AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

India vs England : చెన్నై చెపక్ స్టేడియంలో టీమిండియా ముందు భారీ టార్గెట్.. ఆ ఇద్దరి మీదే ఫోకస్..

చెన్నై చెపక్ స్టేడియంలో జరుగుతున్న తొలి టెస్టులో మూడవ రోజు ఇంగ్లాండ్ 578 పరుగుల వద్ద ఆలౌట్ అయ్యింది. ఓవర్‌నైట్‌ స్కోరు 555/8తో ఆదివారం తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన...

India vs England : చెన్నై చెపక్ స్టేడియంలో టీమిండియా ముందు భారీ టార్గెట్.. ఆ ఇద్దరి మీదే ఫోకస్..
England dismissed for 578
Sanjay Kasula
|

Updated on: Feb 07, 2021 | 10:28 PM

Share

India vs England : చెన్నై చెపక్ స్టేడియంలో జరుగుతున్న తొలి టెస్టులో మూడవ రోజు ఇంగ్లాండ్ 578 పరుగుల వద్ద ఆలౌట్ అయ్యింది. ఓవర్‌నైట్‌ స్కోరు 555/8తో ఆదివారం తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన ఇంగ్లండ్ మిగిలిన రెండు వికెట్స్‌కి త్వరగానే కోల్పోయింది. బెస్ 34 ప‌రుగులకు బుమ్రా బౌలింగ్‌లో వెనుదిర‌గ‌గా, అండ‌ర్స‌న్‌(1) అశ్విన్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. దీంతో ఇంగ్లాండ్ టీమ్ 578 ప‌రుగుల‌ టార్గెట్‌ను కోహ్లీ సేన ముందుంచింది. భార‌త బౌల‌ర్స్‌లో అశ్విన్, బుమ్రా 3 వికెట్స్ తీయ‌గా, న‌దీమ్, ఇషాంత్ శ‌ర్మ చెరి రెండు వికెట్స్ తీసారు.

వందో టెస్ట్ ఆడిన కెప్టెన్ జో రూట్ అద్భుత రీతిలో ఆడి డ‌బుల్ సెంచ‌రీ పూర్తి చేసుకున్నాడు. దీంతో ఆ జట్టు భారీ స్కోరును సాధించింది. క్లిష్టమైన క్యాచ్‌లను అశ్విన్‌, పుజారా, రోహ‌త్ శ‌ర్మ వ‌దిలేయ‌డంతో భార‌త్ అందుకు త‌గ్గ మూల్యం చెల్లించుకుంది. తొలి టెస్ట్ మ్యాచ్‌లో మ‌రో మూడు రోజులు మిగిలి ఉండ‌గా, భార‌త జ‌ట్టు ఇంగ్లండ్ టీం విజ‌యాన్ని ఎలా అడ్డుకుంటుందో చూడాలి.

ఓవర్‌నైట్ వ్యక్తిగత స్కోరు 128తో రెండోరోజు బ్యాటింగ్ కొనసాగించిన కెప్టెన్ జో రూట్ (218: 377 బంతుల్లో 19×4, 2×6) అదే పట్టుదలతో డబుల్ సెంచరీతో దుమ్మురేపాడు. బెన్‌స్టోక్స్ (82: 118 బంతుల్లో 10×4, 3×6) కూడా మంచి ప్రదర్శన చేశాడు. దాంతో.. తొలి సెషన్‌తో పాటు.. రెండో సెషన్‌లోనూ భారత బౌలర్ల శ్రమకు ఫలితం దక్కలేదు. కానీ.. బెన్‌స్టోక్స్ పెవిలియన్‌కు చేరిన తర్వాత పుంజుకున్న ఇండియా.. ఓలీ పోప్ (30), జోస్ బట్లర్ (28), జోప్రా ఆర్చర్ (0)లను ఎక్కువ స్కోరు చేయకుండానే వెనక్కి పంపించింది. వాస్తవానికి బెస్ కూడా శనివారమే ఔటవ్వాల్సింది. వాషింగ్టన్ సుందర్ బౌలింగ్‌లో హిట్ మ్యాన్‌ రోహిత్ శర్మకు బెస్ చాలా ఈజీ క్యాచ్ ఇచ్చాడు. కానీ.. రోహిత్ దాన్ని జారవిడిచాడు. మరి మూడో రోజు ఎవరు ఆదిపత్యం ప్రదర్శిస్తారో వేచి చూడాలి.

ఇవి కూడా చదవండి :

India vs England : కోహ్లీ సేనకు ఆదిలోనే ఎదురుదెబ్బ.. లంచ్‌ విరామానికి టీమిండియా స్కోర్‌ 59/2 Corona Cases Telangana : తెలంగాణ కరోనా బులిటెన్.. కొత్తగా నమోదైన పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య ఎంతంటే..!