
ఐర్లాండ్తో జరుగుతున్న చివరిదైన రెండో టీ20లో టీమిండియాకు ఊహించని షాక్ తగిలింది. ఈ మ్యాచ్లో కూడా టీమిండియా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ టాస్ గెలిచి, తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. మరోసారి ఐర్లాండ్ మంచి ఫైటింగ్ టార్గెట్ ఇచ్చింది. ఇక ఛేజింగ్కు దిగిన భారత్ ఓపెనర్లు ఇద్దరూ కూడా గోల్డెన్ డక్గా వెనుదిరిగారు. అది కూడా తొలి ఓవర్లోనే వికెట్లు సమర్పించుకున్నారు.
ఐర్లాండ్ బౌలర్ జై మూంద్రా వేసిన తొలి ఓవర్ తొలి బంతికే ఓపెనర్ సంజూ శాంసన్ ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. అదే ఓవర్ నాలుగో బంతికి మరో ఓపెనర్ అభిషేక్ శర్మ కూడా గోల్డెన్ డక్ అయ్యాడు. మూంద్రా బౌలింగ్లో మాట్ హోలార్డ్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఆ వెంటనే కెప్టెన్ అయ్యర్ సైతం 10 బంతుల్లో 7 పరుగులు చేసి మూంద్రా బౌలింగ్లోనే క్లీన్ బౌల్డ్ అయ్యాడు. మొత్తంగా టీమిండియా కీలకమైన మూడు వికెట్లు కోల్పోయి తడబడుతోంది. అంతకుముందు ఐర్లాండ్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. కాగా, ఓపెనర్లు ఇద్దరు గోల్డెన్ డక్ అవ్వడంతో వీళ్లకి వైభవ్ సూర్యవంశీ ఉసురు తగిలిందని నెటిజన్లు సరదాగా సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు. ఆడిస్తామని ఐర్లాండ్ వరకు తీసుకెళ్లి, ఒక మ్యాచ్ ఆడించకుండా పాపం పిల్లాడికి ఆశ పెట్టి నిరాశ చెందేలా చేశారని అందుకే ఇలా జరుగుతుందంటూ కొంతమంది నెటిజన్లు మీమ్స్ వైరల్ చేస్తున్నారు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి