India vs Bangladesh, 47th Match, Super 8 Group 1: శనివారం ఆంటిగ్వాలోని నార్త్ సౌండ్లోని సర్ వివియన్ రిచర్డ్స్ స్టేడియంలో జరిగిన టీ20 ప్రపంచ కప్ 2024 సూపర్ 8 మ్యాచ్లో బంగ్లాదేశ్పై హార్దిక్ పాండ్యా ఆలస్యంగా విజృంభించాడు. దీంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 196 పరుగుల బలమైన స్కోర్ను సాధించింది.
పాండ్యా 50 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. దీంతో ఎంఎస్ ధోని పురాతన రికార్డును బద్దలు కొట్టాడు. టీ20 ప్రపంచ కప్ చరిత్రలో ఆరో నంబర్ భారత బ్యాటర్గా వచ్చి అత్యధిక స్కోర్ చేశాడు.
పాండ్యా 27 బంతుల్లో నాలుగు ఫోర్లు, మూడు సిక్సర్లతో భారత్ను 200 పరుగులకు చేరువ చేయడంలో కీలకంగా వ్యవహరించాడు.
ఈ క్రమంలో టీమిండియా మాజీ సారథి ధోనీ చేసిన 45 పరుగులను అధిగమించాడు. ఇది భారత బ్యాటర్ ద్వారా మునుపటి అత్యుత్తమంగా నిలిచింది. డర్బన్లో 2007 ప్రపంచ టీ20 సందర్భంగా దక్షిణాఫ్రికాపై భారత మాజీ కెప్టెన్ ఈ స్కోర్ చేశాడు. ఆ తర్వాత, సురేష్ రైనా స్కోరును సమం చేశాడు. కానీ నేటి వరకు ఎవరూ దీనిని అధిగమించలేదు.
1) హార్దిక్ పాండ్యా – బంగ్లాదేశ్ వర్సెస్ 2024, 27 బంతుల్లో 50 నాటౌట్
2) MS ధోని – 33 బంతుల్లో 45 వర్సెస్ సౌతాఫ్రికా, 2007
3) సురేష్ రైనా – 34 బంతుల్లో 45 వర్సెస్ సౌతాఫ్రికా, 2012.
బంగ్లాదేశ్ (ప్లేయింగ్ XI): తాంజిద్ హసన్, లిట్టన్ దాస్(కీపర్), నజ్ముల్ హొస్సేన్ శాంటో(కెప్టెన్), తౌహిద్ హృదయ్, షకీబ్ అల్ హసన్, మహ్మదుల్లా, జాకర్ అలీ, రిషాద్ హుస్సేన్, మహేదీ హసన్, తంజిమ్ హసన్ సాకిబ్, ముస్తాఫిజుర్ రహ్మాన్.
భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(కెప్టెన్), విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్(కీపర్), సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, అర్ష్దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..