Video: రంజీ ట్రోఫీలో చరిత్ర సృష్టించిన ఐపీఎల్ అన్‌సోల్డ్ ప్లేయర్.. వరుసగా 4 బంతుల్లో 4 వికెట్లతో రికార్డ్..

|

Feb 13, 2024 | 5:54 PM

Kulwant Khejroliya 4 Wickets in 4 Balls: రంజీ ట్రోఫీ 2024 గ్రూప్ డి మ్యాచ్‌లో బరోడాతో మధ్యప్రదేశ్ ఇన్నింగ్స్ 54 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో మధ్యప్రదేశ్ తరపున ఓ స్టార్ ప్లేయర్ అద్భుత ప్రదర్శన చేశాడు. ఈ మ్యాచ్‌లో మధ్యప్రదేశ్ బౌలర్లు, బ్యాట్స్‌మెన్ అద్భుత ప్రదర్శన చేశారు. మరోవైపు బరోడాకు చెందిన స్టార్ ప్లేయర్లు ఎవరూ అద్భుత ప్రదర్శన చేయలేకపోయారు.

Video: రంజీ ట్రోఫీలో చరిత్ర సృష్టించిన ఐపీఎల్ అన్‌సోల్డ్ ప్లేయర్..  వరుసగా 4 బంతుల్లో 4 వికెట్లతో రికార్డ్..
Kulwant Khejroliya
Follow us on

Ranji Trophy 2024 Madhya Pradesh vs Baroda: రంజీ ట్రోఫీలో అభిమానులు ప్రతిరోజూ ఉత్తేజకరమైన మ్యాచ్‌లను చూస్తున్నారు. ఇలాంటి ఉత్కంఠ మ్యాచ్ గ్రూప్ డిలో జరిగింది. ఈ మ్యాచ్‌లో బరోడాపై మధ్యప్రదేశ్ ఇన్నింగ్స్ 52 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో మధ్యప్రదేశ్ బౌలర్లు, బ్యాట్స్‌మెన్ అద్భుత ప్రదర్శన చేశారు. మరోవైపు బరోడాకు చెందిన స్టార్ ప్లేయర్లు ఎవరూ అద్భుత ప్రదర్శన చేయలేకపోయారు. దీంతో ఆ జట్టు ఘోర పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది.

అద్భుతం చేసిన మధ్యప్రదేశ్ బౌలర్..

మధ్యప్రదేశ్ ఫాస్ట్ బౌలర్ కుల్వంత్ ఖేజ్రోలియా బరోడాపై చాలా మంచి బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. అతని అద్భుతమైన ఆటతీరుకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. తొలి ఇన్నింగ్స్‌లో 2 వికెట్లు, రెండో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీశాడు. అతని అద్భుతమైన ప్రదర్శన ఆధారంగా, అతను రికార్డు పుస్తకాలలో నమోదు చేసుకున్నాడు. బరోడాపై హ్యాట్రిక్ సాధించాడు. ఇక్కడితో ఆగలేదు, నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు తీసి మధ్యప్రదేశ్‌కు మ్యాచ్‌ను గెలిపించాడు.

మూడవ బౌలర్‌గా రికార్డ్..

కుల్వంత్ ఖేజ్రోలియా బరోడా రెండో ఇన్నింగ్స్ 95వ ఓవర్ రెండో, మూడో, నాల్గవ, ఐదో బంతుల్లో శశ్వత్ రావత్, మహేశ్ పిథియా, భార్గవ్ భట్, ఆకాశ్ సింగ్ వికెట్లు పడగొట్టగా, మధ్యప్రదేశ్ బరోడాకు ఫాలో-ఆన్ ఇచ్చింది. రంజీ ట్రోఫీ చరిత్రలో నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు తీసిన మూడో బౌలర్‌గా నిలిచాడు. అతని కంటే ముందు ఢిల్లీకి చెందిన శంకర్ సైనీ, జమ్మూ కాశ్మీర్‌కు చెందిన మహ్మద్ ముధాసిర్ ఈ పని చేశారు. ఇది కాకుండా రంజీ ట్రోఫీలో మధ్యప్రదేశ్ తరపున హ్యాట్రిక్ సాధించిన మూడో బౌలర్‌గా కుల్వంత్ నిలిచాడు.

రంజీ ట్రోఫీలో వరుసగా నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు తీసిన బౌలర్లు:

1. శంకర్ సైనీ – (ఢిల్లీ vs హిమాచల్ ప్రదేశ్), 1988

2. మహ్మద్ ముధాసిర్ – (జమ్మూ కాశ్మీర్ vs రాజస్థాన్), 2018

3. కుల్వంత్ ఖేజ్రోలియా – (మధ్యప్రదేశ్ vs బరోడా), 2024

మధ్యప్రదేశ్‌ విజయం..

తొలుత బ్యాటింగ్ చేసిన మధ్యప్రదేశ్ జట్టు 454 పరుగుల భారీ స్కోరు చేసింది. జట్టు తరపున హిమాన్షు మంత్రి అత్యధికంగా 11 పరుగులు చేశాడు. కెప్టెన్ శుభమ్ శర్మ 61 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో బరోడా బ్యాట్స్‌మెన్ 132 పరుగులకు ఆలౌట్ అయ్యారు. ఫాలో-ఆన్ ఆడుతున్నప్పుడు, శాశ్వత్ రావత్ బరోడా రెండవ ఇన్నింగ్స్‌లో 105 పరుగులు చేశాడు. కానీ, జట్టు ఓటమిని మాత్రం తప్పించలేకపోయాడు. రెండో ఇన్నింగ్స్‌లో బరోడా జట్టు 270 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో ఆ జట్టు ఇన్నింగ్స్ 54 పరుగుల తేడాతో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..