Video: పంజాబ్ ఫీల్డింగ్ కష్టాలకు బ్రేక్.. కోచ్ రికీ పాంటింగ్ రియాక్షన్ వైరల్.. అసలేం జరిగిందంటే?

ఐపీఎల్ 2026 సీజన్‌లో పంజాబ్ కింగ్స్ జట్టును వేధిస్తున్న ప్రధాన సమస్య ఫీల్డింగ్. వరుస మ్యాచుల్లో క్యాచ్‌లు వదిలేస్తూ ఓటములను కొనితెచ్చుకున్న పంజాబ్, ఎట్టకేలకు ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన పోరులో అద్భుతమైన ఫీల్డింగ్‌తో ఆకట్టుకుంది. ముఖ్యంగా మార్కో జాన్సెన్ పట్టిన కళ్లు చెదిరే క్యాచ్ చూసి, ఫీల్డింగ్ విషయంలో అత్యంత కఠినంగా ఉండే హెడ్ కోచ్ రికీ పాంటింగ్ ముఖంలో చిరునవ్వు చిిందించడం విశేషం.

Video: పంజాబ్ ఫీల్డింగ్ కష్టాలకు బ్రేక్.. కోచ్ రికీ పాంటింగ్ రియాక్షన్ వైరల్.. అసలేం జరిగిందంటే?
Ricky Ponting Rejoices As Marco Jansen Reverses Punjab Kings Fielding Fortunes

Updated on: May 11, 2026 | 11:02 PM

శ్రేయాస్ అయ్యర్ నేతృత్వంలోని పంజాబ్ కింగ్స్ ఈ సీజన్‌లో బ్యాటింగ్‌లో అదరగొడుతున్నప్పటికీ, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో ఘోరంగా విఫలమవుతోంది. రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన వరుస మ్యాచుల్లో ఫీల్డింగ్ తప్పిదాల వల్లే పంజాబ్ ఓటమి పాలైంది. ముఖ్యంగా శశాంక్ సింగ్ కీలకమైన క్యాచ్‌లు వదలడంతో అతడిని తుది జట్టు నుంచి కూడా తప్పించాల్సి వచ్చింది. ఒక దశలో పంజాబ్ ఫీల్డింగ్ ప్రమాణాలు చూసి అభిమానులు సైతం అసహనం వ్యక్తం చేశారు.

మార్కో జాన్సెన్ సంచలన క్యాచ్..

సోమవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన 55వ లీగ్ మ్యాచ్‌లో పంజాబ్ ఫీల్డింగ్ దశ మారిపోయింది. ఇన్నింగ్స్ మూడో ఓవర్‌లో అర్ష్‌దీప్ సింగ్ వేసిన బంతిని ఢిల్లీ ఓపెనర్ కేఎల్ రాహుల్ భారీ షాట్ ఆడబోయి గాలిలోకి లేపాడు. వికెట్ కీపర్ ప్రభ్‌సిమ్రాన్ సింగ్ ఆ బంతి కోసం ప్రయత్నిస్తున్నప్పటికీ, ఎంతో చురుగ్గా కదిలిన మార్కో జాన్సెన్ పరిగెత్తుకుంటూ వచ్చి ఎడమ వైపుకు డైవ్ చేస్తూ అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు. ఈ క్యాచ్‌తో ప్రమాదకరమైన రాహుల్ ఇన్నింగ్స్‌కు తెరపడింది.

సంతోషంలో మునిగిపోయిన రికీ పాంటింగ్..

ఫీల్డింగ్ విషయంలో ఏమాత్రం రాజీపడని వ్యక్తి రికీ పాంటింగ్. ఆస్ట్రేలియా దిగ్గజ ఫీల్డర్‌గా పేరున్న పాంటింగ్, తన ఆటగాళ్లు క్యాచ్‌లు వదిలేసినప్పుడు డగౌట్‌లో తీవ్ర అసహనంతో కనిపించేవారు. అయితే, జాన్సెన్ పట్టిన ఈ అద్భుత క్యాచ్ చూసిన తర్వాత పాంటింగ్ తన సీట్లో నుంచి లేచి నిలబడి చప్పట్లు కొడుతూ అభినందించారు. తన శిష్యులు ఫీల్డింగ్‌లో మెరుగుపడటం చూసి ఆయన ఎంతో సంతృప్తిగా కనిపించారు.

మ్యాచ్ పరిస్థితి ఇలా..

ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 210 పరుగుల భారీ స్కోరు సాధించింది. యువ ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య (56) మెరుపు ఆరంభం ఇవ్వగా, కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ (59*) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్, అర్ష్‌దీప్ సింగ్ ధాటికి పవర్ ప్లేలోనే కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. డిసి వర్సెస్ పిబికెఎస్ లైవ్ స్కోర్ ప్రకారం, ప్రస్తుతం ఢిల్లీ లక్ష్య ఛేదనలో వెనుకబడి ఉంది.

Loading...
Unable to load recommendations.
Follow Us