Team India: టీమిండియా ఆటగాళ్ళు ఇష్టపడినా ఈ ఆట ఆడలేరు.. నిషేధించిన బీసీసీఐ.. ఎందుకంటే?

Indian Cricket Team Players: భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాట్స్‌మన్ రింకు సింగ్ రాజ్ షమానీ పాడ్‌కాస్ట్‌లో అనేక ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. బీసీసీఐ ఒప్పందం గురించి రింకు సింగ్ కూడా ఒక ఆసక్తికరమైన విషయాన్ని చెప్పారు. ఆ వార్త ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

Team India: టీమిండియా ఆటగాళ్ళు ఇష్టపడినా ఈ ఆట ఆడలేరు.. నిషేధించిన బీసీసీఐ.. ఎందుకంటే?
Team India

Updated on: Sep 10, 2025 | 5:48 PM

Indian Cricket Team Players: భారత క్రికెట్ జట్టు విధ్వంసక బ్యాట్స్‌మన్ రింకు సింగ్ ఆసియా కప్‌లో కనిపించబోతున్నాడు. కానీ, మైదానంలోకి దిగడానికి ముందే అతను అద్భుతమైన ఫోర్లు, సిక్సర్లతో దంచి పడేశాడు. నిజానికి, రింకు సింగ్ రాజ్ షమానీతో పాడ్‌కాస్ట్‌లో చాలా ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చాడు. వాటిలో ఒకటి బీసీసీఐ ఒప్పందం. రింకు సింగ్ రాజ్ షమానీతో మాట్లాడుతూ ఎత్తు, నీరు, దయ్యాలు వంటి అనేక విషయాలకు భయపడతానని చెప్పుకొచ్చాడు. విమానంలో ప్రయాణించేటప్పుడు కూడా భయపడతానంటూ చెప్పుకొచ్చాడు. ఈ సంభాషణలో, ఆటగాళ్లు పాల్గొనకుండా బీసీసీఐ నిషేధిస్తుందని తెలిపాడు. అది వారి ఒప్పందంలోనూ ఉంది.

భారత ఆటగాళ్ళు ఈ ఆట ఆడాలని అనుకున్నా నో ఛాన్స్..

టీమిండియా ఆటగాళ్లపై డబ్బుల వర్షం కురుస్తోంది. కానీ, భారత ఆటగాళ్లు తమ ఇష్టానుసారం కొన్ని ఆటలను ఆడలేరు. భారతీయ ఆటగాళ్లు అడ్వెంచర్ గేమ్‌లలో పాల్గొనకుండా బీసీసీఐ నిషేధించింది. రింకు సింగ్ మాట్లాడుతూ, ‘నేను ఎప్పుడూ స్కై డైవింగ్ చేయలేదు. నాకు ఎత్తులంటే భయం. బీసీసీఐ కూడా దానిని నిషేధించింది. స్కై డైవింగ్ చేయకూడదని బీసీసీఐ ఒప్పందంలో రాసింది. ఎందుకంటే, గాయపడే వచ్చు’ అని తెలిపింది. అయితే, ఈ నియమం విదేశీ పర్యటనల కోసమేనా లేదా ఆటగాళ్ళు తమ సెలవుల్లో కూడా ఇలా చేయకూడదా అని రింకు సింగ్ స్పష్టం చేయలేదు.

విమానాల్లో ప్రయాణిస్తున్నప్పుడు భయం..

రింకు సింగ్ తనకు నీరు, విమానాలంటే కూడా చాలా భయం అని పాడ్‌కాస్ట్‌లో వెల్లడించాడు. రింకు మాట్లాడుతూ, ‘నేను 2023లో మాల్దీవులకు వెళ్లాను. అక్కడ స్కూబా డైవింగ్ చేస్తున్నప్పుడు నేను భయపడ్డాను. నేను కిందకు వెళ్లలేకపోయాను. నా స్నేహితులు నీటిలోకి వెళ్లారు. వారు సముద్ర ప్రపంచాన్ని చూశారు. కానీ, నేను దానిని చూడలేకపోయాను, నేను అక్కడ ఈత కొడుతూనే ఉన్నాను. చిన్న చేపలను చూశాను. నాకు సొరచేపలంటే భయం, అన్ని వైపుల నుంచి సొరచేపలు వచ్చినట్లు అనిపిస్తుంది. క్రికెట్ కాకుండా ఇతర విషయాలంటే నాకు చాలా భయం’ అంటూ చెప్పుకొచ్చాడు.

ఇవి కూడా చదవండి

రింకు సింగ్ ఇంకా మాట్లాడుతూ, ‘నాకు విమానాలంటే చాలా భయం. నేను 2018లో హైదరాబాద్ వెళ్తున్నాను. విమానం 5-6 సెకన్ల పాటు కిందపడిపోయింది. విమానంలో నేను మమ్మీ-మమ్మీ అని అరుస్తున్నాను. విమానం కొద్దిగా వణుకుతుంటే, నాకు చెమటలు పడటం ప్రారంభిస్తాయి. అంతర్జాతీయ విమానాలలో నాకు అది అర్థం కాలేదు. ఒకసారి మేం దులీప్ ట్రోఫీ ఆడిన తర్వాత బెంగళూరు నుంచి ఢిల్లీకి వస్తుండగా విమానం అకస్మాత్తుగా చాలా ఎత్తుకు ఎగిరింది. మేం విమానం పైకప్పును ఢీకొట్టాం. విమానం టేకాఫ్ అయి ఎలాగైనా ల్యాండ్ కావాలని నేను కోరుకున్నాను’ అంటూ చెప్పుకొచ్చాడు.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Follow Us