IND vs PAK: ఏంది.. ఈ రీజన్‌తో బహిష్కరణ చేస్తారా.. వాళ్ల కోసం పాక్ ఇంత దిగజారిపోయిందా..?

IND vs PAK Match Boycott: 2026 ఫిబ్రవరిలో భారతదేశంతోపాటు శ్రీలంకలో ప్రారంభం కానున్న ఐసీసీ టీ20 ప్రపంచ కప్‌నకు ముందు పాకిస్తాన్ మరో వివాదానికి దారితీసింది. ఫిబ్రవరి 15న భారత్‌తో జరిగే మ్యాచ్‌ను బహిష్కరిస్తున్నట్లు పాకిస్తాన్ ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఐసీసీ కఠిన చర్యలకు సిద్ధమైంది.

IND vs PAK: ఏంది.. ఈ రీజన్‌తో బహిష్కరణ చేస్తారా.. వాళ్ల కోసం పాక్ ఇంత దిగజారిపోయిందా..?
Pakistan Cricket

Updated on: Feb 03, 2026 | 4:31 PM

IND vs PAK: ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2026 వచ్చే నెల ఫిబ్రవరి 7న భారత్, శ్రీలంక దేశాల్లో మొదలుకానుంది. దీనికి ముందు, పాకిస్తాన్ ప్రభుత్వం మరో పంచాయితీని తెరపైకి తీసుకొచ్చింది. భారతదేశంతోపాటు శ్రీలంకలో నిర్వహించే టీ20 ప్రపంచ కప్‌లోని అన్ని మ్యాచ్‌లను తమ జట్టు ఆడుతుందని, అయితే ఫిబ్రవరి 15న భారత్‌తో జరిగే మ్యాచ్‌ను బహిష్కరిస్తుందని పాకిస్తాన్ ప్రభుత్వం ప్రకటించింది. దీని ఫలితంగా బంగ్లాదేశ్ తర్వాత పాకిస్థాన్‌పై ఐసీసీ కీలక చర్యలకు సిద్ధమైంది.

పాకిస్తాన్ ప్రభుత్వం ఏం చెప్పింది?

ఫిబ్రవరి 15న శ్రీలంకలోని కొలంబోలో భారత్, పాకిస్తాన్ మధ్య ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2026 మ్యాచ్ జరగాల్సి ఉంది. దీనికి ముందు, పాకిస్తాన్ ప్రభుత్వం తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌లో పోస్ట్ చేసింది. పాకిస్తాన్ ఇస్లామిక్ రిపబ్లిక్ ప్రభుత్వం పాకిస్తాన్ క్రికెట్ జట్టును ఐసీసీ ప్రపంచకప్ 2026లో పాల్గొనడానికి ఆమోదించింది. కానీ పాకిస్తాన్ క్రికెట్ జట్టు ఫిబ్రవరి 15, 2026న భారతదేశంతో జరిగే మ్యాచ్‌లో మైదానంలోకి దిగదు అంటూ చెప్పుకొచ్చింది.

పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఏం సాకు చెప్పిందంటే..?

2026 టీ20 ప్రపంచ కప్‌లో జట్టు ఆడాలా వద్దా అనే దానిపై ప్రభుత్వమే తుది నిర్ణయం తీసుకుంటుందని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ మోహ్సిన్ నఖ్వీ గతంలో పేర్కొన్నారు. ఐసీసీ బంగ్లాదేశ్‌ను ప్రపంచ కప్ నుంచి బహిష్కరించిన తర్వాత నఖ్వీ ఈ ప్రకటన చేశారు.

ఇప్పుడు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తమ ప్రభుత్వం భారత్‌తో మ్యాచ్‌లు ఆడటానికి అనుమతి ఇవ్వడం లేదని సాకుగా చూపింది, మరి ఆ జట్టు ఎలా ఆడగలదు? పాకిస్తాన్ క్రికెట్ బోర్డు భారత్‌తో జరిగే మ్యాచ్‌లలో కూడా ఇలాంటి ప్రవర్తనను కొనసాగిస్తే, రాబోయే ప్రపంచ కప్ నుంచి వారిని ఐసీసీ బహిష్కరించవచ్చు.

పాకిస్తాన్ ఈ డ్రామా ఎందుకు మొదలుపెట్టింది?

బంగ్లాదేశ్‌లో హిందువులపై హింస కారణంగా బంగ్లాదేశ్‌కు చెందిన ముస్తాఫిజుర్ రెహమాన్‌ను ఐపీఎల్ 2026 సీజన్ నుంచి బీసీసీఐ మినహాయించినప్పుడు, బంగ్లాదేశ్ ప్రభుత్వం తన జట్టును భారతదేశానికి పంపబోమని పట్టుబట్టింది. తత్ఫలితంగా ఐసీసీ బంగ్లాదేశ్‌ను ప్రపంచ కప్ నుంచి బహిష్కరించింది. పాకిస్తాన్ దీనిని సహించలేకపోయింది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు మొహ్సిన్ నఖ్వీ బంగ్లాదేశ్‌కు మద్దతుగా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రభుత్వం భారతదేశంతో మ్యాచ్‌లు ఆడటానికి నిరాకరించింది. ఇప్పుడు ఐసీసీ పాకిస్తాన్‌కు తగిన సమాధానం ఇచ్చేందుకు సిద్ధమైంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..