AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs ENG: గిల్ కెప్టెన్సీ, గంభీర్ మ్యాజిక్.. ఎడ్జ్‌బాస్టన్‌లో భారత్ చారిత్రాత్మక విజయం వెనుక 3 కారణాలివే !

ఎడ్జ్‌బాస్టన్‌లో 58 ఏళ్ల తర్వాత భారత్ చారిత్రాత్మక విజయం సాధించడం వెనుక కెప్టెన్ శుభమన్ గిల్ కెప్టెన్సీ, కోచ్ గౌతమ్ గంభీర్ వ్యూహాలు, సరైన ప్లేయింగ్ ఎలెవన్ సెలక్షణ్, ఆకాష్ దీప్ సిరాజ్ బౌలింగ్, గిల్ అద్భుత బ్యాటింగ్ వంటి 3 ప్రధాన కారణాలు ఉన్నాయి.

IND vs ENG: గిల్ కెప్టెన్సీ, గంభీర్ మ్యాజిక్.. ఎడ్జ్‌బాస్టన్‌లో భారత్ చారిత్రాత్మక విజయం వెనుక 3 కారణాలివే !
Gautam Gambhir
Rakesh
|

Updated on: Jul 07, 2025 | 7:35 PM

Share

IND vs ENG: భారత జట్టు ఇంగ్లాండ్‌ను రెండో టెస్టులో 336 పరుగుల భారీ తేడాతో ఓడించి ఎడ్జ్‌బాస్టన్‌లో ఒక చారిత్రాత్మక విజయాన్ని సాధించింది. 58 ఏళ్లలో మొదటిసారిగా భారత జట్టు ఈ మైదానంలో టెస్ట్ మ్యాచ్ గెలిచింది. టీమిండియా ఇంగ్లాండ్ ముందు నాలుగో ఇన్నింగ్స్‌లో 608 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. దీనికి బదులుగా ఇంగ్లాండ్ కేవలం 271 పరుగులకే ఆలౌట్ అయ్యింది. భారత జట్టు ఈ చారిత్రాత్మక విజయంలో కెప్టెన్ శుభమన్ గిల్, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కీలక పాత్ర పోషించారు.

ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో భారత్ గెలుపుకు 3 ప్రధాన కారణాలు:

సరైన ఆటగాళ్ళ ఎంపిక : కెప్టెన్ శుభమన్ గిల్, కోచ్ గౌతమ్ గంభీర్ రెండో టెస్టు కోసం బెస్ట్ ప్లేయింగ్ ఎలెవన్‌ను సెలక్ట్ చేశారు. జస్ప్రీత్ బుమ్రా లేనప్పటికీ కెప్టెన్, కోచ్ ఆకాష్ దీప్‌ను ఒక అద్భుతమైన బౌలర్‌గా జట్టులో చేర్చారు. అలాగే, సాయి సుదర్శన్‌కు బదులుగా వాషింగ్టన్ సుందర్‌కు అవకాశం ఇచ్చారు. ఇది టీమిండియాకు బాగా కలిసొచ్చింది.

ఆకాష్ దీప్, సిరాజ్ బౌలింగ్: భారత్ ఈ చారిత్రాత్మక విజయంలో ఫాస్ట్ బౌలర్లు ఆకాష్ దీప్, మహ్మద్ సిరాజ్‌లది చాలా పెద్ద పాత్ర. ఎడ్జ్‌బాస్టన్‌లోని ఈ బ్యాటింగ్‌కు అనుకూలమైన పిచ్‌పై కూడా సిరాజ్, ఆకాష్ అద్భుతమైన బౌలింగ్ చేశారు. సిరాజ్ మొదటి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీశాడు. సిరాజ్ మొత్తం 6 వికెట్లు పడగొట్టాడు. అదే సమయంలో ఆకాష్ మొదటి ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు తీశాడు. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్‌లో ఆకాష్ మళ్ళీ 6 వికెట్లు తీయగా, సిరాజ్‌కు ఒక వికెట్ లభించింది.

గిల్ అద్భుతమైన బ్యాటింగ్: భారత జట్టు విజయం సాధించడానికి కెప్టెన్ గిల్ తన బ్యాటింగ్‌తో బలమైన పునాది వేశాడు. టాస్ ఓడిపోయిన తర్వాత మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు మొదటి ఇన్నింగ్స్‌లో 587 పరుగులు చేసింది. గిల్ మొదటి ఇన్నింగ్స్‌లో అద్భుతమైన డబుల్ సెంచరీ (269 పరుగులు) సాధించాడు. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్‌లో కూడా గిల్ సెంచరీ (161 పరుగులు) బాది జట్టును పటిష్టమైన స్థితికి చేర్చాడు. గిల్ ఈ అద్భుతమైన ఇన్నింగ్స్‌ల కారణంగా భారత్ ఇంగ్లాండ్ ముందు 608 భారీ టార్గెట్ ఉంచగలిగింది.

మరిన్ని క్రికెట్ న్యూస్ కోసం ఇక్కడ చేయండి..