AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2021: కోహ్లీసేనకు గట్టి ఎదురుదెబ్బ.. రాయల్ ఛాలెంజర్స్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.!

IPL 2021: ఐపీఎల్ 2021 సీజన్ ఆరంభానికి ముందే కరోనా టోర్నమెంట్‌పై ప్రభావం చూపుతోంది. ఇప్పటికే పలువురు ఆటగాళ్లకు కరోనా పాజిటివ్ నిర్ధారణ కాగా..

IPL 2021: కోహ్లీసేనకు గట్టి ఎదురుదెబ్బ.. రాయల్ ఛాలెంజర్స్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.!
Rcb
Ravi Kiran
|

Updated on: Apr 07, 2021 | 2:11 PM

Share

IPL 2021: ఐపీఎల్ 2021 సీజన్ ఆరంభానికి ముందే కరోనా టోర్నమెంట్‌పై ప్రభావం చూపుతోంది. ఇప్పటికే పలువురు ఆటగాళ్లకు కరోనా పాజిటివ్ నిర్ధారణ కాగా.. ఇదే కోవలో తాజాగా మరో ప్లేయర్ వైరస్ బారిన పడ్డాడు. బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ ఆటగాడు డేనియల్ సామ్స్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆర్సీబీ ట్విట్టర్ వేదికగా ప్రకటించింది. ప్రస్తుతం సామ్స్ ఐసోలేషన్‌లో ఉన్నాడని పేర్కొంది.

ఆస్ట్రేలియా ఆటగాడు డానియల్ సామ్స్ ఏప్రిల్ 3న కరోనా నెగటివ్ రిపోర్టుతో ఆర్సీబీ శిబిరానికి చేరుకున్నాడు. తాజాగా అతడికి రెండోసారి కరోనా పరీక్షలు నిర్వహించగా.. పాజిటివ్ తేలింది. వెంటనే బీసీసీఐ కోవిడ్ నిబంధనల ప్రకారం సామ్స్‌ను ఐసోలేషన్‌కు పంపించాం. ప్రస్తుతం అతడికి ఎలాంటి లక్షణాలు లేవని.. నిరంతరం వైద్యులు పర్యవేక్షిస్తున్నారని ఆర్సీబీ ట్వీట్ చేసింది. కాగా, సామ్స్ కంటే ముందు ఆర్సీబీ ఓపెనర్ దేవ్‌దత్ పడిక్కల్‌ కరోనా బారినపడ్డాడు. ఆ తర్వాత కోలుకున్నాడు. ఇక అటు ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు అక్షర్ పటేల్, కేకేఅర్ ప్లేయర్ నితీష్ రానా, ముంబై ఇండియన్స్ సలహాదారు కిరణ్ మోర్ కూడా కరోనా బారిన పడి కోలుకున్న సంగతి తెలిసిందే.

Also Read:

‘జగనన్న స్మార్ట్‌ టౌన్‌’.. దరఖాస్తు చేసుకోండిలా.. అర్హతలు ఇవే.!

ఈ ఫోటోలోని ఇద్దరు హీరోయిన్స్‌ను గుర్తు పట్టారా.? సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న పిక్.!

ఇంటి గుమ్మంలో తిష్టవేసిన సింహాలు.. డోర్ తీసి కంగుతిన్న యజమాని.. కట్ చేస్తే ఊహించని సంఘటన.!