IND VS SA: భారత ఆటగాళ్ల భద్రతకు దక్షిణాఫ్రికా హామీ.. పర్యటనకు బీసీసీఐ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుందా?

| Edited By: Ravi Kiran

Nov 30, 2021 | 5:02 PM

భారత క్రికెట్ జట్టు డిసెంబర్‌లో దక్షిణాఫ్రికా పర్యటనకు (IND VS SA) వెళ్లనుంది. అక్కడ 3 టెస్టులు, 3 వన్డేలు, 4 టీ20 మ్యాచ్‌ల సిరీస్‌ను ఆడనుంది.

IND VS SA: భారత ఆటగాళ్ల భద్రతకు దక్షిణాఫ్రికా హామీ.. పర్యటనకు బీసీసీఐ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుందా?
Ind Vs Sa 2021 22
Follow us on

IND vs SA: ఓవైపు దక్షిణాఫ్రికాలో ఒమిక్రాన్ గడగడలాడిస్తోంది. ఈ కొత్త కరోనా వేరియంట్‌తో ప్రపంచ దేశాలు భయపడుతున్నాయి. ఇప్పటికే క్రీడా ప్రపంచంలో కొన్ని ఈవెంట్లు వాయిదా వేశారు. ఇలాంటి సమయంలో భారత జట్టు దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్తుందా.. లేదా.. అనే ప్రశ్న ప్రతి క్రీడా ప్రేమికుడి మదిలో మెదులుతోంది. వాస్తవానికి, కరోనా ఓమిక్రాన్ వేరియంట్ దక్షిణాఫ్రికాలో వేగంగా వ్యాప్తి చెందుతోంది. దీంతో భారత జట్టు దక్షిణాఫ్రికా పర్యటనకు ముప్పు ఏర్పడుతోంది. అయితే, టీమిండియాను సురక్షితంగా ఉంచేందుకు దక్షిణాఫ్రికా ప్రభుత్వం పూర్తి హామీనిచ్చింది. దక్షిణాఫ్రికా విదేశాంగ మంత్రిత్వ శాఖ భారత క్రికెట్ జట్టుకు పూర్తి జీవ-సురక్షిత వాతావరణాన్ని (బయో-బబుల్) సృష్టించనున్నట్లు తెలిపింది. కోవిడ్ -19 కొత్త వేరియంట్‌ను పొందినప్పటికీ, భారత ఏ జట్టు పర్యటన నుంచి వైదొలగనందుకు బీసీసీఐని మంత్రిత్వ శాఖ ప్రశంసించింది.

మంగళవారం నుంచి బ్లూమ్‌ఫోంటైన్‌లో దక్షిణాఫ్రికా ఏతో భారత్ ఏ రెండో అనధికారిక టెస్టు ఆడుతుంది. కొత్త Omicron వేరియంట్ కారణంగా ప్రపంచవ్యాప్త ఆందోళనలు ఉన్నప్పటికీ దక్షిణాఫ్రికాలో సిరీస్‌ను కొనసాగించాలని భారత బోర్డు నిర్ణయించింది. భారత సీనియర్ జట్టు డిసెంబర్ 17 నుంచి దక్షిణాఫ్రికాలో మూడు టెస్టులు, ఆ తర్వాత 3 వన్డేలు, 4 టీ20లు ఆడనుంది.

భారత ఆటగాళ్ల భద్రతకు దక్షిణాఫ్రికా హామీ..
విరాట్ కోహ్లీ బృందం డిసెంబర్ 9న దక్షిణాఫ్రికాకు చేరుకుంటారు. అయితే దేశంలో కోవిడ్ ఓమిక్రాన్ వేరియంట్‌‌ తర్వాత పర్యటన గురించి కొన్ని ఆందోళనలు ఉన్నాయి. ఈ కొత్త వేరియంట్‌ను ప్రవేశపెట్టిన తర్వాత, చాలా దేశాలు ప్రయాణ ఆంక్షలు విధించాయి. దేశ విదేశాంగ మంత్రిత్వ శాఖ అయిన అంతర్జాతీయ సంబంధాలు, సహకార విభాగం (డర్కో) మాట్లాడుతూ, “భారత జట్టు ఆరోగ్యం, భద్రతను నిర్ధారించడానికి దక్షిణాఫ్రికా అవసరమైన అన్ని ముందు జాగ్రత్త చర్యలను తీసుకుంటుంది” అని తెలిపింది. దక్షిణాఫ్రికా వర్సెస్ ఇండియా ఏ జట్టుతో పాటు, జాతీయ జట్టు రెండింటికీ పూర్తిగా బయో-సురక్షిత వాతావరణం సృష్టించామని పేర్కొంది.

బీసీసీఐని మెచ్చుకున్న దక్షిణాఫ్రికా..
టూర్‌ను కొనసాగించినందుకు బీసీసీఐని దక్షిణాఫ్రికా ప్రభుత్వం అభినందిస్తోందని మంత్రిత్వ శాఖ తెలిపింది. భారత్-దక్షిణాఫ్రికా మధ్య తొలి టెస్టు జోహన్నెస్‌బర్గ్‌లో జరగనుండగా, రెండో టెస్టు డిసెంబర్ 26 నుంచి సెంచూరియన్‌లో జరగనుంది. మూడో మ్యాచ్‌ జనవరి 3 నుంచి కేప్‌టౌన్‌లో జరగనుంది. “భారత జాతీయ జట్టు పర్యటన దక్షిణాఫ్రికా అంతర్జాతీయ క్రికెట్‌కు తిరిగి వచ్చి 30 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రత్యేకంగా ఉండనుందని” మంత్రిత్వ శాఖ తెలిపింది. దక్షిణాఫ్రికా ప్రభుత్వం వర్ణవివక్ష విధానాల కారణంగా 1970లో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) ద్వారా దక్షిణాఫ్రికా జట్టు అంతర్జాతీయ క్రికెట్ నుంచి నిషేధించిన తర్వాత, 1991లో ఆ దేశ అంతర్జాతీయ జట్టుకు ఆతిథ్యమిచ్చిన మొదటి దేశంగా భారతదేశం అవతరించింది. “జనవరి 2, 2022 న కేప్ టౌన్‌లో జరిగే ఒక సన్మాన కార్యక్రమంతో వార్షికోత్సవాన్ని జరుపుతామని” మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ఈవెంట్ దక్షిణాఫ్రికా, భారతదేశం మధ్య బలమైన సంబంధాన్ని కూడా ప్రదర్శిస్తుందని, ఇది రెండు భారత జట్ల పర్యటనల ద్వారా మరోసారి నిరూపితమైందని పేర్కొంది.

Also Read: IPL 2022: ఎంతమందిని రిటైన్ చేసుకోవచ్చు.. ఆటగాళ్లకు ఎంత డబ్బు దక్కనుంది.. ఐపీఎల్ 2022 రిటెన్షన్ రూల్స్ ఎలా ఉన్నాయంటే?

IPL 2022 Mega Auction: ఇదే చివరి మెగా వేలం.. ఐదేళ్ల తరువాత నిర్వహణ.. మరోసారి ఉండదంటోన్న నివేదికలు.. ఎందుకంటే?