India vs England 2nd Test:ఇంగ్లండ్తో చెపాక్ స్టేడియంలో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా పటిష్ట స్థితిలో నిలిచింది. 286 పరుగులతో రెండో ఇన్నింగ్స్ను ముగించిన కోహ్లి సేన, పర్యాటక జట్టు కంటే 481 పరుగుల ఆధిక్యంలో ఉంది. కాగా తొలి ఇన్నింగ్స్లో 329 పరుగులు చేసిన భారత జట్టు.. స్పిన్నర్ల మాయాజాలంతో రెండో రోజు ఆటలో ఇంగ్లండ్ను 134 పరుగులకే కట్టడిచేసిన సంగతి తెలిసిందే. అయితే, రెండో ఇన్నింగ్స్ బ్యాటింగ్ చేపట్టిన టీమిండియాకు ఆదిలోనే షాక్ తగిలినా అశ్విన్ సెంచరీ(106), కెప్టెన్ కోహ్లి అర్ధసెంచరీ(62)తో 286 పరుగులు చేయగలిగింది. సిరాజ్ 21 బంతుల్లో రెండు సిక్సర్ల సాయంతో 16 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో లీచ్, అలీ చెరో నాలుగు వికెట్లు తీశారు.
ఇంట్రెస్టింగ్ అప్డేట్.. మెడికల్ ఆఫీసర్గా మెగా హీరో.. పాన్ ఇండియా ప్రాజెక్టులో మరో స్టార్ హీరోలు..