PAK Vs WI: టీ20లో వెస్టిండీస్‎పై పాకిస్తాన్ ఘన విజయం.. రాణించిన హైదర్ అలీ, రిజ్వాన్..

|

Dec 14, 2021 | 6:38 AM

కరాచీ వేదికగా జరిగిన తొలి టీ20 మ్యాచ్‎లో వెస్టిండీస్‎పై పాకిస్తాన్ 63 పరుగుల తేడాతో విజయం సాధించింది. సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.

PAK Vs WI: టీ20లో వెస్టిండీస్‎పై పాకిస్తాన్ ఘన విజయం.. రాణించిన హైదర్ అలీ, రిజ్వాన్..
Pak
Follow us on

కరాచీ వేదికగా జరిగిన తొలి టీ20 మ్యాచ్‎లో వెస్టిండీస్‎పై పాకిస్తాన్ 63 పరుగుల తేడాతో విజయం సాధించింది. సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 6 వికెట్లకు 200 పరుగులు చేసింది. 201 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్‎కు దిగిన వెస్టిండీస్ జట్టు కేవలం 137 పరుగులకే ఆలౌటైంది. మహ్మద్ రిజ్వాన్, హైదర్ అలీ అర్ధ సెంచరీలతో పాక్ విజయం సాధించారు. బౌలింగ్‎లో మహ్మద్ వసీమ్ 4, షాదాబ్ ఖాన్ 3 వికెట్లు తీశారు.

వెస్టిండీస్‌ను ఓడించి పాకిస్తాన్ ప్రపంచ రికార్డు కూడా సృష్టించింది. ఏడాది వ్యవధిలో టీ20లో అత్యధిక విజయాలు సాధించి తొలి జట్టు పాకిస్తాన్ నిలిచింది. 17 విజయాల రికార్డును బద్దలు కొట్టింది. భారత్, దక్షిణాఫ్రికా జట్లు ఏడాదిలో 15 విజయాలు నమోదు చేసి తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. హైదర్ అలీ 39 బంతుల్లో 68 పరుగులు చేసి పాక్ విజయంలో కీలక పాత్రో పోషించాడు. 6 ఫోర్లు, 4 సిక్సర్లు బాదాడు. హైదర్ అలీ 174 స్ట్రైక్ రేట్ వద్ద పరుగులు చేశాడు. రోహిత్ శర్మను ఆదర్శంగా భావించిన హైదర్ అలీ కేవలం 29 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేశాడు.

మహ్మద్ రిజ్వాన్ కూడా 78 పరుగులు చేశాడు. పాక్ కెప్టెన్ బాబర్ ఆజం డౌక్ ఔటయ్యాడు. మూడు ఫార్మాట్లలో ఈ ఏడాది నాలుగోసారి ఖాతా తెరవకుండానే ఔటయ్యాడు. వెస్టిండీస్‌లో ఏ బ్యాట్స్‌మెన్ కూడా పెద్ద ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు. వికెట్ కీపర్ షాయ్ హోప్ 26 బంతుల్లో 31 పరుగులు చేశాడు. రోవ్‌మన్ పావెల్ 23 పరుగులు చేశాడు. ఓడియన్ స్మిత్ 24, రొమారియో షెపర్డ్ 21 పరుగులు చేశారు.

Read Also.. IND vs SA: టీమిండియాకు షాక్‌.. దక్షిణాఫ్రికాతో టెస్ట్‌ సిరీస్‌కు రోహిత్‌ దూరం.. వన్డేలకు కూడా డౌటే!