AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs SA: ఈసారి ట్రోఫీ రోహిత్ సేనదే.. ఇక అడ్డుకోవడం ఎవరి వల్ల కాదంటోన్న ఫ్యాన్స్.. కారణమేంటో తెలుసా?

Rohit Sharma Stands Right Side During the Photoshoot With T20 World Cup Trophy: ఈసారి టీ20 ప్రపంచ కప్ తొమ్మిదో ఎడిషన్ చివరి మ్యాచ్‌లో టీమిండియా వర్సెస్ దక్షిణాఫ్రికా (IND vs SA) జట్లు ఒకదానితో ఒకటి తలపడతాయి. మెగా మ్యాచ్‌కు ముందు, ఐడెన్ మార్క్‌రామ్, రోహిత్ శర్మ ధగధగా మెరుస్తున్న ట్రోఫీతో ఫొటోషూట్ చేశారు.

IND vs SA: ఈసారి ట్రోఫీ రోహిత్ సేనదే.. ఇక అడ్డుకోవడం ఎవరి వల్ల కాదంటోన్న ఫ్యాన్స్.. కారణమేంటో తెలుసా?
Ind Vs Sa Trophy
Venkata Chari
|

Updated on: Jun 29, 2024 | 12:26 PM

Share

Rohit Sharma Stands Right Side During the Photoshoot With T20 World Cup Trophy: ఈసారి టీ20 ప్రపంచ కప్ తొమ్మిదో ఎడిషన్ చివరి మ్యాచ్‌లో టీమిండియా వర్సెస్ దక్షిణాఫ్రికా (IND vs SA) జట్లు ఒకదానితో ఒకటి తలపడతాయి. మెగా మ్యాచ్‌కు ముందు, ఐడెన్ మార్క్‌రామ్, రోహిత్ శర్మ ధగధగా మెరుస్తున్న ట్రోఫీతో ఫొటోషూట్ చేశారు. ఫొటోషూట్ బయటకు రావడంతో, భారతీయ అభిమానులు సంతోషిస్తున్నారు. ఈసారి రోహిత్ సరైన స్థానంలో నిలిచాడని వారు అంటున్నారు. ఈసారి రోహిత్ శర్మ ట్రోఫీ గెలవడం ఖాయమని పలువురు అభిమానులు పేర్కొంటున్నారు.

ఫొటోషూట్ సమయంలో కుడి వైపున నిల్చున్న రోహిత్ శర్మ..

రోహిత్ శర్మ కెప్టెన్సీలో, భారత జట్టు ఇప్పటికే ICC వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (2023) ఫైనల్‌ను, 2023 ప్రపంచ కప్‌లో ఫైనల్‌ను ఆడింది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్‌కు ముందు ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ రోహిత్ శర్మతో కలిసి ఫోటోషూట్‌లో పాల్గొన్నాడు. ఆ సమయంలో ట్రోఫీకి ఎడమవైపు రోహిత్‌, కుడివైపు కమిన్స్‌ నిలబడ్డారు. ఆ తర్వాత ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 209 పరుగుల తేడాతో భారత్‌ను ఓడించి టైటిల్‌ను కైవసం చేసుకుంది.

అదే సమయంలో, 2023 ప్రపంచ కప్ ఫోటోషూట్ సమయంలో, రోహిత్ ట్రోఫీకి ఎడమ వైపున నిలబడి, కమిన్స్ కుడి వైపున పోజులిచ్చాడు. ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ జరగగా.. ఆస్ట్రేలియా మరోసారి ట్రోఫీని కైవసం చేసుకుంది.

View this post on Instagram

A post shared by ICC (@icc)

రెండు మ్యాచ్‌ల ఫలితాలను చూసిన తర్వాత, ట్రోఫీకి కుడి వైపున నిలబడిన కెప్టెన్ ఫైనల్ మ్యాచ్‌లో గెలుస్తాడని చాలా మంది అభిమానుల నమ్మకం ఏర్పడింది. ఈసారి టీ20 ప్రపంచ కప్ ట్రోఫీ ఫోటోషూట్ సమయంలో రోహిత్ శర్మ కుడి వైపున నిలబడి కనిపించాడు. అందుకే ఫైనల్‌లో టీమిండియా గెలవాలని అభిమానులు పేర్కొంటున్నారు.

ఇన్‌స్టాగ్రామ్‌లో ఐసీసీ షేర్ చేసిన ఫోటోషూట్ ఫోటోపై అభిమానుల నుంచి ఎన్నో స్పందనలు కనిపిస్తున్నాయి. ఒక అభిమాని.. ‘ఈసారి రోహిత్ కుడి వైపున నిలబడి సరైన పని చేశాడు. ఇప్పుడు మనం ట్రోఫీని గెలవకుండా ఎవరూ ఆపలేరు’ అంటూ చెప్పుకొచ్చారు. మరో వినియోగదారు రోహిత్ భాయ్, కుడి వైపున నిలబడండి అంటూ రాసుకొచ్చాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గోవాకు పిలిచి మరీ నాగ్ వార్నింగ్ ఇచ్చారు
గోవాకు పిలిచి మరీ నాగ్ వార్నింగ్ ఇచ్చారు
ఫోన్లలో వైరస్‌.. OTP అవసరం లేకుండానే మీ ఫోన్లో డబ్బులు మాయం!
ఫోన్లలో వైరస్‌.. OTP అవసరం లేకుండానే మీ ఫోన్లో డబ్బులు మాయం!
ఈ రాష్ట్ర ప్రజలు మద్యం తాగడంలో నంబర్‌ 1.. తెలంగాణ ఏ స్థానంలో..
ఈ రాష్ట్ర ప్రజలు మద్యం తాగడంలో నంబర్‌ 1.. తెలంగాణ ఏ స్థానంలో..
సనత్ జయసూర్య వరల్డ్ రికార్డును బద్దలు కొట్టిన సఫారీ ఓపెనర్
సనత్ జయసూర్య వరల్డ్ రికార్డును బద్దలు కొట్టిన సఫారీ ఓపెనర్
మోదీ పాలనలో అంబేద్కర్ ఆలోచనల ప్రతిధ్వని
మోదీ పాలనలో అంబేద్కర్ ఆలోచనల ప్రతిధ్వని
సైకిల్‌ కంటే నెమ్మదిగా ప్రయాణించే రైలు..! అయినా ఫుల్లు డిమాండ్..
సైకిల్‌ కంటే నెమ్మదిగా ప్రయాణించే రైలు..! అయినా ఫుల్లు డిమాండ్..
పంటి ఎనామిల్‌ను నాశనం చేస్తున్న అలవాటు.. మానకుంటే కష్టమే!
పంటి ఎనామిల్‌ను నాశనం చేస్తున్న అలవాటు.. మానకుంటే కష్టమే!
వైభవ్‎ సూర్యవంశీకి పట్టపగలు చుక్కలు చూపెట్టిన హైదరాబాద్ ప్లేయర్
వైభవ్‎ సూర్యవంశీకి పట్టపగలు చుక్కలు చూపెట్టిన హైదరాబాద్ ప్లేయర్
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..