh: నాలుగో టీ20లో భారత్ 20 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాను ఓడించింది. దీంతో అత్యధిక టీ20 ఇంటర్నేషనల్స్‌ను గెలిచిన జట్టుగా ప్రపంచ రికార్డు సృష్టించింది. 135 టీ20 విజయాలు సాధించిన పాకిస్థాన్‌ను వెనక్కి నెట్టి భారత్ తన 136వ టీ20లో విజయం సాధించింది. రాయ్‌పూర్‌లో జరిగిన నాలుగో టీ20లో విజయం సాధించడం ద్వారా 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో టీమిండియా 3-1తో తిరుగులేని ఆధిక్యంలో నిలిచింది. ఐదో, చివరి టీ20 నేడు బెంగళూరులో జరుగుతోంది.

India vs Australia: భారీ సిక్సర్ల రహస్యం ఇదే: అసలు విషయం చెప్పేసిన రింకూ సింగ్..
Rinku Singh
Follow us on

టీం ఇండియా యువ బ్యాట్స్‌మెన్ రింకూ సింగ్ ఎత్తు లేకపోయినా పొడవాటి సిక్సర్లు కొట్టే సత్తా ఉంది. ఆస్ట్రేలియాతో జరుగుతున్న టీ-20 సిరీస్‌లో నాలుగో మ్యాచ్‌లో 158 స్ట్రైక్ రేట్‌తో 46 పరుగుల ఇన్నింగ్స్ ఆడిన రింకూ.. తన పవర్ హిట్టింగ్ రహస్యాలను బయటపెట్టాడు. మ్యాచ్ అనంతరం, జట్టు వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ జితేష్ శర్మతో మాట్లాడుతూ, జిమ్‌లో వెయిట్ ట్రైనింగ్ తనకు భారీ షాట్లు ఆడే శక్తినిచ్చిందని రింకు చెప్పుకొచ్చాడు. అలాగే, చివరి ఓవర్లలో తన మనస్సును ప్రశాంతంగా ఉంచుతూ బ్యాటింగ్ చేయగలిగినందుకు ఐపీఎల్‌కు క్రెడిట్ ఇచ్చాడు.

వెయిట్‌ ట్రైనింగ్‌ వల్ల శక్తి..

మ్యాచ్‌ ముగిసిన తర్వాత 100 మీటర్ల సిక్స్‌లు ఎలా కొడతారని రింకూను జితేష్‌ అడిగాడు. దీనికి రింకూ స్పందిస్తూ- ప్రత్యేకంగా ఏమీ లేదు. నేను జిమ్‌కి వెళ్తానని మీకు తెలుసు. మంచి ఆహారం తింటాను. నాకు బరువులు ఎత్తడం అంటే చాలా ఇష్టం, ఇది నాకు సహజమైన శక్తిని ఇచ్చిందంటూ చెప్పుకొచ్చాడు.

జిమ్ లేదా గ్రౌండ్ అయినా, రింకూ తన బరువు శిక్షణ కోసం తన తోటి ఆటగాళ్లలో ప్రసిద్ధి చెందాడు. అతను రోజుకు 2 నుంచి 3 గంటలు వ్యాయామం చేస్తాడు.

రింకూ 29 బంతుల్లో 46 పరుగులు..

నాలుగో టీ20లో రింకూ సింగ్ 29 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 46 పరుగులు చేశాడు. ఈ సిక్సర్లలో ఒకటి 100 మీటర్లు. అదే మ్యాచ్‌లో జితేష్ 19 బంతుల్లో 35 పరుగులు చేశాడు.

ఆస్ట్రేలియాను 20 పరుగుల తేడాతో ఓడించిన భారత్..

నాలుగో టీ20లో భారత్ 20 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాను ఓడించింది. దీంతో అత్యధిక టీ20 ఇంటర్నేషనల్స్‌ను గెలిచిన జట్టుగా ప్రపంచ రికార్డు సృష్టించింది. 135 టీ20 విజయాలు సాధించిన పాకిస్థాన్‌ను వెనక్కి నెట్టి భారత్ తన 136వ టీ20లో విజయం సాధించింది.

రాయ్‌పూర్‌లో జరిగిన నాలుగో టీ20లో విజయం సాధించడం ద్వారా 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో టీమిండియా 3-1తో తిరుగులేని ఆధిక్యంలో నిలిచింది. ఐదో, చివరి టీ20 నేడు బెంగళూరులో జరుగుతోంది.

రాయ్‌పూర్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో 9 వికెట్లకు 174 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా జట్టు 20 ఓవర్లలో 7 వికెట్లకు 154 పరుగులు మాత్రమే చేయగలిగింది. భారత్ తరఫున రింకూ సింగ్ 46 పరుగులు చేయగా, అక్షర్ పటేల్ 3 వికెట్లు పడగొట్టాడు.

ఐపీఎల్‌లో 142.16 స్ట్రైక్ రేట్‌తో పరుగులు..

రింకూ సింగ్ 2018లో ఐపీఎల్‌లో అరంగేట్రం చేశాడు. ఐదేళ్లలో 31 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన అతను 142.16 స్ట్రైక్ రేట్‌తో 725 పరుగులు చేశాడు. సగటు 36.25లుగా నిలిచింది. రింకూ 54 ఫోర్లు, 38 సిక్సర్లు కొట్టాడు.

ఆసియా క్రీడల్లో 247 స్ట్రైక్ రేట్‌తో పరుగులు..

అలాగే రింకు సింగ్ ఆసియా క్రీడల్లో 3 మ్యాచ్‌ల్లో 246.66 స్ట్రైక్ రేట్‌తో 37 పరుగులు చేశాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..