IND vs ENG: భారత్‌కు భారీ ఎదురు దెబ్బ.. ఇంగ్లండ్‌ తో మూడో టెస్టుకు బుమ్రా దూరం.. కారణమిదే

|

Feb 05, 2024 | 9:51 PM

క్రికెట్‌ అభిమానులకు షాక్‌.. విశాఖపట్నంలో ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్టులో 9 వికెట్లు తీసి టీమిండియాను గెలిపించిన వైస్ కెప్టెన్ స్పీడ్‌స్టర్ జస్ప్రీత్ బుమ్రా మూడో టెస్టులో ఆడడం లేదని తెలుస్తోంది. రాజ్‌ కోట్‌ వేదికగా జరిగే ఈ కీలకమైన మ్యాచ్ లో బుమ్రాను దూరం పెట్టినట్లు సమాచారం.

IND vs ENG: భారత్‌కు భారీ ఎదురు దెబ్బ.. ఇంగ్లండ్‌ తో మూడో టెస్టుకు బుమ్రా దూరం.. కారణమిదే
Team India
Follow us on

క్రికెట్‌ అభిమానులకు షాక్‌.. విశాఖపట్నంలో ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్టులో 9 వికెట్లు తీసి టీమిండియాను గెలిపించిన వైస్ కెప్టెన్ స్పీడ్‌స్టర్ జస్ప్రీత్ బుమ్రా మూడో టెస్టులో ఆడడం లేదని తెలుస్తోంది. రాజ్‌ కోట్‌ వేదికగా జరిగే ఈ కీలకమైన మ్యాచ్ లో బుమ్రాను దూరం పెట్టినట్లు సమాచారం. గత కొన్ని రోజులుగా వరుసగా మ్యాచ్‌ లు ఆడుతున్న విశ్రాంతి ఇవ్వాలనే ఉద్దేశంతోనే టీమిండియా మేనేజ్ మెంట్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. స్పిన్నర్లకు అనుకూలించే విశాఖ పిచ్‌పై కూడా తొలి ఇన్నింగ్స్‌లో అత్యధికంగా 6 వికెట్లు తీసి ఇంగ్లండ్ జట్టు వెన్నెముకను బుమ్రా విరిచాడు. ఆ తర్వాత మ్యాచ్ నాలుగో రోజు బుమ్రా మ్యాజిక్ చేసి 3 వికెట్లు పడగొట్టగలిగాడు. ముఖ్యంగా ఇంగ్లండ్ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో జానీ బెయిర్‌స్టోను ఎల్బీడబ్ల్యూగా అవుట్ చేయడం ద్వారా ఇంగ్లండ్ విజయ ఆశలకు బుమ్రా పెద్ద బ్రేక్‌ వేశాడు. ఆపై వికెట్ కీపర్ బ్యాటర్‌ బెన్ ఫాక్స్ వికెట్‌ను పడగొట్టాడు. అనంతరం ఇంగ్లండ్ జట్టు చివరి వికెట్ ను తీసి భారత్‌ గెలుపును ఖరారు చేశాడు.

అయితే ఇప్పుడు సెలక్షన్ కమిటీ, టీమ్ మేనేజ్‌మెంట్ రాజ్‌కోట్‌లో జరిగే మూడో టెస్టు నుంచి బుమ్రాకు విశ్రాంతినివ్వవచ్చని క్రిక్‌బజ్ నివేదించింది. నిజానికి ఇరు జట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల సుదీర్ఘ టెస్టు సిరీస్ జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి మ్యాచ్‌ ఆడినా బుమ్రా ఫిట్‌నెస్‌పై ప్రభావం పడుతుందనే భయం నెలకొంది. కాబట్టి చివరి 2 టెస్టులకు బుమ్రాను మరింత ఫిట్‌ గా ఉంచేందుకు తదుపరి టెస్టు నుంచి విశ్రాంతి కల్పించిందని తెలుస్తోంది. రెండో టెస్టులో బుమ్రా రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి దాదాపు 33 ఓవర్లు బౌలింగ్ చేశాడు. జట్టులోని మిగతా బౌలర్లతో పోలిస్తే బుమ్రా వేసిన ఓవర్ల సంఖ్య పెరిగింది. స్పిన్నర్‌కు అనుకూలమైన పిచ్‌పై జట్టులోని ముగ్గురు స్పిన్నర్లు బుమ్రా కంటే తక్కువ బౌలింగ్ చేశారు. అంతే కాదు, తొలి టెస్టులోనూ బుమ్రా దాదాపు 25 ఓవర్లు బౌలింగ్ చేశాడు. బుమ్రా గైర్హాజరీలో మహ్మద్ సిరాజ్ తదుపరి టెస్టులో టీమ్ ఇండియా లీడింగ్ పేసర్‌గా కనిపించే అవకాశం ఉంది. రెండో టెస్టు నుంచి సిరాజ్‌కు విశ్రాంతి లభించగా, మూడో టెస్టుకు సిరాజ్ జట్టులోకి రావడం ఖాయం. అలాగే ఈ సిరీస్ నుంచి మహ్మద్ షమీ పూర్తిగా దూరమయ్యే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..