IND vs AUS: కోల్‌కతా నుంచి బ్రిస్బేన్ వరకు.. ఆస్ట్రేలియాపై టీమిండియా 5 చారిత్రాత్మక టెస్టు విజయాలు ఇవే..

Nagpur Test, Border–Gavaskar Trophy: ఆస్ట్రేలియాపై భారత్ ఎన్నో అద్భుత విజయాలను నమోదు చేసింది. అందులో ఐదు విజయాలు మాత్రం చాలా ప్రత్యేకంగా నిలిచాయి. అవేంటో ఓసారి చూద్దాం..

IND vs AUS: కోల్‌కతా నుంచి బ్రిస్బేన్ వరకు.. ఆస్ట్రేలియాపై టీమిండియా 5 చారిత్రాత్మక టెస్టు విజయాలు ఇవే..
Team India

Updated on: Feb 08, 2023 | 8:35 PM

India vs Australia Nagpur 1st Test: భారత్, ఆస్ట్రేలియా మధ్య టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్‌ గురువారం నుంచి నాగ్‌పూర్‌లో జరగనుంది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఇప్పటివరకు భారత్‌కు మంచి రికార్డు ఉంది. టెస్టు ఫార్మాట్‌లో ఆస్ట్రేలియాను చాలాసార్లు ఓడించింది. అయితే ఇందులో ఐదు మ్యాచ్‌ల విజయం చిరస్మరణీయంగా నిలిచింది. ఇందులో కోల్‌కతా 2001 నుంచి బ్రిస్బేన్ 2021 వరకు ఆడిన మ్యాచ్‌లు ఉన్నాయి.

ఐదు మ్యాచ్‌ల్లో భారత్ విజయం.. లిస్టులో ఐదుగురు హీరోలు..

కోల్‌కతా టెస్ట్, 2001..

ఇవి కూడా చదవండి

స్టీవ్ వా కెప్టెన్సీలో ఆస్ట్రేలియా జట్టు ఆధిపత్యం చెలాయించింది. గ్లెన్ మెక్‌గ్రాత్, షేన్ వార్న్ వంటి ప్రమాదకరమైన బౌలర్‌లను ఆసీస్ కలిగి ఉంది. వీరు ఏ ప్రత్యర్థి జట్టుకైనా చెమటలు పట్టించగలరు. అయితే సౌరవ్ గంగూలీ సారథ్యంలోని భారత జట్టు కూడా తక్కువేమీ కాదు. 2001లో ఆస్ట్రేలియా జట్టు మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ కోసం భారత పర్యటనకు వచ్చింది. ఈ సమయంలో తొలి టెస్టులో 10 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా విజయం సాధించింది. రెండో టెస్టు కోల్‌కతాలో జరిగింది. ఇందులో భారత్ అద్భుతంగా పునరాగమనం చేసి 171 పరుగుల తేడాతో విజయం సాధించింది. భారత్ రెండో ఇన్నింగ్స్‌లో వీవీఎస్ లక్ష్మణ్ 281 పరుగులు చేశాడు.

అడిలైడ్ టెస్ట్, 2003..

2003లో టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లింది. ఈ సందర్భంగా ఇరు జట్ల మధ్య నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ జరిగింది. ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్‌ డ్రా అయింది. ఆ తర్వాత జరిగిన రెండో టెస్టులో భారత్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 556 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 196 పరుగులు చేసింది. దీంతో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 523 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 233 పరుగులు చేసింది. భారత్ తరపున రాహుల్ ద్రవిడ్ తొలి ఇన్నింగ్స్‌లో 233 పరుగులు చేశాడు. లక్ష్మణ్ 148 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు.

బెంగళూరు టెస్ట్, 2017..

2017లో భారత పర్యటనకు వచ్చిన ఆస్ట్రేలియా జట్టు.. ఈ సందర్భంగా రెండో టెస్టు బెంగళూరులో జరిగింది. భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 189 పరుగులకు ఆలౌటైంది. కేఎల్ రాహుల్ తొలి ఇన్నింగ్స్‌లో 90 పరుగులు చేశాడు. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 276 పరుగులు చేసింది. పుజారా 92 పరుగులతో రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా 274 పరుగులకు ఆలౌటైంది. అయితే ఆ తర్వాత ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో అశ్విన్ అద్భుత బౌలింగ్‌తో ఆలౌట్ అయింది. అశ్విన్ 6 వికెట్లు తీయడంతో ఆస్ట్రేలియా జట్టు 112 పరుగులకు ఆలౌట్ అయింది.

మెల్బోర్న్ టెస్ట్, 2020-21..

టెస్టు సిరీస్‌లోని రెండో మ్యాచ్ 2020 డిసెంబర్‌లో మెల్‌బోర్న్‌లో భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 195 పరుగులు చేయగా, రెండో ఇన్నింగ్స్‌లో 200 పరుగులు చేసింది. దీనికి సమాధానంగా భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 326 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 70 పరుగులు చేసి విజయం సాధించింది. టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో అజింక్య రహానే సెంచరీ సాధించాడు. 233 బంతుల్లో 112 పరుగులు చేశాడు. భారత్ విజయంలో ఇది కీలకంగా మారింది.

గబ్బా, బ్రిస్బేన్ టెస్ట్, 2021..

గబ్బాలో ఆస్ట్రేలియాపై టీమిండియా 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 369 పరుగులు చేసింది. కాగా రెండో ఇన్నింగ్స్‌లో 294 పరుగులు చేసింది. దీనికి సమాధానంగా టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 336 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 329 పరుగులు చేసింది. టీమిండియా ప్లేయర్ రిషబ్ పంత్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు. రెండో ఇన్నింగ్స్‌లో 89 పరుగులు చేశాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us