IPL 2022 Auction: మెగా వేలానికి సిద్ధమైన బెంగళూరు.. 10 జట్లు, 590 మంది ప్లేయర్లు.. పూర్తి షెడ్యూల్ ఇదే

|

Feb 10, 2022 | 7:14 PM

IPL 2022 Auction: IPL 15వ సీజన్ మెగా వేలం ఫిబ్రవరి 12, 13 తేదీల్లో బెంగళూరులో జరుగుతుంది.

IPL 2022 Auction: మెగా వేలానికి సిద్ధమైన బెంగళూరు.. 10 జట్లు, 590 మంది ప్లేయర్లు.. పూర్తి షెడ్యూల్ ఇదే
Ipl 2022
Follow us on

IPL 2022 Auction: ఐపీఎల్ 2022 మెగా వేలం(Mega Auction)లో కేవలం 2 రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఇప్పటికే అన్ని జట్లు తమ ప్రణాళికలను సిద్ధం చేసుకున్నాయి. బెంగళూరు(Bengaluru)లో ఫిబ్రవరి 12, 13 తేదీల్లో ఈ మెగా వేలం జరగనుంది. దీనిలో 10 జట్లు 590 మంది ఆటగాళ్లను కొనుగోలు చేయడం కోసం పోటీపడనున్నాయి. మెగా వేలం రెండు రోజుల పాటు ఉంటుంది. ఇది మార్క్యూ ప్లేయర్‌లతో ప్రారంభమవుతుంది. ఆపై మిగిలిన ఆటగాళ్ల పేర్లు వేలంలోకి రానున్నాయి. సహజంగానే, ఫ్రాంచైజీలే కాదు, వేలంలో పాల్గొన్న ఆటగాళ్లు కూడా బెంగళూరుపై దృష్టి సారించారు.

IPL 2022లో మొత్తం పది ఫ్రాంచైజీలు..
పది ఫ్రాంచైజీలు ఇప్పటికే కొంతమంది ఆటగాళ్లను రిటైన్ చేసుకున్నాయి. ఆ ఆటగాళ్లను నిలబెట్టుకున్న తర్వాత పంజాబ్ కింగ్స్.. తమ పర్సులో అత్యధిక డబ్బుని కలిగి ఉంది. మెగా వేలంలో పంజాబ్ కింగ్స్ రూ. 72 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంది. పంజాబ్ కింగ్స్ తర్వాత సన్‌రైజర్స్ హైదరాబాద్‌ పర్సులో రూ.68 కోట్లు, రాజస్థాన్ రాయల్స్ వద్ద రూ.62 కోట్లు, లక్నో జట్టుకు రూ.59 కోట్లు, అహ్మదాబాద్ వద్ద రూ.52 కోట్లు ఉన్నాయి. ఇవి కాకుండా చెన్నై, కోల్‌కతా, ముంబై జట్లు రూ. 48 కోట్లతో తమ జట్టును నిర్మించాల్సి ఉంది. అదే సమయంలో ఢిల్లీ పర్సులో అత్యల్పంగా రూ.47.50 కోట్లు మిగిలాయి.

ఫిబ్రవరి 12న మొదటి రోజు..
IPL 2022 మెగా వేలం మొదటి రోజు అంటే ఫిబ్రవరి 12న 161 మంది ఆటగాళ్లు వేలానికి రానున్నట్లు తెలుస్తోంది. బ్రాడ్‌కాస్ట్ ఛానెల్‌లో ఉదయం 11 గంటలకు వేలం ప్రసారం ప్రారంభమవుతుంది. కాగా, ఆటగాళ్ల వేలం మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రారంభం కానుంది. దీని తర్వాత ఫిబ్రవరి 13న కూడా ఆటగాళ్లు వేలం వేయనున్నారు. చాలా మంది కొత్త ముఖాలు 13న వేలానికి రానున్నట్లు తెలుస్తోంది. అలాగే తొలిరోజు వేలం వేయని ఆటగాళ్ల పేర్లు రెండో రోజు వేలంలోకి రానున్నారు.

మార్క్యూ ప్లేయర్ నుంచి వేలం ప్రారంభం..
వేలంలో 10 మంది మార్క్యూ ప్లేయర్ నుంచి మొదటి బిడ్ రానుంది. ఇందులో అందరూ రూ.2 కోట్ల బేస్ ధర ఉన్న ఆటగాళ్లే కావడం విశేషం. ఈ జాబితాలో అశ్విన్, శిఖర్ ధావన్, శ్రేయాస్ అయ్యర్ వంటి ఆటగాళ్లు కూడా ఉన్నారు.

అన్ని జట్ల దృష్టి ఇషాన్ కిషన్‌పైనే..
ఈ వేలంలో మొత్తం 10 ఫ్రాంచైజీలు వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ జాబితాలో చోటు దక్కించుకున్న ఇషాన్ కిషన్‌పై కన్నేశాయి. అహ్మదాబాద్, లక్నో జట్టు యజమాన్యం ఇప్పటికే ఇషాన్‌తో మంచి టచ్‌లొ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ఎడమచేతి వాటం బ్యాట్స్‌మన్ వేలంలోకి రావాలని నిర్ణయించుకున్నాడు.

Also Read: Virat Kohli: విరాట్ కోహ్లీ ఔటైన తీరుపై మాజీల పెదవి విరుపు.. వైఫల్యానికి అదే కారణమంటూ వ్యాఖ్యలు..

IND vs WI: అది చివరి ఎంపిక కావాలి.. ఆ నిర్ణయంపై సునీల్ గవాస్కర్ అసంతృప్తి..