
ఐర్లాండ్తో జరిగిన తొలి టీ20 మ్యాచ్లో టీమిండియా ఓటమి పాలైంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఈ రిజల్ట్తో క్రికెట్ అభిమానులంతా చాలా నిరాశ చెందారు. అయితే మ్యాచ్ కంటే ముందే ఓ విషయంపై మరింత డిజప్పాయింట్ అయ్యారు. అదేంటంటే.. వైభవ్ సూర్యవంశీ మ్యాచ్ ఆడటం లేదని తెలిసి.. చాలా మంది మ్యాచ్ కూడా చూడలేదు. పైగా టీమిండియా ఓడిపోయింది. మ్యాచ్ ఫలితం సంగతి పక్కనపెడితే.. వైభవ్ సూర్యవంశీకి సంబంధించిన మరో విషయం వైరల్గా మారింది. అదేంటంటే.. మ్యాచ్ ఆరంభానికి ముందు ఇరుజట్లు తమ తమ జాతీయ గీతాలను గ్రౌండ్లో ఆలపించాయి.
జాతీయ గీతాలపన కోసం గ్రౌండ్లోకి వచ్చే ముందు ప్రతి ప్లేయర్ చిన్న పిల్లలతో ఎంట్రీ ఇచ్చారు. నేషనల్ యాంథమ్ ఆలపించే టైమ్లో ఆ పిల్లలు ఆటగాళ్ల ముందు నిల్చున్నారు. కానీ వైభవ్ సూర్యవంశీ ముందు మాత్రం ఎవరు లేరు. దీనికి సంబంధించిన ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాను ఊపేస్తుంది. వైభవ్ ముందు ఎందుకు పిల్లాడు కానీ, చిన్న పాప గానీ నిల్చోలేదు అని సోషల్ మీడియా వేదికగా చాలా మంది ప్రశ్నిస్తున్నారు. అందుకే కారణం ఏమై ఉంటుందని కూడా తెగ సెర్చ్ చేస్తున్నారు. అయితే అందుకు ప్రత్యేక కారణం ఏమీ లేదని తెలుస్తోంది. కాగా, కొంతమంది నెటిజన్లు అతనే చిన్న పిల్లాడు.. మళ్లీ అతనికి ఎందుకు పిల్లాడు అంటూ సరదాగా కామెంట్ చేస్తున్నారు.
క్రికెట్లో మ్యాచ్కు ముందు జాతీయ గీతాల సమయంలో ఆటగాళ్లు ఒక్కో చిన్నారితో కలిసి మైదానంలోకి రావడం వెనుక పలు కారణాలు ఉన్నాయి. దీనిని ప్లేయర్ ఎస్కార్ట్ లేదా చైల్డ్ మస్కట్ కార్యక్రమం అని పిలుస్తారు.
మరిన్ని ఆసక్తికర క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి