RR Vs MI: కట్టుదిట్టంగా బౌలింగ్ చేసిన ముంబై.. 158 పరుగులు చేసిన రాజస్థాన్‌ రాయల్స్‌..

|

Apr 30, 2022 | 10:33 PM

IPL 2022: ఐపీఎల్‌ 2022లో భాగంగా ముంబైలోని డీవై పాటిల్‌ స్టేడియంలో రాజస్థాన్‌ రాయల్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో మొదటి బ్యాటింగ్‌ చేసిన రాజస్థాన్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల్ కోల్పోయి 158 పరుగులు చేసింది...

RR Vs MI: కట్టుదిట్టంగా బౌలింగ్ చేసిన ముంబై.. 158 పరుగులు చేసిన రాజస్థాన్‌ రాయల్స్‌..
Rr
Follow us on

ఐపీఎల్‌ 2022లో భాగంగా ముంబైలోని డీవై పాటిల్‌ స్టేడియంలో రాజస్థాన్‌ రాయల్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ చేసిన రాజస్థాన్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల్ కోల్పోయి 158 పరుగులు చేసింది. రాయల్స్ ఇన్నింగ్స్ ఐదో ఓవర్‌లో తొలి వికెట్‌ కోల్పోయింది. 15 బంతుల్లో 15 పరుగులు చేసిన దేవదూత్‌ పడిక్కల్‌ షోకీన్‌ బౌలింగ్‌లో క్యాచ్‌ ఔట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన కెప్టెన్‌ సంజు శాంసన్‌ దాటిగా అడే ప్రయత్నం చేశాడు. 7 బంతుల్లో 2 సిక్స్‌లు కొట్టిన శాంసన్ మరో భారీ షాట్‌కు యత్నించగా బౌండరీ వద్ద ఫిల్డర్‌కు చిక్కాడు. ఆ తర్వాత వచ్చిన డారిల్ మిచెల్‌ 17 పరుగులకే వెనుదిరిగాడు.

రాజస్థాన్‌ క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. మరోవైప్‌ బట్లర్ ఆచితూచి ఇన్నింగ్స్ ఆడాడు. ఆ తర్వాత గేర్‌ మార్చి దాటిగా ఆడే క్రమంలో క్యాచ్‌ ఔట్‌ అయి పెవిలియన్‌ చేరాడు. బట్లర్‌ 52 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లతో 67 పరుగులు చేశాడు. రవిచంద్రన్‌ అశ్విన్‌ 9 బంతుల్లో 21 పరుగులు చేశాడు. హెట్మేయర్ 6, పరాగ్ 3, బౌల్ట్‌ 4 పరుగులు చేశారు. ముంబై బౌలర్లలో షోకీన్‌, మెరిడిత్‌కు రెండేసి వికెట్లు పడగొట్టగా.. కార్తికేయ, డానియల్ సామ్ ఒక్కో వికెట్ తీశారు.

Read Also.. GT vs RCB IPL Match Result: గుజరాత్‌ ఖాతాలో ఎనిమిదో విజయం.. ప్లేఆఫ్స్‌ బెర్త్‌ ఖరారైనట్లే..!