
Marco Jansen Matthew Forde heated fight: టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశలో దక్షిణాఫ్రికా – వెస్టిండీస్ మధ్య అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ మ్యాచ్లో వెస్టిండీస్ ఆటగాడు మ్యాథ్యూ ఫోర్డ్, దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ మార్కో జాన్సన్ మధ్య మాటల యుద్ధం జరిగింది. విండీస్ బ్యాటింగ్ కష్టాల్లో ఉన్న సమయంలో మ్యాథ్యూ ఫోర్డ్ స్క్వేర్ లెగ్ వైపు అద్భుతమైన పుల్ షాట్ ఆడి సిక్సర్ కొట్టాడు. ఈ షాట్ తర్వాత బౌలర్ వైపు చూస్తూ మాటలతో రెచ్చగొట్టినట్లు ప్రవర్తించాడు. రెండు జట్ల మధ్య ఇప్పటికే మాటల తూటాలు మారుతుండగా, ఈ సంఘటన మ్యాచ్లో టెన్షన్ను మరింత పెంచింది.
— crictalk (@crictalk7) February 26, 2026
మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో 10వ ఓవర్లో, మ్యాథ్యూ ఫోర్డ్ మార్కో జాన్సన్ బౌలింగ్లో సిక్సర్ కొట్టిన వెంటనే “యా.. యా..” అంటూ స్లెడ్జింగ్ చేసినట్లు కనిపించాడు. దీనికి ప్రతిగా దక్షిణాఫ్రికా కెప్టెన్ ఐడెన్ మార్క్రామ్, తన చూపుడు వేలుతో బ్యాట్స్మన్ను క్రీజ్లోకి వెనక్కి వెళ్లమని సంకేతం ఇచ్చాడు.
ఈ ఘటనతో మైదానంలో క్షణకాలం ఉద్రిక్తత నెలకొన్నప్పటికీ, అంపైర్లు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఇలాంటి మాటల యుద్ధాలు టీ20 మ్యాచ్లలో తరచూ కనిపిస్తున్నప్పటికీ, సూపర్-8 లాంటి కీలక దశల్లో ఆటగాళ్ల మధ్య ఉద్రిక్తతలు అభిమానులకు మరింత ఆసక్తిని కలిగిస్తున్నాయి.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, క్రికెట్ అభిమానుల మధ్య హాట్ టాపిక్గా మారింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..