Nitish Kumar Reddy: సెంచరీతో చెలరేగిన తెలుగబ్బాయ్.. కంగారుల బెండ్ తీసిన కావ్యమారన్ కుర్రాడు

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ నాలుగో మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా పునరాగమనం చేస్తోంది. ఆ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 9 వికెట్లకు 354 పరుగులు చేసింది. జట్టు 120 పరుగుల వెనుకబడి ఉంది. నితీష్ రెడ్డి క్రీజులో ఉన్నాడు. టెస్టు కెరీర్‌లో తొలి సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

Nitish Kumar Reddy: సెంచరీతో చెలరేగిన తెలుగబ్బాయ్.. కంగారుల బెండ్ తీసిన కావ్యమారన్ కుర్రాడు
Nitish Kumar Reddy Records

Edited By:

Updated on: Dec 28, 2024 | 7:55 PM

Nitish Kumar Reddy Century: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ నాలుగో మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా పునరాగమనం చేస్తోంది. ఆ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 9 వికెట్లకు 354 పరుగులు చేసింది. జట్టు 120 పరుగుల వెనుకబడి ఉంది. నితీష్ రెడ్డి క్రీజులో ఉన్నాడు. టెస్టు కెరీర్‌లో తొలి సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆస్ట్రేలియా సిరీస్‌లో అరంగేట్రం చేసిన నితీష్ కుమార్ రెడ్డి, ప్రతీ మ్యాచ్‌లోనూ ఆకట్టుకున్నాడు. భారత జట్టుకు అవసరమైన పరుగులు అందిస్తూ, అటు బౌలింగ్‌లోనూ సత్తా చాటుతున్నాడు.

21 ఏళ్ల నితీష్ కుమార్ రెడ్డి 171 బంతుల్లో 9 ఫోర్లు, ఒక సిక్స్‌తో ఈ మైలురాయిని చేరుకున్నాడు. మొత్తంగా బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్ తర్వాత సెంచరీ చేసిన మూడో భారతీయ బ్యాటర్ నితీష్ కుమార్ రెడ్డి నిలిచాడు.

ఇవి కూడా చదవండి

ఎనిమిదో నంబర్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన నితీష్.. ఆస్ట్రేలియాలో సెంచరీ చేసిన తొలి భారతీయుడిగా నిలిచాడు. అంతకుముందు 2008లో అడిలైడ్‌లో అనిల్ కుంబ్లే చేసిన 87 పరుగులే ఇప్పటి వరకు అత్యధిక స్కోర్‌గా నిలిచింది.

ఆస్ట్రేలియాలో భారత్ తరపున అత్యంత సెంచరీలు చేసిన పిన్న వయస్కులు

1) సచిన్ టెండూల్కర్ – 148 నాటౌట్, 18 ఏళ్ల 253 రోజులు, 1992

2) సచిన్ టెండూల్కర్ – 114, 18 ఏళ్ల 283 రోజులు, 1992

3) రిషబ్ పంత్ – 159 నాటౌట్, 21ఏళ్ల 91 రోజులు, 2019

4) నితీష్ కుమార్ రెడ్డి – 103 నాటౌట్**, 21 ఏళ్ల 214 రోజులు, 2024

బాక్సింగ్ డే టెస్టులో సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుడు..

దీంతో బాక్సింగ్ డే టెస్టులో సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుడైన భారత ఆటగాడిగా నితీశ్ కుమార్ రెడ్డి నిలిచాడు. 21 ఏళ్ల 214 రోజుల వయసులో నితీష్ ఈ ఘనత సాధించాడు. అయితే, దీనికి ముందు, కార్ల్ హూపర్ 21 రోజుల 011 రోజుల వయస్సులో బాక్సింగ్ డే టెస్టులో సెంచరీ సాధించాడు.

ఇరు జట్లు..

భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, నితీష్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్.

ఆస్ట్రేలియా: పాట్ కమిన్స్ (కెప్టెన్), ఉస్మాన్ ఖవాజా, సామ్ కాన్‌స్టాన్స్, మార్నస్ లాబుషాగ్నే, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, అలెక్స్ కారీ (వికెట్ కీపర్), మిచెల్ స్టార్క్, నాథన్ లియోన్, స్కాట్ బోలాండ్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us