AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2025: కావ్య పాప వద్దంది.. కట్ చేస్తే..ఆ ప్లేయర్ కోసం క్యూ కడుతున్న ప్రాంఛైజీలు

శుక్రవారం భారత్‌తో జరిగిన నాలుగో టీ20 మ్యాచ్లో జాన్సన్ 12 బాల్స్‌లో 29 పరుగులతో చెలరేగాడు. 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో అదరగొట్టాడు. దీంతో తనను ఐపీఎల్‌లో తీసుకోవాలని అన్ని జట్లు పోటీ పడుతున్నట్లు తెలుస్తుంది.

IPL 2025: కావ్య పాప వద్దంది.. కట్ చేస్తే..ఆ ప్లేయర్ కోసం క్యూ కడుతున్న ప్రాంఛైజీలు
Ipl Teams Targets South Africa's Marco Jansen At Mega Auction
Velpula Bharath Rao
|

Updated on: Nov 16, 2024 | 12:42 PM

Share

దక్షిణాఫ్రికా పేసర్ మార్కో జాన్సెన్ ఈ నెల చివర్లో సౌదీ అరేబియాలోని జెడ్డాలో జరగనున్న మెగా వేలంలో పాల్గొనున్నాడు.  భారత్‌తో సెంచూరియన్‌లో మూడో టీ20లో భారత ఇన్నింగ్స్‌లో ఒక వికెట్ తీసిన తర్వాత, జాన్సెన్ 17 బంతుల్లో 54 పరుగులతో టీమిండియా జట్టును వెంటాడుతూ 220 పరుగుల ఛేదనలో దక్షిణాఫ్రికాను చివరి ఓవర్ వరకు ఉంచాడు. అయితే, చివరి ఓవర్‌లో అర్ష్‌దీప్ సింగ్ నుండి అద్భుతమైన బౌలింగ్ వల్ల ఘోర ఓటమి చవిచూడల్సి వచ్చింది. సెంచూరియన్లలో తన ఇన్నింగ్స్‌లో, జాన్సెన్ నాలుగు ఫోర్లు మరియు ఐదు సిక్సర్లు కొట్టాడు. అతని తొలి T20I అర్ధ సెంచరీ కూడా దక్షిణాఫ్రికా తరఫున అతి తక్కువ ఫార్మాట్‌లో (16 బంతుల్లో) చేశాడు. 2021 వేలంలో ముంబై ఇండియన్స్ కేవలం 20 లక్షలకు అతన్ని కొనుగోలు చేసినప్పుడు 24 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడు అతను IPLలో మొదటిసారి ఎంపికయ్యాడు . అయితే, MIలో తనకు పరిమిత అవకాశాలు లభించాయి. దీంతో  కేవలం రెండు మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. మరుసటి సంవత్సరం సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జాన్‌సెన్‌ను తీసుకువచ్చింది. SRHలో, జాన్సెన్ మూడు సీజన్లలో 19 గేమ్‌లు ఆడాడు, 18 వికెట్లు తీశాడు. సన్‌రైజర్స్ జాన్సెన్ ను రిటైన్ చేసుకోకపోవడంతో వేలంలో వచ్చాడు. శుక్రవారం భారత్‌తో జరిగిన నాలుగో టీ20 మ్యాచ్లో జాన్సన్ 12 బాల్స్‌లో 29 పరుగులతో చెలరేగాడు. 2 ఫోర్లు, 3 సిక్స్ లతో అదరగొట్టాడు. దీంతో తనను ఐపీఎల్‌లో తీసుకోవాలని అన్ని జట్లు పోటీ పడుతున్నట్లు తెలుస్తుంది.

ఇది కూడా చదవండి: తెలుగోడి దెబ్బ.. సౌతాఫ్రికా అబ్బా..బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు..

ముంబై ఇండియన్స్ IPL వేలంలో మార్కో జాన్సెన్‌ను కొనుగోలు చేయవచ్చు. జాన్సెన్, జస్ప్రీత్ బుమ్రాతో కలిసి MI  పేస్ అటాక్‌ను బలోపేతం  చేయగలడు. లోయర్ ఆర్డర్‌లో జాన్సెన్ పవర్-హిటింగ్ MIకి అవసరం అవుతుంది. ఐపీఎల్ 2025 కోసం రాజస్థాన్ రాయల్స్ ఆరుగురు ఆటగాళ్లను  రిటైన్ చేసుకుంది. వీరిలో ఒక బౌలర్ సందీప్ శర్మ, మిగిలినవారు బ్యాటర్లు.. దీంతో ఆర్‌ఆర్ మార్కో జాన్సెన్ ను వేలంలో తీసుకునే అవకాశం ఉంది. IPL 2025 కోసం లక్నో సూపర్ జెయింట్స్ ఇద్దరు ఫాస్ట్ బౌలర్లు మయాంక్ యాదవ్, మొహ్సిన్ ఖాన్‌లతో సహా ఐదుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకుంది. మార్కస్ స్టోయినిస్, కృనాల్ పాండ్యా విడుదలైనందున LSG వేలంలో మార్కో జాన్సెన్‌ను కొనుగోలు చేయవచ్చు. RCB గత సీజన్‌లో మహ్మద్ సిరాజ్, అల్జారీ జోసెఫ్, లాకీ ఫెర్గూసన్, రీస్ టాప్లీ వంటి ఫాస్ట్ బౌలర్‌లను కలిగి ఉంది. కానీ వారిలో ఎవరూ బాగా రాణించలేదు, దీనితో జట్టు వేలానికి ముందు వారందరినీ విడుదల చేసింది. కేవలం ముగ్గురు ఆటగాళ్లు మాత్రమే రిటైన్ చేసుకుంది. రాబోయే సీజన్‌కు RCB మార్కో జాన్సెన్‌ను లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉంది. IPL 2025 సీజన్ కోసం కోల్‌కతా నైట్ రైడర్స్‌లో మిచెల్ స్టార్క్ వదిలిపెట్టిన ఖాళీని పూరించడానికి మార్కో జాన్సెన్ బలమైన పోటీదారుగా మారుతున్నాడు. గత సంవత్సరం స్టార్క్‌ని ₹24.75 కోట్లకు కొనుగోలు చేసిన తర్వాత, KKR అతనిని వేలానికి ముందే విడుదల చేసింది. వారి బౌలింగ్ అటాక్‌లో, ముఖ్యంగా లెఫ్ట్ ఆర్మ్ పేస్ విభాగంలో శూన్యతను మిగిల్చింది. జాన్సెన్ 34 ఏళ్ల స్టార్క్‌తో పొలిస్తే బెటర్ అని అతని కేకేఆర్ కొనుగోలు చేసే అవకాశం ఉంది.

దక్షిణాఫ్రికాతో జరిగిన నాలుగో టీ20లో టీమిండియా 135 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో భారత జట్టు 4 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ని 3-1 తేడాతో కైవసం చేసుకుంది. టీ20 క్రికెట్‌లో అత్యంత బలమైన టీమ్‌గా ఉన్న దక్షిణాఫ్రికాను దక్షిణాఫ్రికాలో టీమిండియా ఓడించింది. అత్యధిక పరుగులు చేసి అత్యంత దారుణంగా ఓడించింది. జోహన్నెస్‌బర్గ్‌లోని వాండరర్స్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. సంజూ శాంసన్, అభిషేక్ శర్మలు టీమ్ ఇండియాకు మంచి స్టార్ట్ అందించారు. తొలి వికెట్‌కు 73 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన తర్వాత అభిషేక్ శర్మ (36) ఔటయ్యాడు. ఆ తర్వాత శాంసన్-తిలక్ వర్మల జోరు మొదలైంది. వీరిద్దరూ రెండో వికెట్‌కు 210 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.  సంజూ శాంసన్ 56 బంతుల్లో అజేయంగా 106 పరుగులు చేయగా, తిలక్ వర్మ 47 బంతుల్లో 120 పరుగులతో అజేయంగా నిలిచాడు. దీంతో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 283 పరుగులు చేసింది.

IPL 2025 మెగా వేలం కోసం, మొత్తం 1574 మంది ఆటగాళ్లు నమోదు చేసుకున్నారు, వారిలో 409 మంది విదేశాలకు చెందినవారు. దక్షిణాఫ్రికాలో అత్యధిక సంఖ్యలో క్రికెటర్లు నమోదు చేసుకున్నారు. జాన్సెన్ కాకుండా, వేలం కోసం రిజిస్టర్ చేసుకున్న ఇతర పెద్ద దక్షిణాఫ్రికా స్టార్లు డెవాల్డ్ బ్రెవిస్, నాండ్రే బర్డర్, గెరాల్డ్ కోయెట్జీ, క్వింటన్ డికాక్, ఫాఫ్ డుప్లెసిస్, కేశవ్ మహరాజ్, డేవిడ్ మిల్లర్ మరియు లుంగిడి తదితర ప్లేయర్లు కూడా ఉన్నారు.

ఇది చదవండి: ఢిల్లీ వద్దంది..ప్రీతి జింటా రమ్మంది.. మాక్ వేలంలో స్పైడర్ మ్యాన్‌కు భారీ ధర

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి